మండలిలో లోకేశ్ విశ్వ‌రూపం.. కొడాలి నాని, వంశీకి ఇక ద‌బిడిదిబిడే!

Publish Date:Nov 14, 2024

Advertisement

తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌కు వెన్నులో వ‌ణుకుపుడ‌తోంది. పోలీసులు ఎవ‌ర్ని ఎప్పుడు అరెస్టు చేస్తారో తెలియ‌క చాలామంది ర‌హ‌స్య ప్రాంతాల‌కు వెళ్లి త‌ల‌దాచుకుంటున్నారు. వైసీపీ హ‌యాంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా అస‌భ్య‌ ప‌ద‌జాలంతో టీడీపీ, జ‌న‌సేన నేత‌లు, వారి కుటుంబాల్లోని ఆడ‌వారిపై పోస్టులు పెట్టారు. వారిలో అనేక మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినీ ప్ర‌ముఖుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు  పోలీసులు నోటీసులిచ్చారు. మ‌రోవైపు శ్రీ‌రెడ్డి, పోసాని కృష్ణ ముర‌ళిల‌పై ఏపీలోని ప‌లు పోలీస్ స్టేష‌న్‌ల‌లో కేసులు న‌మోద‌య్యాయి.  వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్  వ‌ర్రా ర‌వీంద్ర‌రెడ్డి అరెస్టుతో సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. తాడేప‌ల్లిలోని జ‌గ‌న్ నివాసానికి కొద్దిదూరంలో వైసీపీ సోష‌ల్ మీడియా కార్యాల‌యాన్ని ఏర్పాటుచేసి పార్టీ సోష‌ల్ మీడియా ఇంచార్జి స‌జ్జ‌ల‌ భార్గ‌వ్ సూచ‌న‌ల‌తో ఈ అస‌భ్య‌పోస్టుల తంతు న‌డిచేద‌ని తేలింది. వంద‌లాది మంది సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల‌కు నెల‌వారి జీతాలు అందించి టీడీపీ, జ‌న‌సేన నేత‌ల‌పై అస‌భ్య‌ పోస్టులు పెట్టించేవార‌ని తేలింది. మ‌రోవైపు వైఎస్ ష‌ర్మిళ‌, విజ‌య‌మ్మ‌, సునీత‌ల‌పై ఎంపీ అవినాశ్ రెడ్డి సూచ‌న‌ల‌తో ఆయన పీఏ ద్వారా వ‌చ్చిన కంటెంట్‌ను త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేసేవాడిన‌ని పోలీసుల విచార‌ణ‌లో వ‌ర్రా ర‌వీంద్ర‌రెడ్డి పేర్కొన్న‌ట్లు తెలిసింది. 

వ‌ర్రా ర‌వీంద్ర‌రెడ్డిపై కేసు న‌మోదు చేసి జైలుకు పంపించిన పోలీసులు.. ఎంపీ అవినాశ్ రెడ్డి, స‌జ్జ‌ల భార్గ‌వ్ ల‌పైనా కేసులు న‌మోదు చేశారు. వారు ప‌రారీలో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ వ్య‌వ‌హారం అంతా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి తెలిసే జ‌రిగింద‌న్న వాద‌న ఉండ‌టంతో ఆ మేర‌కు పోలీసులు విచార‌ణ ముమ్మ‌రం చేశారు. మ‌రోవైపు అసెంబ్లీ స‌మావేశాల్లో సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ లు సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌కరంగా, వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసి పోస్టులు, ఫొటోలు మార్ఫింగ్ చేసి పోస్టులు చేస్తే ఎవ‌ర్నీ వ‌దిలి పెట్టేదిలేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, శాస‌న మండ‌లిలో సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల‌పై వైసీపీ స‌భ్యులు అభ్య‌త‌రం తెలిపారు. కూట‌మి ప్ర‌భుత్వం కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నద‌ని, వైసీపీ నాయ‌కుల‌ను జైళ్ల‌కు పంపించేందుకు సోష‌ల్ మీడియాను అడ్డుపెట్టుకుంటుందంటూ ఆరోప‌ణ‌లు గుప్పించారు. దీంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష స‌భ్యుల మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్ర‌మంలో  జ‌గ‌న్‌ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా పారిపోయారంటూ టీడీపీ స‌భ్యులు ఎద్దేవా చేశారు.  దీంతో బొత్స స‌త్య‌నారాయ‌ణ స్పందిస్తూ.. చంద్రబాబు నాయుడు పారిపోలేదా? అంటూ నిలదీశారు. బొత్స వ్యాఖ్య‌ల‌పై మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యాడు.

