Publish Date:Jun 19, 2022
దారిన వెళుతూంటే హఠాత్తుగా ఎవరన్నా కిందపడితే పరుగున వెళ్లి లేవడానికి సాయం చేస్తాం. ఏదన్నా పిల్లో, కుక్కపిల్లో గాయ పడితే దాన్ని పక్కకు తీసికెళ్లి తెలిసిన చికిత్సా చేస్తాం లేదా వాటి యజమానికి అప్పజెప్పడం జరుగుతుంది. అలాంటి సందర్భా ల్లో మనకే గాయమయితే నోరులేని జీవాలు గదా అని వాటిని వదిలేసి దగ్గర్లో ఆస్పత్రికి వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించుకోవడం జరుగుతుంది. తప్ప ఆ జీవాల యజమానితో గొడవ పడతామా? వాళ్లు పట్టించుకుంటారా? పట్టించుకున్నా కేవలం సారీ చెప్పి పంపించేస్తారు. అంతకన్నా మనమూ ఏమీ ఆశించం. కానీ అమీ సోమ్లిక్ అందుకు పూర్తి విరుద్ధంగా చేసింది.
ఆ మధ్య ఒకరోజు అనీ అలా షికారుగా వెళుతోంది. ఆమెకు ఓ కుక్క పిల్ల రోడ్డు పక్కనే వున్న కాలవలో పడిపోవడం చూసింది. అంతే ఆమె పరుగున వెళ్లి దాన్ని పట్టుకుని గట్టు మీదకి లాగింది. కుక్క పిల్ల అలా బతికిపోయింది. ఈ క్రమంలో అనీకి గాయాల య్యాయి. కానీ ఆమె దగ్గరలో వున్న ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవడంతోనే ఆగలేదు. తను ఎంతో కష్టపడి ఆ కుక్కపిల్లను రక్షించానని, తానూ గాయపడినందుకు ఆ కుక్కపిల్ల యజమాని తన ఖర్చుల డబ్బు చెల్లించాలని డిమాండ్ చేసింది. తీరా చూస్తే ఆయన ఆమె పక్కింటి వాడే! అయినా సరే తనకు ఖర్చలకింద డబ్బు చెల్లించాల్సిందేనని మొండి కేసింది. కుక్కపిల్లను రక్షించినందుకు ఎంతో థాంక్స్. నీ సేవకు నేను మెచ్చుకుంటున్నానని ఆయన చాలా స్నేహపూర్వకంగానే చెప్పాడు. కానీ అనీ అదేమీ పట్టించుకోలేదు. ఆయనకూ కోపం వచ్చింది. తిట్ట లేదు గానీ ఐదు పైసలిచ్చేది లేదని తెగేసి చెప్పేడు.
అమీకి అంతులేని కోపం వచ్చి కోర్టుకెళ్లింది. మా పక్కింటాయన కుక్కపిల్లను కాలవలో పడి చావకుండా కాపాడాను. ఆ సమయంలో ఎంతో గాయపడ్డాను. అందుకు తగిన ఖర్చులు ఇప్పించాలని కోరింది. కోర్టులో అంతా ఘొల్లున నవ్వారు. జడ్జి గారికీ నవ్వు ఆగలేదు. పొట్టచెక్కలయ్యేలా నవ్వేడాయన! ఏమమ్మా ఏం డిమాండ్ చేస్తున్నావో అర్ధమవుతోందా? అని ప్రశ్నిం చాడాయన. మీరు సరిగానే విన్నారు, నేను అడిగింది అర్ధవంతమయినదే కుక్కపిల్ల యజమాని నుంచి నాకు నష్టపరిహారం ఇప్పించండి అని మళ్లీ కోర్టులో అందరూ వినేలా అరిచి మరీ చెప్పింది. మళ్లీ కోర్టంతా గొల్లున నవ్వారు. ఇలా చిన్న చిన్నవాటికి కోర్టు మెట్లు ఎక్కకూడదు. నువ్వు ఆ మూగజీవి పట్ల ఎంతో ప్రేమతో మంచి పనే చేశావు, దాన్ని చావకుండా బతికించేవు అందు కు కోర్టు నిన్ను మంచి సిటజన్గా అభినందిస్తున్నది అన్నాడాయన.
కానీ అమీ మాత్రం మొండికేసింది. రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతున్నప్పుడు గాయపడినవారికి నస్టపరిహారం ఇప్పిస్తుంటారు గదా మరి ఈ కేసులో నాకు నష్ట పరిహారం ఇవ్వడానికి ఎందుకు కాదంటున్నారని కోర్టును అమీ నిలదీసింది. ఇది కేవలం మూగజీవుల రక్షణ విషయంలో నిన్ను అభినందించడం తప్ప ఆ యజమానిని కోర్టుకు ఈడ్చడానికి కుదరదని తేల్చి చెప్పింది. ఇలాంటి అర్ధంలేని వాదనలు చేయవద్దని హెచ్చరించింది. నీకు గాయమయింది. అందుకు కుక్కపిల్ల యజమానితో మాట్లాడి నీవే ఆయన నుంచి ఏదయినా పొందవచ్చుగాని ఇలా కోర్టుకు ఎక్కడంలో అర్ధంలేదని జడ్జి కేసును కొట్టేసి ఆమెను మందలించి పంపించేసేరు. ఇది న్యూజెర్సీ వాసులు చాలారోజులు గుర్తు తెచ్చుకుంటూ సరదాగా నవ్వుకుంటారేమో!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/judge-cint-stop-laughing-in-that-case-25-137970.html
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.