బాబు బాటలో కేసీఆర్?!

Publish Date:May 5, 2025

Advertisement

బీఆర్ఎస్  అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు తెలుగు దేశం అధినేత ,ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బాటలో అడుగులు వేస్తున్నారా?  లేదా వేయాలని అనుకుంటున్నారా? ఆయన బాటలోనే  సాగుతున్నారా లేదా సాగాలని అనుకుంటున్నారా?  అంటే బీఆర్ఎస్ వర్గాల నుంచి ఆ ప్రశ్నలన్నిటికీ  అవుననే సమాధానమే వస్తోంది. ఇటీవల ఘనంగా నిర్వహించిన రజతోత్సవం సంబురాల నేపధ్యంలో పార్టీలో, కుటుంబలో తలెత్తిన అంతర్గత సమస్యల పరిష్కారానికి  కేసీఆర్ పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. నిజమే. రజతోత్సవం సంబురాలు ఘనంగా జరిగాయి. అందులో సందేహం లేదు. అయితే..  గతంలో ఇక్కడే అనుకున్నట్లుగా.. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్’ అన్నట్లు ఆ కథ ముగిసింది.   

జనసమీకరణ ఘనంగా జరిగినా.. గులాబీ బాస్ స్పీచ్ అంతగా రక్తికట్టలేదు. ఉత్సాహంగా  వచ్చిన పార్టీ  క్యాడర్  నిరుత్సాహంగా తిరిగి వెళ్ళవలసి వచ్చిందని పార్టీ నాయకులే పెదవి విరిచారు. వందల కోట్లు ఖర్చు పెట్టి సంబురాలు చేసుకున్నా  చివరకు హళ్లికి హళ్లి సున్నకు సున్నా అన్నట్లుగా ఫలితం శూన్యం  అనే  ఆవేదన పార్టీలో వ్యక్తమవుతోంది. మరో వంక పార్టీ పునర్వ్యవస్థీకరణ అవసరాన్ని నాయకత్వం గుర్తించిందనీ, ముఖ్యంగా అంతర్గత కలహాలకు అంతకంటే ముఖ్యంగా కుటుంబంలో రగులుతున్న ట్రైయాంగిల్ వార్ కు పార్టీ పునర్వ్యవస్థీకరణ పరిష్కారం చూపుతుందని కేసేఆర్ భావిస్తున్నట్లు చెపుతున్నారు. నేపధ్యంలోనే కేసీఆర్ పార్టీ పునర్వ్యవస్థీకరణపై దృష్టి పెట్టారని అంటున్నారు. 

ఇక్కడే కేసీఆర్  తెలుగు దేశం  అధినేత చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో అడుగులు వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ రాష్ట్ర సమితి ( టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా  బీఆర్ఎస్  కు జాతీయ కార్యవర్గం ఇప్పటికీ ఏర్పడ లేదు. ఆఫ్కోర్స్  పూర్తి స్థాయి రాష్ట్ర కార్యవర్గం కూడా లేకుండానే, గులాబీ పార్టీ పాతికేళ్ళ ప్రస్థానం సాగించింది.  అది వేరే విషయం. 

అయితే  ఇప్పుడు  కేసీఆర్ గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు అన్ని స్థాయిల్లో పూర్తి స్థాయి కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షులు, జాతీయ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు ఇతర కీలక పదవులతో పార్టీ సంస్థాగత స్వరూపాన్ని పూర్తిగా మార్చే ఆలోచన కేసేఆర్ చేస్తున్నారని అంటున్నారు. అదే జరిగితే, తెలుగు దేశం పార్టీ చంద్రబాబును ఎలా జాతీయ అధ్యక్షునిగా ఎన్నుకుందో అలాగే..  బీఆర్ఎస్ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  కేసీఆర్ ని, పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంటుందని పార్టీ వర్గాల సమాచారం.   

