కుప్పం ఇక ఇండస్ట్రియల్ హబ్..చంద్రబాబు విజన్‌కు మరో అడుగు..!

Publish Date:Jul 3, 2026

Advertisement

 

పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పన, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా కుప్పం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టిన అనంతరం ఆయన నేరుగా కుప్పం చేరుకుని గుడుపల్లె మండలం పొగురుపల్లెలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

రూ.200 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రీన్‌ఫీల్డ్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు APIIC ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ రెండు ప్రాజెక్టులు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా రైతులకు స్థిరమైన మార్కెట్‌ను అందించనున్నాయి.

30.75 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ యూనిట్‌ను సందర్శించిన సీఎం ప్లాంట్ కార్యకలాపాలను పరిశీలించారు. వివిధ విభాగాల పనితీరును సంస్థ ప్రతినిధులు ఆయనకు వివరించారు. సంస్థ నిర్వహించిన జాబ్ ఫెయిర్‌లో ఎంపికైన యువతకు ముఖ్యమంత్రి నియామక పత్రాలు అందజేశారు. ఈ నెల నుంచే వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానున్న ఈ యూనిట్ ద్వారా మొత్తం 1,400 మందికి ఉపాధి లభించనుండగా, అందులో 700 ప్రత్యక్ష, 700 పరోక్ష ఉద్యోగాలు ఉన్నాయి. తొలి దశలోనే 300 నుంచి 400 మంది యువతకు ఆఫర్ లెటర్లు అందజేశారు.

ఈ పరిశ్రమ ద్వారా స్థానిక పౌల్ట్రీ రైతులకు గిట్టుబాటు ధరలతో మార్కెట్ లభించడంతో పాటు ఒప్పంద పద్ధతిలో కోళ్ల పెంపకానికి అవకాశాలు విస్తరించనున్నాయి. ఫీడ్ సరఫరా, రవాణా, అనుబంధ రంగాలకు కూడా ఈ యూనిట్ ఊతమివ్వనుంది.

అనంతరం 44.58 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన APIIC ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను సీఎం ప్రారంభించారు. ఈ పార్కులో ఏర్పాటు చేసిన 167 పారిశ్రామిక ప్లాట్ల కేటాయింపు ప్రక్రియను జూలై నెల నుంచే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు ఒకేచోట అందుబాటులో ఉండటం వల్ల కొత్త పెట్టుబడులు ఆకర్షితమై, స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. కుప్పాన్ని పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈ పార్క్ కీలక పాత్ర పోషించనుంది.

ఇక 7,489 మంది ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా రూ.28 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టును కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. అదేవిధంగా కనమానపల్లి, గంగాపురం, టీ సముద్రం, కృష్ణానగర్, బళ్ల గ్రామాల్లో రూ.25 కోట్లతో నిర్మించిన రెస్కో సంస్థకు చెందిన ఐదు సబ్‌స్టేషన్లను ప్రజలకు అంకితం చేశారు. కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రికి ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. పొగురుపల్లెకు వెళ్తున్న మార్గమంతా గ్రామస్తులు హర్షధ్వానాలతో స్వాగతించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, “కుప్పం నియోజకవర్గ చరిత్రలో ఇవాళ ప్రత్యేకమైన రోజు. ఏబీఐఎస్ ప్రోటీన్స్ సంస్థ ఇప్పటికే వందలాది మందికి ఉపాధి కల్పించింది. అత్యాధునిక సాంకేతికతతో దేశంలోనే అతిపెద్ద చికెన్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఒకటిని ఏర్పాటు చేయడం సంతోషకరం. దీనివల్ల స్థానిక రైతులకు, కోళ్ల పెంపకందారులకు, యువతకు ప్రయోజనం చేకూరుతుంది. తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన సంస్థ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను” అని అన్నారు.

“కుప్పానికి రైలు, రోడ్డు, విమాన అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు పరిశ్రమలను తీసుకొస్తున్నాం. అయితే వస్తున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కలిగిన వర్క్‌ఫోర్స్ కూడా సిద్ధం కావాలి. స్కిల్ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పరిశ్రమలు తీసుకురావడం నా బాధ్యత అయితే, వాటిని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించడం ప్రజల బాధ్యత” అని సీఎం పేర్కొన్నారు.

“పరిశ్రమలు, సేవారంగం, వ్యవసాయ రంగాల అభివృద్ధితో కుప్పాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాం. యువత ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి. నైపుణ్యాలను పెంపొందించుకుని వినూత్న ఆలోచనలతో ముందుకు సాగితే అపార అవకాశాలు సృష్టించుకోవచ్చు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పారిశ్రామికవేత్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

