పెట్టుబడిదారులను తరిమేసేందుకే జగన్ మావిగన్!

Publish Date:Apr 13, 2026

Advertisement

ప్రస్తతుం ఆంధ్రప్రదేశ్ లో జగన్ మావిగన్ పై ఎడతెగని చర్చ జరుగుతోంది. వైసీపీయూలు మావిగన్ ను ఆంధ్రప్రదేశ్ ను సకల కష్టాల నుంచీ తొలగించే సంజీవనిలా, సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ లా అభివర్ణిస్తుంటే.. తెలుగుదేశం కూటమి పార్టీలే కాకుండా, మేధావులూ, సామాన్య జనం కూడా మావిగన్ ప్రతిపాదన చేసిన  జగన్ ను ఓ జోకర్ గా అభివర్ణిస్తున్నారు. అదే తీరుగా నెటిజన్లు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. 

అయితే ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్  ఏబీ వెంకటేశ్వరరావు మాత్రం జగన్ మావిగన్ ప్రతిపాదన ఆషామాషీగా చేయలేదని హెచ్చరిస్తున్నారు. ఆ ప్రతిపాదన వెనుక భారీ కుట్ర దాగుందని చెబుతున్నారు. ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.  మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  మావిగన్’  వెనుక లోతైన రాజకీయ వ్యూహం ఉందంటున్నారాయన. ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు.  విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.   జగన్  మావిగన్  వ్యూహం అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడానికి ఉద్దేశించినదేనని విశ్లేషించారు.

ముఖ్యంగా పెట్టబడి దారులను బెదరించి వెనక్కు పంపడం కోసమే ఆయన మావిగన్ ప్రతిపాదన చేశారన్న ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.  అంతర్జాతీయ స్థాయిలో అమరావతికి వస్తున్న పెట్టుబ డిదారులను భయభ్రాంతులకు గురిచేయడమే జగన్ లక్ష్యం అన్నారు. రాజధానిపై జగన్ తన వ్యతిరేకతను ఈ విధంగా వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగకుండా అడ్డుకట్ట వేయాలన్న కుట్ర చేస్తున్నారన్నారు. 

సపోజ్ ఫర్ సపోజ్ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి పరిస్థితి దారుణంగా మారుతుందని ఏబీ వెంకటేశ్వరరావు హెచ్చరించారు. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడం, వేసిన రోడ్లను తవ్వేయడం, కేబుళ్లు,  పైపులను తరలించడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని  ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కూడా అమరావతిని గ్రాఫిక్స్ అని, స్మశానమని అభివర్ణించి పెట్టుబడిదారులు రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేసిన ఏబీ వెంకటేశ్వరరావు.. ఇప్పుడూ అదే చేస్తున్నారన్నారు.  

కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి విషయంలో పూర్తిస్థాయి నిబద్ధతతో లేదని విమర్శించిన ఏబీవీ.. ఢిల్లీ పాలకులు కేవలం తమ రాజకీయ అవసరాల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నారనీ, రైతుల త్యాగాలకు తగిన న్యాయం జరగడం లేదనీ చెప్పారు.   సీఆర్డీఏ  చట్టం ఉండటం వల్లనే ఇప్పటివరకు అమరావతి కొంతైనా నిలబడిందని చెప్పిన ఏబీవీ..  ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు.  ప్రస్తుత ప్రభుత్వం రాజధాని పనులను 2028 నాటికి పూర్తి చేస్తామని చెబుతున్న నేపథ్యంలో, ఆ దిశగా వేగంగా అడుగులు వేయాలని కోరారు. అమరావతి కేవలం నగరం కాదనీ,  వేలాది మంది రైతుల నమ్మకమని అన్నారు.  

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.