తెలుగుదేశం పార్టీతో కేశినేని నాని తెగతెంపులు ఖాయమైనట్లే కనిపిస్తున్నాయి. అయితే నాని ఆరోపిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీయే పొమ్మనలేక పొగపెట్టిందా? లేక పార్టీలో తమ్ముడు చిన్ని ఎదుగుదలను ఓర్వలేక తానే పొగపెట్టుకున్నాడా అంటే.. వేళ్లన్నీ కేశినేని నానివైపే చూపుతున్నాయనడంలో సందేహం లేదు. 2019 ఎన్నికలలో వైసీపీ హవాలో సైతం తాను గెలిచానని చెప్పుకుంటున్న నాని.. విజయవాడలో తెలుగుదేశం బలంతోనే తాను విజయం సాధించగలిగానన్న విషయాన్ని కన్వీనియెంట్ గా విస్మరిస్తున్నారు.
ఇక ప్రస్తుత పరిస్థితుల్లో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానంటూ చెప్పుకుంటున్న నాని విజయం విషయంలో వ్యక్తం చేస్తున్న ధీమాపై మాత్రం పరిశీలకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే నాని తనకు మహానాడుకు ఆహ్వానం అందలేదనీ, అలాగే బెజవాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికీ పిలవలేదని అంటున్నారు. తెలుగుదేశం ఎంపీ అయిన కేశినేని నాని ఆహ్వానం అందలేదనడమేమిటన్న ప్రశ్నకు మాత్రం ఆయన దగ్గర సమాధానం ఉన్నట్లు కనిపించడం లేదు. బొట్టు పెట్టి పిలవడానికి ఆ రెండు కార్యక్రమాలూ ఎవరింట్లోనో జరిగిన పెళ్లిళ్లూ, పేరంటాలూ కావు. పార్టీ కార్యక్రమాలు. పార్టీ కార్యక్రమానికి పార్టీ ఎంపీకి ఆహ్వానం ఏమిటి? స్వచ్ఛందంగా వెళ్లి చురుకుగా ఆ కార్యక్రమంలో నిమగ్నం కావాలి. అలా కాకుండా తనకు పార్టీతో ఏం సంబంధం లేదన్నట్లు దూరంగా ఉండి ఆహ్వానం అందలేదంటూ రాగాలు తీయడం ద్వారా ఆయన ఏ ఉద్దేశంతో ఉన్నారో చెప్పకనే చెప్పినట్లైంది.
గత కొంత కాలంగా అంటే తమ్ముడు చిన్ని పార్టీలో చురుకుగా పాల్గొనడం మొదలెట్టినప్పటి నుంచీ కేశినేని నాని తీరులో తేడా వచ్చింది. తమ్ముడా, తానా తేల్చుకోవాల్సింది పార్టీయే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీని వెనుక వైసీపీ వత్తాసు ఉందన్న అనుమానాన్ని తెలుగుదేశం శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా నాని తీరు వల్ల ఆయన తనంత తానుగా తెలుగుదేశం పార్టీకి దూరం కావాలనే నిర్ణయించుకున్నారన్నది విస్పష్టంగా తేలిపోతోంది.
గుర్రాన్ని ఎవరైనా చెరువు వరకూ తీసుకు వెళ్లగలరు కానీ, నీళ్లు తాగించలేరుగా. నాని పరిస్థితి కూడా సరిగ్గా అలాగే తయారైంది. పార్టీలో ఉండటం, ఉండకపోవడం ఆయన ఇష్టం. పార్టీ మాత్రం పని చేసే వాళ్లకే ప్రాముఖ్యత ఇస్తుందని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిన మాట కేశినేని నానికి కూడా వర్తిస్తుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/kesinenani-nani-distance-from-tdp-39-156561.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.