ఆస్తులు కన్నా ఆదర్శాలే ముఖ్యమనుకున్న గొప్ప వ్యక్తి..... లాల్ బహాదూర్ శాస్త్రి వర్ధంతి..!

Publish Date:Jan 10, 2025

Advertisement

 

ఈ  రోజుల్లో  రాజకీయ నాయకులు అనగానే డబ్బు, హోదా, ఖరీదైన కార్లు  గుర్తొస్తాయి. ఎందుకంటే రాజకీయం అనగానే డబ్బు ఆర్జించే ఒక మార్గం అయిందిప్పటి కాలంలో. కానీ ఒక జాతీయ స్థాయి నాయకుడై  ఉండి, ఒక దేశ ప్రధానై  ఉండి కూడా  ఒక పాత కారుని ఈఎంఐ పద్ధతిలో  కొనుక్కున్నారొక మహనీయుడు.   వ్యక్తిగత ఆస్తి కూడబెట్టటం కంటే ప్రజా సేవనే ధ్యేయంగా పని చేశారాయన.  ఆయన ఎవరో కాదు..  జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో భారత ప్రజలను చైతన్యం చేసిన లాల్ బహదూర్ శాస్త్రి.  అందరూ ముద్దుగా శాస్త్రిజీ అని పిలుచుకునే లాల్ బహదూర్ శాస్త్రిగారు ఆస్తులకన్నా ఆదర్మాలే ముఖ్యమని నమ్మారు. అదే నేడు ఆయన్ను గొప్ప దేశ నాయకుడిగా నిలబెట్టింది. నిబద్దత, క్రమశిక్షణ, నిస్వార్థ గుణం,నమ్రత, విధేయత  కలిగిన పాతతరపు నాయకుల్లో ఈయన ఒకరు. మన దేశానికి రెండవ ప్రధానమంత్రిగా సేవలందించిన  లాల్ బహదూర్ శాస్త్రి వర్థంతి నేడు.. ఈ సందర్భంగా ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలు తెలుసుకంటే..


లాల్ బహాదూర్ శాస్త్రి 1904 అక్టోబర్2న మొగల్‌సరాయ్‌లో జన్మించారు. చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయారు. తండ్రి మరణానంతరం లాల్ బహాదూర్ శాస్త్రి  ఆయన చెల్లెల్లు వారి మామయ్య అయిన మున్షీ హజారీలాల్ ఇంట్లో పెరిగారు. 1928లో శాస్త్రి గారెకి  లలితా దేవితో వివాహం జరిగింది. ఆయనకి  నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కుటుంబ సభ్యులు అంతా కూడా సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు.


స్వాతంత్రోద్యమంలో పాత్ర..

లాల్ బహాదూర్ శాస్త్రి హరిశ్చంద్ర హైస్కూల్‌లో ఉన్నప్పుడు దేశభక్తి, ప్రజాదరణ పొందిన ఉపాధ్యాయుడు నిష్కామేశ్వర్ ప్రసాద్ మిశ్రాగారి  ప్రేరణతో స్వాతంత్రోద్యమం పట్ల ఆకర్షితుడయ్యారు.  మహాత్మా గాంధీ, పండిట్ మదన్ మోహన్ మాలవ్య నిర్వహించిన ఒక సమావేశానికి వెళ్ళిన శాస్త్రి  ప్రభుత్వ పాఠశాలల నుండి విద్యార్థులు బయటకు రావాలన్న  పిలుపు మేరకు, ఆ మరుసటి రోజే హరిశ్చంద్ర హైస్కూల్‌ను వదిలేశారు. వాలంటీరుగా చేరి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలలో పాల్గొన్నారు. ఆయన అనేక సార్లు జైలు శిక్షను అనుభవించారు. 1925లో కాశీ విద్యాపీఠం నుండి “శాస్త్రి” బిరుదుతో పాటూ తత్వశాస్త్రం, నైతిక శాస్త్రంలో పట్టా పొందారు. ఆయన లాలాలజపతిరాయ్ స్థాపించిన “లక్ సేవక్ మండల్”లో చేరి మహాత్మా గాంధీ నాయకత్వంలో ముజఫర్‌పూర్‌లో హరిజనుల కోసం పనిచేశారు. 1928లో మహాత్మా గాంధీ ఆదేశాల మేరకు భారత జాతీయ కాంగ్రెస్‌లో పూర్తి స్థాయి సభ్యుడిగా చేరారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నందుకు రెండు సంవత్సరాలపాటు జైలులో ఉన్నారు. 1940లో వ్యక్తిగత సత్యాగ్రహానికి మద్దతు తెలపడం వల్ల ఏడాది జైలులో గడిపారు. 1937, 1946లలో ఆయన యునైటెడ్ ప్రావిన్సెస్ శాసనసభకు ఎన్నికయ్యారు.

