Publish Date:Jun 23, 2022
దూరంగా కనిపించేవరకూ వున్న వన్నీ మా భూములే.. అంటాడు ప్రేమ్ నగర్ సినిమాలో హీరో ఏఎన్నార్ కొత్తగా నగరానికి వచ్చినవాడికి అప్పటికే నగరంలో నాలుగు వీధులు తిరిగినవాడు ఆ కనిపించేది మనోడిదే, అక్కడంతా మనదే రాజ్యం అని గొప్పలు చెబుతూంటాడు. అసలు నేను చెప్పకుంటే సచివాలయంలో నీ పని పది రోజుల్లో అయ్యేది కాదంటాడు ఓ బ్రోకరు ఓ చిరుద్యోగితో! అదో చిత్రమయిన మనస్తత్వం. అలా చెప్పు కోవడంలో ఆదో తుత్తి!
ఆ తుత్తి ఇపుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రదర్శిస్తున్నాడు. తనవి కానివి తన వల్లే జరిగాయని ప్రచారం చేసుకోవడానికి ధైర్యం చేయడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. అది అమాయకత్వం కాదు, ఎవరూ గమనించరని, గమనించినా ప్రశ్నించే ధైర్యం చేయరనీ ఓ నమ్మకం. ప్రస్తుతం రాష్ట్రంలో వున్న ఎలక్ట్రా నిక్ కంపెనీలన్నీ తన పాలనా ప్రతిభ, తన స్నేహ బంధాలతోనే వచ్చాయని జగన్ అనడం విడ్డూరమే. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విటర్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఎవరికో పుట్టిన బిడ్డకు తానే తండ్రిని అని చెప్పుకోవడంతో జగన్ దొరికిపోయాడని కామెంట్ చేశారు.
గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు రాష్ట్రానికి సాధించినవి తాను సాధించినవే అని జగన్ చెప్పుకోవడం, ప్రచారం చేసుకోవడం ఆయన దుస్థితిని తెలియజేస్తుంది. అప్పట్లో రాష్ట్రంలో ఐ.టి కంపెనీలు, ఎలక్ట్రానిక్ కంపెనీలు రావడం, రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడింది. ఆ ఖ్యాతి తప్పకుండా చంద్రబాబుకే దక్కుతుంది. అసలు ఏపీని ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చడానికి నాటి సీఎం చంద్రబాబు చేసిన కృషి అనన్య సామాన్యం. ఇది లోకమంతా గుర్తించింది. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి జగన్కి అవేమీ గుర్తుకు రావడం లేదు.
కానీ ప్రజలు మర్చిపోలేదు. తన పాలన గురించి, తన పాలనా ప్రత్యేకతల గురించి, సాధించిన విజయాలను ప్రచారం చేసుకోవడానికి తనకంటూ ఏమీ లేని లోటు బాగా కనపడుతోంది. అందుకే పాపం జగన్ కి మతి భ్రమించిందేమో, చంద్రబాబు పాలన లో అభివృద్ధిని తన ఖాతాలో వేసేసుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-owning-developement-done-ib-babu-rule-39-138254.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!