By
en-us Political News

  
సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలో నడుస్తున్న ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పోస్ట్ చేసిన ఒక వీడియో దాదాపు ఐదు గంటల పాటు అందుబాటులో లేకుండా పోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పార్లమెంటరీ కమిటీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి కారణాలను పది రోజుల్లోగా రాతపూర్వకంగా సమర్పించాలని మెటా యాజమాన్యాన్ని కమిటీ ఆదేశించింది.
ఆయన తీసుకున్న టారిఫ్ ల నిర్ణయానికి వ్యతిరేకంగా అమెరికాలోనే తిరుగుబాటు మొదలైంది. ప్రపంచ వ్యాపార రంగాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న ట్రంప్ టారిఫ్ టెర్రర్ కు వ్యతిరేకంగా అమెరికాలోని పాతిక రాష్ట్రాలలో వ్యతిరేక గళం బలంగా వినిపిస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డి దుబాయ్ లో ఉంటూ.. ఈ కేసులోని ఇతర నిందితులకు కూడా అక్కడ ఆశ్రయం కల్పించినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. ఐఐటీ ఖరగ్ పూర్ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యావంతుడు కిరణ్ కుమార్ రెడ్డి.. సునాయాసంగా డబ్బు సంపాదించాలన్న పేరాశతో మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడైన రాజ్ కేసి రెడ్డితో చేతులు కలిపాడని సిట్ దర్యాప్తు లో తేలింది. 
యాపిల్ ప్లాట్‌ఫామ్ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించేలా సున్నితమైన కంటెంట్ టెలిగ్రామ్‌లో కనిపించడమే టెలిగ్రామ్ ను యాపిల్ స్టోర్ నుంచి తొలగించడానికి కారణమని తెలిసింది. పిల్లలపై లైంగిక వేధింపులకు సంబంధించిన చైల్డ్ అబ్యూజ్ కంటెంట్ టెలిగ్రామ్ ఛానెళ్లలో వ్యాప్తి చెందినట్లు యాపిల్ బృందం గుర్తించింది.
సెబీ మార్గదర్శకాలతో భారత స్టాక్ మార్కెట్లో అమల్లోకి వచ్చిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS వివరాలు, ఎఫ్&ఓ షేర్ల నూతన ట్రేడింగ్ వేళలు మరియు ముగింపు ధర నిర్ణయించే ప్రక్రియ గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది యువత, విద్యార్థుల ఆశయాలు, ఆకాంక్షలు, ఆందోళనలు, అవసరాలను నేరుగా తెలుసుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్త పర్యటనకు కాక్రోచ్ జనతా పార్టీ శ్రీకారం చుట్టింది. లిజనింగ్ టూర్ పేర చేపట్టనున్న ఈ పర్యటన ద్వారా ప్రతి రాష్ట్రంలోని యువతతో నేరుగా మమేకమయ్యేందుకు కాక్రోచ్ జనతా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తున్నది.
అమేజాన్ ఆస్ట్రేలియాలో ఆపిల్ వాచ్ సిరీస్ 11 42mm, GPS పై ఏకంగా 37% దాకా భారీ డిస్కౌంట్ అందుబాటులోకి వచ్చింది. AU$252 ఆదా అయ్యే ఈ రికార్డు ఆఫర్ డీల్ వివరాలు, బ్యాటరీ లైఫ్ మరియు బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్ సహా కొత్త హెల్త్ ఫీచర్ల సమగ్ర సమాచారం ఇక్కడ తెలుసుకోండి.
GMKtec NEO X1 వర్క్‌స్టేషన్ పిసి అత్యంత వేగవంతమైన AMD Ryzen 9000HX సిరీస్ ల్యాప్‌టాప్ CPU మరియు NVIDIA RTX 5070 డెస్క్‌టాప్ GPU కాంబినేషన్‌తో లాంచ్ అయింది. 14.6L చిన్న పరిమాణంలో లిక్విడ్ కూలింగ్‌తో వచ్చిన ఈ పవర్‌ఫుల్ పిసి పూర్తి వివరాలు తెలుసుకోండి.
హెచ్‌బీవో మాక్స్ ఫేమస్ సిరీస్ స్టూవర్ట్ ఫెయిల్స్ టు సేవ్ ది యూనివర్స్ ఎపిసోడ్ 3 రిలీజ్ డేట్, ఇండియా స్ట్రీమింగ్ టైమింగ్స్ మరియు మొత్తం 10 ఎపిసోడ్‌ల కంప్లీట్ షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
రూ. 1.14 కోట్ల ఇన్కమ్ టాక్స్ చెల్లించిన వ్యక్తికి రూ. 10 రీఫండ్ వచ్చింది. సీఏ సుమిత్ శర్మ షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఐటీ నిబంధనలు మరియు సెక్షన్ 143 1 అసలు నిజాలను వెల్లడించాయి.
ప్రసిద్ధ కన్జ్యూమర్‌వేర్ బ్రాండ్ సెల్లో వరల్డ్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకునేందుకు ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బైన్ క్యాపిటల్ చర్చలు జరుపుతోంది. రూ. 3,000 కోట్లకు పైగా విలువైన ఈ డీల్ మరియు భారత మార్కెట్ సమీకరణాల వివరాలు ఇక్కడ చూడండి.
భారతీయ స్టాక్ మార్కెట్ క్లోజింగ్ వేళలు మారాయి! NSE మరియు BSE కొత్తగా ప్రవేశపెట్టిన క్లోజింగ్ ఆక్షన్ సెషన్ CAS టైమింగ్స్, F&O ట్రేడింగ్ మార్పులు మరియు ఇన్వెస్టర్లపై దీని ప్రభావం గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
హైదరాబాద్‌లో పుట్టి SRH నెట్ బౌలర్‌గా చేసిన బోడుగుమ్ అఖిలేష్ రెడ్డిపై ఐసీసీ 8 ఏళ్ల పాటు మ్యాచ్ ఫిక్సింగ్ నిషేధం విధించింది. అబుదాబి టి10 లీగ్‌లో జరిగిన ఈ ఘోర కుంభకోణం వెనుక ఉన్న పూర్తి నిజాలు ఇవే.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.