Publish Date:Apr 12, 2026
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించి, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త ఉత్సాహానికి కారణమైంది. ముఖ్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి కేంద్రం నిర్ణయం వేయి ఏనుగుల బలాన్నిచ్చింది. ఇక అమరావతి అభివృద్ధి వాయువేగంతో సాగుతుందన్న నమ్మకాన్ని ప్రజలకు ఇచ్చింది. అయితే కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
గతంలో ఢిల్లీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు చక్రం తిప్పేవారు. ఇప్పుడు ఆ కీలక భూమిక లోకేష్ పోషిస్తున్నారన్నది రాజకీయవర్గాలలో టాక్. అమరావతికి సంబంధించిన కీలక అనుమతులు సాధించడంలో లోకేష్ కీలక పాత్ర పోషించారనీ, ఢిల్లీ వేదికగా ఎన్డీయే కూటమిలోని కీలక నేతలను, ఎంపీలను సమన్వయం చేస్తూ అమరావతి ఆవశ్యకతను వివరించడంలో లోకేష్ సక్సెస్ అయ్యారనీ అంటున్నారు. పార్లమెంటు సమావేశాల సమయంలోనూ అక్కడే ఉండి ఎప్పటికప్పుడు పరిణామాలను గమనిస్తూ అమరావతికి రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టబద్ధ గుర్తింపు లభించేలా చేశారనని చెబుతున్నారు.
అమరావతికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన అనంతరం, లోకేష్ మరోసారి ఢిల్లీకి చేరుకున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పర్యటన లోకేష్ రాజకీయ పరిణతికి అద్దం పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనపై దృష్టి సారిస్తుండగా, జాతీయ స్థాయిలో పార్టీ గళాన్ని వినిపించడం, రాష్ట్రప్రయోజనాల సాధనకు కృషి చేయడం వంటి బాధ్యతను లోకేష్ భుజాన వేసుకున్నారని అంటున్నారు.
రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణతో పాటు, కేంద్రం నుంచి రావాల్సిన సహాయ సహకారాల విషయంలోనూ లోకేష్ వరుసగా జాతీయ నాయకులను కలుస్తున్నారు. తండ్రి నారా చంద్రబాబు రాజకీయ వారసత్వాని అందిపుచ్చుకుంటూనే.. అదే సమయంలో రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధిస్తున్నారని చెబుతున్నారు. లోకేష్ చొరవతో అమరావతికి మార్గం సుగమం కావడమే కాకుండా, భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధికి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ఎన్డీయే వర్గాలే అంటున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/legal-status-for-amaravati-39-217214.html
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.