జానా చాణక్యం.. ఒక్క లేఖతో రాజగోపాల్‌కు చెక్ పెట్టే ప్రయత్నం!

Publish Date:Apr 14, 2025

Advertisement

అన్నయ్య ఆల్రెడీ మినిస్టర్. ఆయన ఎమ్మెల్యే. అయినా సరే అన్న లెక్క అన్నదే. నా లెక్క నాదే. ఇదే మంత్రి పదవిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయం. అందుకే మినిస్టర్ పోస్టు కోసం గట్టిగా అడిగేస్తున్నారు. కానీ ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులెట్లా? అనేది కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చ. దానికి కూడా దిమ్మతిరిగిపోయే ఎగ్జాంపుల్ ఒకటి చెప్పారు రాజగోపాల్ రెడ్డి. ఇండియన్ క్రికెట్‌ టీమ్‌లో ఒకప్పుడు యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్ ఇద్దరూ ప్రాతినిధ్యం వహించలేదా? వాళ్లకు లేనిది ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులిస్తే తప్పా? అని కాస్త లాజికల్‌గానే అడుగుతున్నారు.  భువనగిరి ఎంపీ సీటు గెలిపిస్తే  మంత్రి పదవి ఇస్తానని కాంగ్రెస్ పార్టీ తనకు హమీ ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. 
ఉమ్మడి నల్గొండ జిల్లాలో.. రాజకీయంగా కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఎంత పట్టు ఉందో వేరే చెప్పక్కర్లేదు. వాళ్లు ఫోకస్ పెడితే ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు గెలిపించగలిగే సత్తా, స్థోమత ఉన్నోళ్లనే అభిప్రాయం ఉంది. వాళ్ల స్టామినా ఏమిటో తెలుసు కాబట్టే కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ముందే మంత్రి పదవి కట్టబెట్టేసింది. ఇప్పుడు ఆయన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కూడా మినిస్టర్ రేసులో ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మంత్రులుగా ఉన్నారు. ఇదే వర్గానికి చెందినరాజగోపాల్ రెడ్డి కూడా మినిస్టర్ పోస్టు ఆశిస్తున్నారు. ఇది.. ఎప్పట్నుంచో నడుస్తున్న వ్యవహారమే. 
కానీ ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి రాసిన ఓ లేఖ.. నల్గొండ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నల్గొండ జిల్లా నేత అయి ఉండి, రంగారెడ్డి జిల్లా నేతకు మంత్రి పదవి ఇవ్వాలని జానారెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి లేఖ రాశారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పొలిటికల్‌గా జానారెడ్డి ఇప్పుడు యాక్టివ్‌గా లేరు. ఆయన ఇద్దరు కుమారులు.. యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వచ్చేశారు. ఒక కుమారుడు ఎమ్మెల్యేగా, ఇంకో కొడుకు  ఎంపీగా గెలిచారు. జానారెడ్డి తన కుమారుల రాజకీయ భవిష్యత్‌ని దృష్టిలో ఉంచుకొనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తెలివిగా చెక్ పెట్టాలని చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్‌లో ఒకరికి మంత్రి పదవి ఉంది. మళ్లీ రాజగోపాల్ రెడ్డికి కూడా మినిస్టర్ పదవి దక్కితే, ఇక జిల్లాలో తన ఫ్యామిలీ రాజకీయంగా ఎదగడం కష్టమవుతుందనే ఆలోచనతోనే,  జానారెడ్డి ఇలా చేశారనే చర్చ జరుగుతోంది. దానికి తగ్గట్లే 30 ఏళ్లు మంత్రి పదవి అనుభవించిన జానారెడ్డికి, ఇప్పుడు రంగారెడ్డి జిల్లా నేతలకు మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచన ఎందుకొచ్చిందని, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే అడిగేస్తున్నారు. తన మంత్రి పదవి విషయంలో జానారెడ్డి లాంటివాళ్లు ధృతరాష్ట్రుడి పాత్ర పోషిస్తున్నారని వ్యాఖ్యానించడంతో, పెద్దాయన ఆ లేఖ ఎందుకు రాశారో ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. 

మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా నేతల నుంచి మంచి మద్దతే ఉంది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సపోర్ట్‌ రాజగోపాల్ రెడ్డికే ఉంది. వాళ్లంతా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసం ఎక్కడ సంతకం చేయమన్నా చేస్తామంటున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తే పార్టీ, ప్రభుత్వం మరింత బలపడుతుందని భావిస్తున్నట్లు బహిరంగంగానే చెబుతున్నారు. కానీ ఇప్పటికే ఈ విషయంలో జానారెడ్డి తన రాజకీయ చాణక్యం ప్రదర్శించేశారు. నల్గొండ జిల్లా నేతగా ఉండి కూడా రంగారెడ్డి జిల్లా నాయకుడికి ఓ మంత్రి పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానానికి లేఖ రాసి పొలిటికల్ హీట్ పెంచేశారు. ఇది జరిగిన తర్వాత,  పార్టీలో సీనియర్ నాయకుడిగా జానారెడ్డి అన్ని జిల్లాల నేతలకు న్యాయం జరగాలనే లేఖ రాశారని అంతా అనుకున్నారు. కానీ ఆయన లెటర్ ఎందుకు రాశారో అర్థమవుతుండటంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాబినెట్ బెర్త్‌కు జానారెడ్డి ఒక్క లేఖతో ఎర్త్ పెట్టాలని చూస్తున్నారన్న చర్చ సాగుతోంది.

