కవిత కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్!

Publish Date:Mar 27, 2026

Advertisement

 

తండ్రి కేసీఆర్ స్థాపించిన పార్గీ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్తపార్టీ స్థాపనకు రంగం సిద్దం చేసుకున్నారు. తెలంగాణ ప్రజా పార్టీగా నామకరణం చేసిన నూతన పార్టీని ఏప్రిల్ 25 తేదీన ఉదయం 10గం.లకు అధికారికంగా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. మేడ్చల్‌లోని మునిరాబాద్‌లో పార్టీ ప్రకటిస్తానని, అదే రోజు పార్టీ జెండా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు మంచి ముహూర్తం ఉందన్నారు.  రాముని ఆశీర్వాదంతో పార్టీ ప్రకటన తేదీని నిర్ణయించామని ముహుర్తాలపై తనకున్న నమ్మకాన్ని చాటుకున్నారు. వారణాసి వెళ్లి గంగా స్నానం చేసి పార్టీ నీ లంచ్ చేస్తామని జాగృతి అధ్యక్షురాలు స్పష్టం చేశారు. 

వాస్తవానికి ఏప్రిల్ 27న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి రెండు రోజుల ముందు పార్టీని, జెండాను ఆవిష్కరించనున్నట్లు కవిత ప్రకటించడం విశేషం. ఏఏ అంశాలపై కొత్త పార్టీ పోరాటం చేయాలో తమ దృష్టికి తీసుకురావాలని కవిత శ్రీరామ నవమి సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉందంటున్న కవిత, తెలంగాణ వచ్చినప్పటి నుంచి యువత  ఉద్యోగాల కోసం వేచి చూడాల్సి వస్తోందని పరోక్షంగా బీఆర్ఎస్‌పై మండిపడ్డారు.  తమ కొత్తపార్టీ ద్వారా యువత కోసం ఏం చేయబోతున్నామో చెబుతామని. యువత, మహిళలకు పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని కవిత వెల్లడించారు. 

జాగృతి సంస్థ ద్వారా బీసీలు, దళితుల హక్కుల కోసం పోరాటం చేశామని,  పార్టీ ఆవిర్భావం నాడు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలు,యువత పెద్ద ఎత్తున తరలిరావాలని కవిత కోరారు.  మొత్తానికి తెలంగాణ జాగృతి సంస్ధ...రాజకీయ పార్టీగా మారబోతుందిప్పుడు. తమ పార్టీ ఎవరికీ బీ పార్టీ కాదని ....తమది నెంబర్ వన్ పార్టీగా ఉండబోతుందని కవిత ధీమా వ్యక్తం చేశారు. కొత్త పార్గీ నుంచి ప్రజలు ఏమి ఆశిస్తున్నారో సలహాలు ఇవ్వాలని ,   అందుకోసం ఒక వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేస్తామని, అలాగే మెయిల్‌కి మేసేజ్ చేయవచ్చన్నారు. ఏప్రిల్ 25న పార్టీ ప్రకటిస్తామన్న కవిత,  అప్పటిలోగా.. అంటే రానున్న 28 రోజుల్లో ప్రతి ఒక్కరినీ కలుస్తానని ప్రకటించారు.. తెలంగాణ ఉద్యమకారులు, యువత, మహిళలు, మెథావులు, కవులు, పాత్రికేయులు అందరితో చర్చిస్తామన్నారు.

By
en-us Political News

  
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.