స్టాలిన్ కు లోకేష్ షాక్ !

Publish Date:Mar 12, 2025

Advertisement

ప్రాంతీయ, భాష వాదాలను రెచ్చగొట్టి, దక్షణాది రాష్ట్రాలపై తమిళ ఆధిపత్యాన్నిరుద్దేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి, డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ కుగట్టి ఎదురు దెబ్బ తగిలింది. తమిళనాడు ముఖ్యమంత్రి మాతృ భాష ను రాజకీయం చేయడం పట్ల  ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  తనదైన స్టైల్లో  స్పందించారు.  స్టాలిన్ పేరు నేరుగా ప్రస్తావించ కుండానే మంత్రి లోకేష్,  మాతృభాష అంశంపై పొరుగు రాష్ట్రాలు అనవసర రాజకీయం చేస్తున్నాయని  సున్నితంగా చురకలు అంటించారు. ఎవరి మాతృ భాషను వారు కాపాడుకోవాలి  కానీ మీరు  భాషను రాజకీయం చేయడం తగదు అని కుండ బద్దలు కొట్టారు.   అయినా కావాలని కొందరు దీనిని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం జర్మనీ, జపనీస్ భాషలు.. మన విద్యార్థులు నేర్చుకొంటున్నారని గుర్తు చేశారు. అలాంటి వేళ.. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం లో ప్రతిపాదించిన త్రిభాషా విధానం ఎలా తప్పవుతోందని మంత్రి లోకేష్  సూటిగా  ప్రశ్నించారు. 

నిజానికి కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన త్రిభాషా విధానంలో ఎక్కడా కూడా, డిఎంకే ఆరోపిస్తున్నట్లుగా హిందీని మూడవ భాషగా అమలుచేసి తీరాలనే నిబంధన లేదు. జాతీయ విద్యా విధానం ముసాయిదాలో, ఒక్క తమిళనాడు అని మాత్రమే కాదు, దేశంలోని ఏ రాష్ట్రంలోనూ హిందీని మాత్రమే మూడవ భాషగా రుద్దే ప్రయత్నం కానీ ప్రతిపాదన కానీ లేదు. మాతృ భాష  ఇంగ్లీష్ తో పాటుగా మరో భారతీయ భారతీయ భాష బోధించాలని మాత్రమే  జాతీయ విద్యా విధానం  ముసాయిదాలో పేర్కొన్నారు. నిజానికి స్టాలిన్ కు ఈ విషయం తెలియదని కాదు. తెలుసు, అందుకే  ముందు ఓకే చెప్పి ఇప్పడు రాజకీయ అవసరాల కోసం లేని అంశాన్ని తీసుకొచ్చి వివాదం చేస్తున్నారని  అంటున్నారు.  

అందుకే తమిళ నాడు శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో, అధికారాన్ని నిలబెట్టుకునేందుకు  ప్రజలను రెచ్చ గొట్టేందుకు  డిఎంకె  చేస్తున్న అనేక ప్రయత్నాలో ఇది మరొక  ప్రయత్నంగానే  రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.  అధికార డిఎంకె ఇంత వరకు చరిత్రలో ఎప్పుడూ వరసగా రెండవ సారి విజయం సాధించలేదు. ఈ సారి కూడా అదే జరుగుతుందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. అందుకే ఏదో విధంగా అధికారాన్ని నిలుపుకునేందుకు అనవసర వివాదాలు సృష్టిస్తోందని  విమర్శకులు అంటున్నారు. 

ముఖ్యంగా తమిళ సూపర్ స్టార్ విజయ్ రాజకీయ అరంగేట్రంతో  తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణలు మారి పోతున్నాయి. మరో వంక, తమిళిగ వెట్రి కళగం పేరిట పార్టీని స్థాపించిన విజయన్ , ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాటలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా అన్నా డిఎంకె,  ఇతర పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.ఇంతవరకు, కూటమికి స్పష్టమైన రూపం రాక పోయినా, సరైన సమయంలో కూటమి ఏర్పడుతుందనే విశ్వాసం ప్రతిపక్ష నేతలు వ్యక్తపరుస్తున్నారు.   మరో వంక స్టాలిన్ ప్రభుత్వం పై  అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత రోజు రోజుకు బలపడుతోంది. ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. అందుకే   ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారాన్ని నిలుపుకునేందుకు ప్రాంతీయ వాదాన్ని, భాషా వివాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. అలాగే  ముఖ్యమంత్రి స్టాలిన్, డిఎంకె నేతలు తమ ప్రభుత్వ  వైఫల్యాలకు, సెంటిమెంట్  ముసుగు చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. హిందీ భాషను ఒక భూతంగా, చూపించి దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఏకం చేసి   దక్షిణాది రాష్ట్రాల జాతీయ నేతగా  ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో జయలలిత కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి వరుసగా రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పడు స్టాలిన్ కేంద్రం పై కాలు దువ్వడానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు. అయితే  రాష్ట్రంలో అధికారం నిలుపుకోవడంతో పాటుగా  దక్షిణాది రాష్ట్రాల పొలిటికల్ సూపర్ స్టార్ గా తనను ఫోకస్ చేసుకునేందుకు స్టాలిన్ చేస్తున్నప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడవలసి వుంది.

విషయం గ్రహించే  దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు స్టాలిన్ ప్రకటనలపై ఆచితూచి స్పదిస్తున్నాయి. అయితే  డిఎంకె మాత్రం పార్లమెంట్ లోపలా వెలుపల కూడా, తమిళనాడులో’ అధికారం నిలుపుకోవడంతో  పాటుగా  దక్షిణాది రాష్ట్రాలపై తమిళ జెండా ఎగరేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే  లోకేష్ సరైన సమయంలో సరైన విధంగా స్పందించారు. తమిళ పప్పులు తెలుగు నాట ఉడకవని  స్టాలిన్ కు షాక్ ఇచ్చారు.

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.