By
en-us Political News

  
దేశంలో పేదరికం ఏ స్థాయిలో వుందో, ఆకలి స్థాయి ఏమిటో, కటిక దారిద్ర్యంలో మగ్గుతున్న పేదలకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. కానీ ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక మాత్రం భారత దేశంలో పేదరికం రోజురోజుకూ తగ్గిపోతోందని అంటోంది. ఆర్థిక పేదరికం మాత్రమే కాకుండా, విద్య, ఆరోగ్యం జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్న వివిధ కోణాల పేదరికంలో కుడా కూడా భారత దేశం మంచి మెరుగుదల సాధించిందని నివేదిక పేర్కొంది.
తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై ఇటీవల హైకోర్టు సింగిల్ ఇచ్చిన మధ్యంతరం ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ అప్పీల్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు సీజే ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది. గ్రూపు-1 పరీక్షలో అక్రమాలు జరిగాయని హైకోర్టుపలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. మెయిన్స్ ఎగ్జామ్ మూల్యాంకనం సరిగ్గా జరుగలేదని, పరీక్షల కేంద్రాల కేటాయింపుల్లోనూ నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) వైస్ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, ఆమెకు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్‌ (డీజీ)గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది.
పహల్గాం ఉగ్ర దాడి నేపధ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి ఒక్కటయ్యాయి. ఐక్యతను ప్రదర్శించాయి. ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. మాలో మాకు సవాలక్ష విబేధాలు ఉండవచ్చును కానీ.. మా దేశం పై మరో దేశం ఏ రూపంలో దాడి చేసినా, రాజకీయాలను పక్కన పెట్టి ఒక్కటై నిలుస్తామని శతృ మూకకు స్పష్టమైన హెచ్చరిక చేశాయి. దేశం గర్వించేలా అధికార, ప్రతిపక్ష నాయకులు, చేతులు కలిపి సయోధ్య ప్రదర్శించారు.
హైదరాబాద్‌లో కేవలం 14 నెలల్లోనే హైటెక్ సిటీని నిర్మించానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలోని విట్ విశ్వవిద్యాలయంలో నేడు జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తమ ప్రతిభతో ఉన్నత స్థానాల్లో ఉంటున్నారని కొనియాడారు. ఈ సందర్భంగా విట్ ఏపీ క్యాంపస్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం, నూతన స్టార్టప్ ఆలోచనలకు ఊతమిచ్చేందుకు ఏర్పాటు చేసిన విలాంచ్‌ ప్యాడ్ 2025 ఇంక్యుబేషన్ సెంటర్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు.
కాళేశ్వరం మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్‌ భూక్యా హరిరాంని అక్రమాస్తుల కేసులో అరెస్టు చేసింది ఏసీబీ. హరిరాంతో సంబంధమున్న 14 ప్రదేశాలతో దాడులు చేసింది అవినీతి నిరోధకశాఖ. ఈ దాడుల్లో భూక్యా హరిరాంకి సంబంధించిన భారీ ఎత్తున అక్రమాస్తులున్నట్టు గుర్తించిన ఏసీబీ హరిరాంను గజ్వేల్ లో శనివారం అరెస్టు చేసింది.
Hanmakonda, Elkaturthi, BRS Party, Silver Jubilee Celebration, Rahul Gandhi, Janareddy, KK, Vem Narender Reddy, Operation Kagar,KCR, KTR, Maoists
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పం. గత ఆ నియోజకవర్గ కేంద్రం అయిన కుప్పం మునిసిపాలిటీ మాత్రం గత ఐదేళ్లుగా వైసీపీ చేతిలో ఉంది. కుప్పం మునిసిపల్ చైర్మన్ గా వైసీపీ నేత డాక్టర్ సుధీర్ రెడ్డి ఉండేవారు. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత సుధీర్ రెడ్డి తన కౌన్సిలర్ పదవికి రాజీనామా చేశారు.
విశాఖ మహానగర పాలక మేయర్‌గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవం ఎన్నికయ్యారు. మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీ కృష్ణ యాదవ్ ప్రతిపాదించగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. మేయర్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. దీంతో మేయర్ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. కోరం సరిపోవడంతో జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. జీవీఎంసీ పాలకవర్గ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. జిల్లా సంయుక్త కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి.. కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులు హాజరయ్యారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ టీం మొత్తం ఇప్పుడు విజయవాడ జిల్లా జైలులో ఊచలు లెక్కపెడుతోందా? అంటే అందరూ కాకపోయినా చాలా మంది పరిస్థితి అలాగే ఉందని సమాధానం వస్తుంది.
అమరావతి పనుల పున: ప్రారంభానికి మే2న ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు షెడ్యూల్ కూడా ఖరారైంది. మోడీ పర్యటనను విజయవంతం చేయడానికి ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.
ఏపీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖరెడ్డి అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఏ4 గా నమోదు అయిన రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఇటీవల సీఐడీ అధికారులు విచారించారు. తర్వలో మరోసారి విచారణకు హాజరు అవ్వాలని నోటీసులు ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.