కర్నూలులో కాల్పుల కలకలం.!
Publish Date:Jul 26, 2026
Advertisement
కర్నూలులో ఆదివారం (జులై26) కాల్పులు కలకలం రేపాయి. కర్నూలులోని ద్ధ వీఆర్ఎన్ బ్యాడ్మింటన్ అకాడమీ సమీపంలో జరిగిన ఈ ఘటన ఆందోళన రేపింది. కారులో వచ్చిన ఇద్దరు అగంతకులు.. హఠాత్తుగా గాలిలోకి కాల్పులు జరిపారు. కర్నూలు బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్' టోర్నమెంట్ ముగింపు వేడుకల వేళ ఈ దుర్ఘటన జరగడం స్థానికంగా పెద్ద కలకలాన్నే రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని, భయాందోళనలో ఉన్న స్థానిక ప్రజలకు ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను, బుల్లెట్ అవశేషాలను సేకరించేందుకు క్లూస్ టీమ్ను రంగంలోకి దించారు. విశ్వసనీయంగా తెలిసిన సమాచారం మేరకు కర్నూలు బ్యాడ్మంటన్ లీగ్ పోటీల ఫైనల్స్ లో అశోక్ నగర్కు చెందిన స్థిరాస్తి వ్యాపారి కౌశిక్ నేతృత్వంలోని టీమ్ ఓటమి పాలైంది. మ్యాచ్ ఓడిపోవడంతో మద్యం సేవించిన కౌశిక్, అతడి మిత్రులు కర్నూలు నివాసి శ్రీకుమార్ రెడ్డితో గొడవకు దిగారు. దీంతో నిర్వాహకులు, స్థానికులు చొరవ తీసుకుని గొడవ పడుతున్న వారిని వారించి అకాడమీ నుంచి బయటకు పంపించివేశారు. అయితే అకాడమీ నుంచి బయటకు వచ్చిన కౌశిక్ ప్ర రివాల్వర్తో విచక్షణారహితంగా గాల్లోకి 2 రౌండ్లు, నేలపైకి 1 రౌండ్ చొప్పున మొత్తం 3 రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో కొందరు స్థానికులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటనతో చాణక్యపురి కాలనీ పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే కర్నూలు త్రీటౌన్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రచ్చ సృష్టించిన కౌశిక్తో పాటు ఆయన మిత్రుడు అశోక్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రాథమిక విచారణలో కౌశిక్కు రివాల్పర్ లైసెన్స్ ఉన్నట్లు గుర్తించారు.
http://www.teluguone.com/news/content/kurnool-firing-incident-36-227168.html