అలాగే.. రాష్ట్రంలో ప్రస్తుతం  కుల గణన పునాదిగా  బీసీ రాజకీయం నడుస్తున్న  నేపధ్యంలో బీసీలలో పట్టున్న బలమైన బీసీ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షునిగా నియమించే  ఆలోచనలో  కేసేఆర్ ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ పగ్గాలను బీసీకి అప్పగించింది, బీజేపీ కూడా బీసీకే పట్టం కట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పగ్గాలను బీసీ నేతకు అప్పగించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు.  బీసీకి రాష్ట పార్టీ పగ్గాలు అప్పగించడం, ఉభయతారకంగా ఉంటుదని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో  బీసీలలో పట్టు సాధించేందుకు చంద్రబాబు నాయుడు, ఇదే వ్యూహాన్ని అనుసరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.    
అయితే.. రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇస్తే  కుటుంబ త్రయం,(కేటీఆర్, హరీష్ రావు, కవిత) పరిస్థితి ఏమిటి? అనే విషయంలో కేసీఆర్ ఎటూ తేల్చుకోలేక పోతున్నారని అంటున్నారు. రజతోత్సవ సభ వేదికపై అమర్చిన బ్యానర్ సహా స్వాగత తోరణాలు ఇతరత్రా ఏర్పాటు చసిన కటవుట్లు, బ్యానర్లలో కేసీఆర్, కేటీఆర్  తప్ప మరొకరికి చోటివ్వలేదు. ఇది పార్టీలో పెద్ద దుమారమే రేపినట్లు ప్రచారం జరుగుతోంది. సో.. కుటుంబ త్రయంను సంతృప్తి పరిచే విధంగా ఆ ముగ్గురికి పార్టీ పదవుల పంపకం ఎలా చేయాలన్న విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని అంటున్నారు. 

అయితే..  కేటీఆర్ ను బీఆర్ఎస్  జాతీయ సెక్రటరీ జనరల్  గా నియమించే ఆలోచన ఉందని అంటున్నారు. అలాగే.. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అన్నకేటీఆర్ తో పోటీ పడుతున్న కవితను రాష్ట్ర పార్టీలో సెక్రటరీ జనరల్ గా నియమించి ఇద్దరి మధ్య బాలన్స్ చేసే ఆలోచన  కేసీఆర్ చేస్తున్నారని అంటున్నారు. ఇక హరీష్ రావు విషయానికి వస్తే.. పార్టీలో ఆయన భవిష్యత్ భూమిక ఏమిటి అనేది ఇంకా స్పష్టం కాలేదు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతను అప్పగించడమా లేక కోర్ కమిటీలో కీలక బాధ్యతలు అప్పగించడమా అనే విషయంలో కేసీఆర్ ఇంకా నిర్ణయానికి రాలేదని అంటున్నారు. అలాగే, కేటీఆర్, హరేశ్, కవిత సహా కీలక నేతలు అందరికీ స్థానం కల్పిస్తూ..  పొలిట్  బ్యూరోను పునర్వ్యవస్థీకరించడంతో పాటుగా జిల్లా ఆధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల కార్యవర్గాలను పూర్తి స్థాయిలో పునరుద్దరించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం. 

అయితే..  అన్నిటిని మించి కేసీఆర్  చంద్రబాబు బాటలో,  చంద్రబాబు అడుగుఅడుగు జాడల్లో నడవాలనే నిర్ణయానికి వచ్చారని త్వరలోనే కేసీఆర్ సంస్థాగత మార్పులకు ఖాయంగా శ్రీకారం చుడతారని అంటున్నారు. అయితే ఫ్యామిలీ ట్రయో.. కుటుంబ త్రయం మధ్య సఖ్యత,   సమన్వయం  ఎలా సాధ్యం? ఎంత వరకు సాధ్యం? కే సీఆర్ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుంది? గులాబి పార్టీ భవిష్యత్ కు సంబంధించిన చాలా ప్రశ్నలకు ప్రస్తుతానికి అయితే సమాధానాలు లేవని అంటున్నారు.

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.