నిర్ణయాలు అద్బుతం..


భారత స్వతంత్రానంతరం శాస్త్రి ఉత్తరప్రదేశ్‌లో రవాణా, పోలీసుశాఖా మంత్రిగా సేవలందించారు. ఆయన రాజకీయ  పరంగా తీసుకున్న నిర్ణయాలు చాలా అద్బుతమైనవి. ఆయనే మొదటిసారి మహిళా కండక్టర్ల నియామకానికి మార్గం చూపించారు.  నిరసనల సమయంలో లాఠీలకు బదులుగా నీటి గొట్టాలను ఉపయోగించడానికి ఆదేశాలు జారీచేశారు. 1951లో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా, 1952లో రైల్వే, రవాణాశాఖ మంత్రిగా, 1961లో హోం మంత్రిగా పని చేశారు. నెహ్రూ మరణానంతరం 1964లో భారతదేశ రెండవ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.


ప్రధానిగా..

1965భారత-పాక్ యుద్ధం సమయంలో ‘జై జవాన్ జై కిసాన్’ అనే  నినాదంతో జవాన్లను, రైతులను చైతన్య పరిచారు. పాల ఉత్పత్తిని పెంచడానికి అతి పెద్ద ఉద్యమానికి మద్దతుగా  అమూల్ సహకార సంఘానికి అండగా నిలిచారు. హిందీ భాషకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలను శాంతి పూర్వకంగా పరిష్కరించారు. పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌తో కలిసి తాష్కెంట్ డిక్లరేషన్‌పై సంతకం చేశారు. ఆయన హయాంలో విధ్యా సంస్థలు, డ్యాములు, పోర్టులు ఎన్నో నిర్మితమయ్యాయి.   దేశ అభివృద్ధిలో ఆయన చేసిన  కృషి అమోఘం. ఆయన  ప్రధానమంత్రి హోదాలో  సోవియట్ యూనియన్, ఇంగ్లాండ్, కెనడా, నేపాల్, ఈజిప్ట్, బర్మా వంటి అనేక దేశాలను సందర్శించి విదేశాలతో మన దేశ సంబంధాలు మెరుగుగా ఉండేలా చేశారు.

మరణం..

శాస్త్రిగారు  1966వ సంవత్సరం,  జనవరి 11న తాష్కెంట్‌లో మరణించారు. 1965 ఇండో-పాక్ యుద్ధానికి శాంతి ఒప్పందంపై సంతకం చేసిన మరుసటి రోజే ఇలా జరిగింది. ఆయనను ఒక జాతీయ హీరోగా గుర్తించి, ఢిల్లీలో విజయ ఘాట్ స్మారక చిహ్నాన్ని నిర్మించారు. లాల్ బహాదూర్ శాస్త్రి చాలా సాధారణ జీవితం గడిపారు. వ్యక్తిగత ఆస్తిని కూడబెట్టకుండా, ప్రజలకు సేవ చేయడంలో జీవితం గడపాలని ఉద్దేశించిన సేవక్ సొసైటీ సభ్యుడుగా ఉండేవారు.  శాస్త్రిగారి జీవితం నైతిక విలువలు, నమ్రత,  ప్రజా సేవకు ఆదర్శంగా నిలిచింది. తన జీవితాంతం ప్రజల కోసం పనిచేసి, దేశ అభివృద్ధికి విశేషమైన కృషి చేసి భారతదేశ చరిత్రలో మర్చిపోని నాయకుడిగా నిలిచారు.


                                           *రూపశ్రీ.

By
en-us Political News

  
మోసం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే పూర్తీ నష్టం జరిగిన తర్వాత మాత్రమే మోసం జరిగింది అని ఎవరైనా తెలుసుకోగలుగుతారు. కొలీగ్స్, స్నేహితులు, బంధువులు.. ఇలా ఎవరి చేతులో మోసపోయినా తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుంది.
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.