మరణమంటే జీవితంలో బాగమని చెప్పకనే చెప్పిన తత్వవేత్త.. జిడ్డు కృష్ణమూర్తి వర్థంతి..!

Publish Date:Feb 17, 2025

Advertisement

 


జె.కె అంటే ఆధ్యాత్మికత, తత్వ చింతనల గురించి, వాటికి సంబంధించిన వ్యక్తులు,  పుస్తకాలను అధ్యయనం చేసిన వారికి బాగా తెలిసి ఉంటుంది. కానీ చాలామందికి జె.కె అంటే జిడ్డు కృష్ణమూర్తి అని తెలియదు.  జిడ్డు కృష్ణమూర్తి భారతదేశపు ప్రసిద్ధ తత్వవేత్త, ఆధ్యాత్మిక వేత్త, రచయిత, ఉపన్యాసకుడు. నిజానికి జిడ్డు కృష్ణమూర్తి ఒక గొప్ప గురువు అని చెప్పవచ్చు. కానీ ఆయన గురువు అని పిలిపించుకోవడానికి నిరాకరించారు. ఫిబ్రవరి 17,  1986లో జిడ్డు కృష్ణమూర్తి మరణించారు.  ఈ సందర్బంగా ఆయన గురించి చాలామందికి తెలియని విషయాలు తెలుసుకుంటే..


జిడ్డు కృష్ణమూర్తి గొప్ప తత్వవేత్త,  ఆధ్యాత్మిక బోధనలు ఎన్నో ఈయన నుండి వెలువడ్డాయి.  ఈయన చేసిన బోధనలలో అశాశ్వతం అనే ఇతివృత్తం గురించే ఎక్కువ ప్రస్తావన ఉంది. ఈయన ఇచ్చిన తొలి ఉపన్యాసం నుండి చివరి వరకు మరణాన్ని అర్థం చేసుకోవాల్సిన అవశ్యత గురించి ఈయన ఎక్కువ మాట్లాడారు. మరణానికి భయపడకూడదని,  మరణాన్ని వాయిదా వేయకూడదని, మరణాన్ని తిరస్కరించకూడదని జిడ్డు కృష్ణమూర్తి చెప్పారు.దీన్ని బట్టి మరణాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలనేది జిడ్డు కృష్ణమూర్తి తత్వమని అర్థం అవుతుంది. అంటే.. మరణం గురించి అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతో ఉంది.  ప్రతి మనిషి జీవించడం పట్ల ఎంత ఉత్సుకతతో.. ఎంత ఆశతో ఉంటాడో.. మరణం విషయంలో కూడా అంతే ఉత్సుకతతో ఉండాలని జిడ్డు కృష్ణమూర్తి చెప్తారు.


జిడ్డు కృష్ణమూర్తి మరణాన్ని గమనిస్తే.. ఆయన మరణం గురించి, మరణాన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయం గురించి ఆయన చెప్పిన విషయాలకు ఒక రూపం ఇస్తే ఆయన మరణం వైపు సాగిన ప్రయాణం కూడా అదే విధంగా ఉంటుంది. జీవితంలో ప్రతి అంశానికి ఒక స్పష్టత ఉంటుంది. అదే విధంగా మరణానికి కూడా ఒక స్పష్టత అనేది ఉంటుంది.  దాన్ని ఇతర విషయాల లాగే భావించినప్పుడు మరణం అంటే భయం,  బాధ, తప్పించుకోవాలని పారిపోవాలనే ప్రవర్తన అస్సలు ఉండవట. జిడ్డు కృష్ణమూర్తి మరణం గురించి చెప్పిన విషయాలు అక్షరాలా పాటించాడని చెప్పడానికి ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులే సాక్ష్యులు.  


జిడ్డు కృష్ణమూర్తి మరణాన్ని జీవితానికి విరుద్దమైన అంశంగా ఎప్పుడూ చూడలేదు. ఆయన మరణానికి చేరువ అవుతున్న కొద్దీ ఆయన శరీరం క్షీణిస్తూ ఉంటే.. ఆయన మాత్రం చాలా ప్రశాంతంగా ఉండేవారట. చాలా తక్కువగా మాట్లాడేవారట, ఎలాంటి డ్రామా జరగకుండా చాలా ప్రశాంతంగా జిడ్డు కృష్ణమూర్తి మరణం జరిగిందని అంటారు. కాలం వల్ల,  మనిషి తాను ఊహించుకునే విషయాలు,  మనిషి తాను అనుభూతి చెందే ఎన్నో రాగద్వేషాల  నుండి విముక్తి పొంది అవగాహనతో జీవించడం, మరణించడం అనేది  జిడ్డు కృష్ణమూర్తి మాటల్లోనూ,చేతల్లోనూ కూడా చూపించారు.  


ప్రముఖ వ్యక్తులు తమ చివరి రోజుల్లో లేదా చివరి ఘడియల్లో  కొన్ని విషయాలు ప్రధానంగా ప్రస్తావించి ఉంటారు. జిడ్డు కృష్ణమూర్తి చివరి మాటలు కూడా చాలా సరళమైనవే అయినా చాలా లోతుగా మాట్లాడారు.  ఆయన మాట్లాడిన చివరి మాటలలో ఒక వాక్యం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది."శరీరం ఇంకేమి తట్టుకోగలదో నాకు ఖచ్చితంగా తెలియదు" అని ఆయన అన్నారు.  ఈ మాట ఆయన శరీరం చివరి రోజుల్లో ఎంత బాధ అనుభవించి ఉంటుందో,  ఆయన ఎంత బాధపడి ఉంటారో చెప్పకనే చెబుతుంది. అయినా సరే.. అవన్నీ మానవ శరీరానికి తప్పవనే నిజాన్ని ఆయన అంగీకరించారు.  ఈ విషయాన్ని తెలుసుకున్నప్పుడు, దాన్ని ప్రతి మనిషిని అంగీకరించినప్పుడు మరణం గురించి అందరికీ అర్థం అవుతుంది. మరణం మీద అవగాహన వస్తుంది.  మరణం అంటే భయం పోతుంది.


                                               *రూపశ్రీ.

By
en-us Political News

  
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.