గత ప్రభుత్వంపై చంద్రబాబు రెండేళ్లు సభలో ఉండి పోరాడిన విషయాన్ని లోకేశ్ గుర్తుచేశారు. నా తల్లిని అవమానించడంతోనే సభ నుంచి ఆయన చాలెంజ్ చేసి వెళ్లిపోయారన్నారు. ఈ సమయంలో జగన్ కుటుంబంపై కూడా అన్నారని కొంత మంది వైసీపీ సభ్యులు అన‌డంతో.. వారికి లోకేశ్‌ గట్టిగా రిప్లయ్ ఇచ్చాడు. తాము జగన్ కుటుంబాన్ని ఒక్క మాట కూడా అనలేదని స్పష్టం చేశారు. త‌న త‌ల్లిని అసెంబ్లీ వేదిక‌గా అవ‌మానించార‌ని వారిని వ‌దిలిపెట్టేది లేద‌ని స్ప‌ష్టం చేశాడు. వైఎస్ ష‌ర్మిల‌, విజ‌య‌మ్మ‌ల‌పైనా అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టార‌ని, అలాంటి వారిని అరెస్టు చేయ‌కుంటే ఏం చేస్తార‌ని లోకేశ్ తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. లోకేశ్‌ ఆవేశాన్ని చూసి వైసీపీ సభ్యులు చర్చను పొడిగించలేదు. నారా భువనేశ్వరిని కించపరిచిన వారిని తాము ప్రోత్సహించబోమని బొత్స చెప్పుకొచ్చారు. అయితే, ఎన్నిక‌ల్లో టికెట్ ఎలా ఇచ్చార‌ని, అలా చేస్తే వారిని ప్రోత్స‌హించిన‌ట్లే క‌దా అంటూ లోకేశ్ ప్ర‌శ్నించ‌డంతో.. వైసీపీ స‌భ్యులు నోరు మెద‌ప‌లేదు. మొత్తానికి నారా భువ‌నేశ్వ‌రిపై అస‌భ్య‌ వ్యాఖ్య‌లు చేసిన వారిని వ‌దిలిపెట్టేది లేద‌ని మండ‌లి వేదిక‌గా లోకేశ్ మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. దీంతో భువ‌నేశ్వ‌రిపై వ్యాఖ్య‌లు చేసిన కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ, వారి అనుచ‌రుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. 

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ అరెస్టులు ఉంటాయ‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, ప‌లు కేసుల్లో కొంద‌రు వైసీపీ నేత‌లను అరెస్టు చేసిన పోలీసులు.. కొడాలి నాని, వంశీల జోలికి మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు వెళ్ల‌లేదు. పార్టీ కార్యాల‌యంపై దాడి కేసు విష‌యంలో వంశీపై మాత్ర‌మే కేసు న‌మోదైంది. అయితే, వారిద్ద‌రూ తెలుగుదేశంలోని కీల‌క నేత‌ల ద్వారా  చంద్ర‌బాబు, లోకేశ్ వ‌ద్ద‌కు రాయ‌బారాలు న‌డుపుతున్న‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. త‌మ‌ను క్ష‌మించాల‌ని, బ‌హిరంగంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు సిద్ధ‌మ‌ని వారు తెలుగుదేశం ముఖ్య‌ నేత‌ల వ‌ద్ద ప్ర‌స్తావించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో శాస‌న మండ‌లిలో లోకేశ్ చేసిన వ్యాఖ్య‌లు కొడాలి నాని, వంశీ, వారి వ‌ర్గీయుల్లో భ‌యాందోళ‌ను రేకెత్తిస్తున్నాయి. లోకేశ్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వారిద్ద‌రిని వ‌దిలిపెట్ట‌రని, వారు జైలుకెళ్ల‌డం ఖాయ‌మ‌ని తెలుగుదేశం వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే కొడాలి నాని, వంశీ అరెస్టు కోసం టీడీపీ శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. ముందుగా వారిద్ద‌రిని అరెస్టు చేయాల‌న్న డిమాండ్‌ను చంద్ర‌బాబు, లోకేశ్ వ‌ద్ద ప‌లువురు తెలుగుదేశంనేత‌లు ఇప్పటికే తీసుకువచ్చారు.  రెడ్‌బుక్ చాప్ట‌ర్‌-3 త్వ‌ర‌లో ఓపెన్ అవుతుంద‌ని, అందులో కొండాలి నాని, వంశీ పేర్లు ఉంటాయ‌ని స‌మాచారం.

By
en-us Political News

  
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.