రాయి పడింది... ప్లాను చెడింది.. కోడికత్తి-2 కేసు తుస్సుమంది!

Publish Date:Apr 16, 2024

Advertisement

అదీ విషయం.. కోడికత్తి-2 కేసు అలియాస్ గులకరాయి దాడి కేసు తుస్సుమని, అటక ఎక్కే దారిలో పయనిస్తోంది. గత ఎన్నికల సందర్భంలో కోడికత్తి ద్వారా తన మీద తాను దాడి చేయించుకోవడం ద్వారా జగన్ మావయ్య రాజకీయంగా లాభం పొందారు. ఈసారి ఎన్నికలకు వెళ్ళే సమయానికి ఆయన ప్రభుత్వం పరువు పాతాళానికి చేరుకోవడంతో ‘కోడికత్తి-2’ డ్రామాకు తెర తీసిన జగన్ అండ్ కో ఇప్పుడు ఆ కేసును నీరుగార్చే పనిలో పడింది. అలా రాయి తగిలిందో లేదో ఇలా జగన్‌పై హత్యాయత్నం అని భారీ స్థాయిలో మీడియాలో ప్రచారం చేయడంతోపాటు, జగన్‌పై హత్యాయత్నం చేయించింది చంద్రబాబు నాయుడేనని రకరకాల కథనాలు వండి వడ్డిస్తూ వచ్చిన జగన్ అండ్ కో ఇప్పుడు వెనకడుగు వేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

జగన్‌పై రాయిపడిన సంఘటనకి  ‘హత్యాయత్నం’ కలరింగ్ ఇచ్చి, దానికి  చంద్రబాబుని బాధ్యుణ్ణి చేసి రాజకీయంగా మరోసారి లాభం పొందాలని వైసీపీ వర్గాలు శాయశక్తులా కృషి చేశాయి. అయితే జనం ఈసారి జగన్ మాయలకు మోసపోవడానికి సిద్ధంగా లేకపోవడంతో వాళ్ళ చేసిన ప్రచారం అంతా తేలిపోయింది. జనంలో సానుభూతికోసమే జగన్ ఈ డ్రామా ఆడిస్తున్నాడని జనం అర్థం చేసుకుని లైట్‌గా తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎవర్ని కదిలించినా ఇది జగన్ ఆడుతున్న డ్రామా అని క్లారిటీగా చెబుతున్నారు. దాంతో జగన్ పథకం పారలేదు. దీనితోపాటు ఈ సంఘటనతో జగన్ మీద నెగటివిటీ పెరిగింది. ఎన్నికలకు ఇంకా సుమారు నెల రోజుల సమయం వుంది. ఈ నెలరోజులపాటు ‘హత్యాయత్నం, హత్యాయత్నం’ అని గగ్గోలుపెట్టి జనం సానుభూతిని పొందాలని జగన్ అండ్ కో వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఈసారి జరిగే ఎన్నికలలో జగన్ పార్టీకి 40 వరకు అసెంబ్లీ స్థానాలు వస్తాయని అంచనాలుండేవని, ఈ కోడికత్తి-2 సంఘటన తర్వాత జగన్ మీద జనంలో వ్యతిరేకత మరింత పెరిగి మరో పదిస్థానాలు తగ్గిపోయాయని ఒక వైసీపీ ప్రముఖుడే వాపోయాడంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పైగా ఈ కేసుని కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్‌గా తీసుకోవడంతో వాళ్ళు కేసును తవ్వి నిజానిజాలు బయట పెట్టేముందే తామే హ్యాండ్సప్ అయిపోతే మంచిదని, కేసును  క్లోజ్ చేసే దిశగా తీసుకెళ్తే మంచిదని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. అందుకే పోలీసులు కొత్త కేరెక్టర్లను రంగంలోకి దించారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం, విజయవాడలోని అజిత్‌సింగ్ నగర్ కాలనీకి చెందిన సతీష్ అనే యువకుడితోపాటు అతని మిత్రులైన ఆకాష్, చిన్నారావు, దుర్గ, సంతోష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగన్ మీద రాయి విసిరిందని తానేనని సతీష్ అనే కుర్రాడు ఒప్పుకున్నాడు. ఇంతకీ జగన్ మీద రాయి ఎందుకు వేశావయ్యా అని పోలీసులు అడిగితే, ‘మాకు క్వార్టర్ బాటిల్, 350 రూపాయలు ఇస్తామని వైసీపీ నాయకులు ఆశపెట్టి జగన్ సభకు తీసుకొచ్చారు. తీరా వచ్చాక డబ్బు ఇవ్వకుండా మందు బాటిల్ చేతిలో పెట్టి వెళ్లిపోయారు. డబ్బులివ్వకుండా వెళ్ళిపోయారన్న కోపంతోనే జగన్‌ను రాయితో కొట్టాను’ ఇది జగన్‌పై ‘హత్యాయత్నం’ కేసులో దొరికిపోయిన నవ యువకుడు చెప్పాడు. డబ్బు ఇవ్వకపోవడంతో సదరు యువకుడికి కోపం వచ్చిందట. రోడ్డు పక్కనే వున్న ఒక రాయిని తీసుకుని జగన్ మీదకి విసిరాడట. అదీ విషయం.

నిన్నటి వరకూ అంతమంది జనాల్లో, అది కూడా లైట్లు లేని సమయంలో ఎవరు దాడి చేశారో ఎలా కనుక్కవాలి? అని చెబుతూ వచ్చిన విజయవాడ పోలీసు పెద్దలకు ఇప్పుడు ఈ 350 రూపాయల బ్యాచ్ ఎలా దొరికిందో వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు జగన్‌పై దాడి చేశాడని చెప్పిన యువకుడు, మిగతావాళ్ళ పరిస్థితి మరో కోడికత్తి శ్రీనులా అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిందే. తన కొడుకుని పోలీసులు వచ్చి పట్టుకెళ్ళారని, ఎక్కడ వున్నాడో తెలియదని సతీష్ అనే యువకుడి తల్లి లబోదిబోమంటోంది. మరి పోలీసులు సతీష్ తదితరులను మీడియా ముందు హాజరు పరుస్తారా లేక పోలీసులే ఈ కేసు గురించి, దాడి జరిగిన తీరు గురించి మీడియాకి చెప్పి చేతులు దులుపుకుంటారా అనేది చూడాల్సి వుంది. 

By
en-us Political News

  
తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి.
వైకాపాకు చెందిన కొందరు రౌడీ మూకలు రక్తం పారిస్తాం, నరికేస్తాం అంటూ కెమెరాల ముందు ప్రగల్భాలు పలుకుతున్నారని, అలాంటి పిచ్చి చేష్టలు తమ వద్ద సాగవని పవన్ కళ్యాణ్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది.
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.