భాషా: సలాం వాలేకుం మౌలానా సాబ్ సాబ్ . ఢిల్లీ లో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయాడు. ఇస్లాంను నమ్మే అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడం బాధగా ఉంది. ముస్లిం రాజకీయనేతలే అల్లాకు ధన్యవాదాలు తెలిపిన సందర్బాలు అనేకం. ఒక హిందూ మతంలో పుట్టిన కేజ్రీవాల్ ఇస్లాంను అనుసరించి పాలన చేసినప్పటికీ మళ్లీ అధికారంలో రాలేకపోయాడు.
మౌలానా: చూడు భాషా అరవింద్ కేజ్రీవాల్ఉన్నత చదువులతో ప్రభుత్వోద్యోగంలో చేరాడు. అన్నాహజారే స్పూర్తితో అవినీతికి వ్యతిరేక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలో హర్యానా రాజకీయాల్లో ఎంటర్ అయిన తర్వాత సక్సెస్ అయ్యాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఇస్లాం అమలు విషయంలో కానీ, ముస్లింల సంక్షేమం, అభివృద్ది విషయంలో చేసింది శూన్యం. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ‘మై అల్లా కో శుక్ రియా అదా కర్తా హుం ’ అనడం నేను విన్నాను. అల్లాకు కృతజ్ఞత చెప్పిన వ్యక్తి వేల కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. లిక్కర్ స్కాం చేశాడు. ఇస్లాంలో లిక్కర్ వ్యాపారం మహాపాపం. ఇస్లాంలో మద్యపానం నిషేధం. ఖురాన్ కూడా ఇదే చెబుతుంది. త్రాగడం వల్ల మనిషి విచక్షణ కోల్పోతాడు. ఒక చుక్క మద్యం సేవించినా అపచారం. డాక్టర్ ప్రిస్కైబ్ చేసే మందులు పని చేయకపోతే వేరే మందులు ప్రిస్కైబ్ చేస్తాడు. మద్యం కూడా అంతే. వదిలేయాల్సిందే. అల్లాకు ఇష్టం లేని పని చేయకూడదు. రంజాన్ లో ఉపవాసదీక్షలు ప్రతీ ముస్లిం విధి. కానీ ఇస్లాంను అమలు చేయని వ్యక్తి ఉపవాసాలు చేసినప్పటికీ ఫలితం శూన్యం.
తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని అధికారంలో వచ్చిన టిఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో రాణించాలన్న కాంక్షతో బిఆర్ఎస్ గా రూపాంతం చెందింది. ఉద్యమనేత కెసీఆర్ కూతురు కవిత పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్ల అవినీతికి పాల్పడింది. ఢిల్లీలో మద్యం వ్యాపారానికి తెరలేపింది. అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ తో దోస్తీ చేసింది. లిక్కర్ స్కాం చేసింది. ప్రజలు బిఆర్ఎస్ ను ఓడించారు. ఆ తర్వాత ఇద్దరూ జైలుపాలయ్యారు. అటు తెలగాణలో బిఆర్ఎస్ ను ఇటు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీని ఇంటికి పంపించారు. చూశావా భాషా అల్లా ఎందుకోసం లిక్కర్ హరామ్ అన్నాడో అర్థమైందా
బదనపల్లి శ్రీనివాసాచారి
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/liquor-scam-kejriwal-bought-39-192612.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది