సర్కారు వారి పాట!.. ఎకరా పది కోట్లు.. అమరావతి భూముల విక్రయానికి జీవో!

Publish Date:Jun 25, 2022

Advertisement

మొండివాడు రాజుకంటే బలవంతుడు. పిచ్చోడి చేతిలో రాయి వంటి సామెతలన్నీ వరుసపెట్టి గుర్తుకు వచ్చేలా జగన్ పాలన ఉంది. అమరావతే ఏపీ రాజధాని దానికి మా పార్టీ పూర్తిగా మద్దతు ఇస్తోంది అంటూ విపక్ష నేతగా నిండు అసెంబ్లీలో ప్రకటించిన జగన్ అధికారంలోకి రాగానే నిర్లక్ష్యం చేశారు.

అమరావతి పురోగతిని, అభివృద్ధిని పాతాళంలోకి పాతేశారు. ఆయన మనసు తెలుసుకున్న వైసీపీ నేతలు అమరావతిని శ్మశానం అంటే ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా అమరావతి పనికిరాదన్నారు. వరదలు వస్తే మునిగిపోతుందన్నారు. ఎన్నెన్నో చెప్పారు. మూడు రాజధానులన్నారు. అమరావతి కోసం.. రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చిన రైతులను నానా విధాలుగా వేధించారు. వెరసి ఈ మూడేళ్లలో అమరావతిలో ఒక్క పని చేపట్టలేదు. జరుగుతున్న పనులను ఆపేశారు. అమరావతి కోసం చారిత్రక పోరాటం చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ ఎకసెక్కాలాడారు. వారిపై కేసులు పెట్టారు. ఇక ఇప్పుడు రాజధాని అభివృద్ధి కోసం నిధుల సేకరణ అంటూ అమరావతి భూముల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అభివృద్ధిని అన్ని విధాలుగా అణగదొక్కేసిన జగన్ సర్కార్ మూడేళ్ల తరువాత అభివృద్ధి కోసమంటూ రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయిస్తే అవి నిరాకరించాయి.

దీంతో ప్రభుత్వం కన్ను అమరావతి భూములపై పడింది. దీంతో వీటి అమ్మకానికి రెడీ అయిపోతోంది. ఈ మేరకు ఎకరాకు రూ.10 కోట్లు ధర నిర్ణయించి సర్కారు వారి వేలం పాటకు రెడి అయిపోతోంది జగన్ ప్రభుత్వం.  మొత్తం 600 ఎకరాల విక్రయానికి ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతిస్తూ జీవో జారీ చేసింది. తొలి విడతలో 248.34 ఎకరాల విక్రయానికి రెడీ అయిపోయింది.

జగన్ సర్కార్ విక్రయించడానికి నిర్ణయం తీసుకున్న భూములన్నీ గత ప్రభుత్వం వివిధ విద్యా సంస్థలకు కేటాయించినవే. తొలి విడతలో విక్రయానికి సిద్ధం చేసిన భూములలో బీఆర్ షెట్టీ మెడిసిటీ కోసం కేటాయించిన 100 ఎకరాలు, లండన్ కింగ్స్ కాలేజీకి కేటాయించిన 148 ఎకరాలు ఉన్నాయి. ఆయా సంస్థలతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నిటినీ అధికారంలోకి రాగానే జగన్ సర్కార్ రద్దు చేసింది. ఇప్పుడేమో కేటాయించిన భూములలో సంస్థలు ప్రారంభించేందుకు ఆయా సంస్థలు ముందుకు రాని కారణంగా కేటాయింపులు రద్దు చేసి భూములను విక్రయిస్తున్నామంటూ చెబుతోంది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థల పెట్టుబడులను ఉద్దేశపూర్వకంగా నిరాకరించి, ఇప్పుడేమో ఆదాయం కోసం వాటికి కేటాయించిన స్థలాలను విక్రయించడానికి సిద్ధపడిపోయింది జగన్ సర్కార్.

గత ప్రభుత్వంలోనే ఆయా సంస్థలకు భూముల కేటాయింపు జరిగింది. ఆ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని అభివృద్ధి చేసి ఆ తరువాత మిగులు భూములను విక్రయిస్తే లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని ప్రకటించారు. జగన్ ప్రభుత్వమేమో అభివృద్ధిని విస్మరించి 2,480 కోట్ల నామ మాత్రపు ధరకు తొలి విడతలో దాదాపు 250 ఎకరాల భూముల విక్రయానికి సిద్ధమైపోయింది. అయితే భూముల విక్రయానికి రైతులు అంగీకరిస్తారా అన్న ప్రశ్న తలెత్తుతోంది. రైతులు న్యాయపోరాటంలో విజయం సాధించినా ప్రభుత్వం కోర్టు తీర్పును అమలు చేస్తుందన్న విశ్వాసం లేక ఆందోళనను కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అభివృద్ధి కోసం నిధుల సేకరణ అంటూ భూముల విక్రయానికి తెగబడితో మరో సారి కోర్టుకు వెళ్లడం ఖాయమని రైతులు అంటున్నారు. ముందుగా ఒప్పందం ప్రకారం తమకు అభివృద్థి చేసిన భూములు అప్పగించిన తరువాతనే ప్రభుత్వం భూ విక్రయం చేయాలని వారు పట్టుబడుతున్నారు. అందుకు భిన్నంగా ప్రభుత్వం ముందుకు వెళితే మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని స్పష్టం చేస్తున్నారు. అయినా జగన్ సర్కార్ మాత్రం మొండిగా ముందుకే వెళుతోంది. సర్కార్ వారి వేలం పాట ఖాయమని చెబుతోంది. 

By
en-us Political News

  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.