డిక్లరేషన్ ఇస్తేనే జగన్ కు దర్శనానికి అనుమతి.. టీటీడీ నిర్ణయం

Publish Date:Sep 27, 2024

Advertisement

జగన్ తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం అనుమానమే. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆయనను దర్శనానికి అనుమతించే విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ అన్యమతస్థుడు కనుక ఆయన తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే తప్పని సరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని అంటున్నది. ఈ నేపథ్యంలోనే శనివారం (సెప్టెంబర్ 28) ఆయన దర్శనానికి ముందుగానే తిరుమలలో ఆయన బస చేసిన  గెస్ట్ హౌస్ కు వెళ్లి ఆయనకు డిక్లరేషన్ పత్రం ఇచ్చి సంతకం తీసుకోవాలని నిర్ణయించింది. ఆయన డిక్లరేషన్ పై సంతకం పెడితే ఓకే.. ఒక వేళ సంతకం పెట్టడానికి నిరాకరిస్తే మాత్రం దర్శనానికి అనుమతించరాదని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది.  

అయితే ఇందుకు సంబంధించి అధికారిక సమాచారం ఏదీ ఇంకా రాలేదు. అయితే విశ్వసనీయ సమాచారం మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మేరకు ఒక నిర్ణయం తీసుకుంది. జగన్ తిరుమల పర్యటన వేళ ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇది ఒకటే మార్గంగా తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తోంది. గతంలో జగన్ తిరుమల పర్యటన సందర్భంగా డిక్లరేషన్ ఇవ్వలేదనీ, అయితే అప్పుడు ఆయన ముఖ్యమంత్రి హోదాలో వచ్చినందున నిబంధనల మేరకు డిక్లరేషన్ పై పట్టుబట్టలేదనీ టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. 

కాగా జనసేనాని పవన్ కల్యాణ్ ఇప్పటికే జగన్ పర్యటన సందర్భంగా ఎటువంటి ఆందోళనలకూ పాల్పడవద్దంటూ జనసేని శ్రేణులకు పిలుపునిచ్చారు. జగన్ డిక్లరేషన్ వ్యవహారం తిరుమల తిరుపతి దేవస్థానం చూసుకుంటుందనీ, డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ కు అనుమతి ఇవ్వాలా, అనుమతి నిరాకరించాలా అన్నది టీటీడీకి సంబంధించిన అంశమనీ పవన్ కల్యాణ్ పేర్కొన్న నేపథ్యంలో ఆందోళనలు, నిరసనలకు దూరంగా ఉండాలని ఇప్పటికే జనసేన శ్రేణులు ఫిక్స్ అయిపోయారు. అయితే బీజేపీ, హిందూ సంస్థలూ మాత్రం జగన్ తిరుమల పర్యటన, డిక్లరేషన్ అంశంపై  గట్టిగా నిలబడుతున్నారు.

డిక్లరేషన్ ఇవ్వకుండా జగన్ తిరుమల దేవుడిని దర్శించుకోవడానికి ఎంత మాత్రం అంగీకరించమనీ, అవసరమనుకుంటే అలిపిరి వద్దనే ఆయనను అడ్డుకుంటామనీ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే జిల్లా వ్యాప్తంగా  పోలీసు యాక్ట్ 30ని పోలీసులు అమలులోకి తీసుకు వచ్చారు. ఇలా ఉండగా మందీ మార్బలంతో జగన్ జగన్ తిరుమల పర్యటనకు బయలుదేరనుండటం పై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. వేల మందితో ఆయన తిరుమల రావడం దేవుడి దర్శనానికా, దండయాత్రకా అంటే తెలుగుదేశం శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.  

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.