జగన్ నియోజకవర్గ సమీక్షలకు మంగళం.. ఎందుకో తెలుసా?

Publish Date:Sep 20, 2022

Advertisement

రాజుగారికి వేగులు ఎలాగో రాజకీయ పార్టీకి క్యాడర్ అలగ..ఇది ఏపీ సీఎం జగన్ నిశ్చితాభిప్రాయంగా కనిపిస్తోంది. రాజుగారి వేగులు రాజ్యంలో ప్రజలేమనుకుంటున్నారన్నది రహస్యంగా సమాచారం సేకరించి రాజుగారికి చేరవేస్తారు.

ఆ చేరవేసే సమాచారం అంతా రాజుగారి చెవులకు, మనసుకు హాయి కలిగించేదిలాగే ఉండాలన్నది అలిఖిత షరతు. ఎవ్వరూ ఆ సంగతిని వేగులకు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లకి అలా తెలిసిపోతుందంతే. ఏదో సినిమాలో నటి అంజలి మాటమాటికీ ‘ఏమో నాకన్నీ తెలిసిపోతాయంతే’ అంటుంటుంది. అలా ప్రత్యకమైన హేతుబద్ధమైన కారణం ఏమీ లేకుండానే రాజుగారి వేగులకు రాజుగారికి ఏం చెబితే నచ్చుతుందో అలా తెలిసిపోతుందంతే.

అలా తెలియని వేగులకు ఎలాగూ సమస్యలు తప్పవు. తల కోటగుమ్మానికైనా వేలాడొచ్చు. వేగు కొలువు ఊడిపోయినా ఊడిపోవచ్చు. జగన్ విషయంలో కూడా అంతే తమ పార్టీ అధినేతకు ఏం చెబితే రుచిస్తుందో ఆయన పార్టీ క్యాడర్ కు తెలుసు. ఏమో వారికి అలా తెలిసిపోయిందంతే. కానీ అదే క్యాడర్ లో అలాంటి లోకజ్ణానం లేని వారు కూడా ఉన్నారు.

వారు అధినేత ముందు సమస్యలు ఏకరవు పెట్టారు. అభివృద్ధి, చేసిన పనులకు బిల్లులు, ఆగిపోయిన పెన్షన్లు అంటూ కొండవీటి చాంతాడంత జాబితాను జగన్ ముందు ఉంచారు. ఎలా అంటారా? తనకు అవసరమైతే తప్ప మంత్రుల ముఖం కూడా చూడటానికి ఇష్టపడని జగన్ పార్టీ క్యాడర్ ను ఎప్పుడు కలిశారు అన్న అనుమానం కలుగుతోంది. జగన్ ను కలిసిన వారు ఓ రెండు నియోజకవర్గాలకు చెందిన క్యాడరే. వాళ్లని కూడా అనేక వడపోతల తరువాత.. వారంతా జగన్ కు పరమ భక్తులని నిర్ణయించుకున్న తరువాత వారిని జగన్ ముందు ప్రవేశ పెట్టారు.  అయితే వందిమాగధుల ఊహలు తల్లకిందులయ్యాయి. అంతటి భక్తులూ అధినేత ముందు సమస్యల చిట్టా విప్పేశారు. పార్టీ పరువు గంగలో కలిసిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని అధినేతకు నివేదించారు.

అసలు విషయమేమిటంటే.. రాష్ట్రంలో ఎన్నికల హీట్ పెరగడంతో ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గ సమీక్షలకు ఉపక్రమించారు. ముందుగా ఆయన కుప్పం, రాజాం నియోజకవర్గాల క్యాడర్ తో భేటీ కావాలని అనుకున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి 50 మంది చొప్పున ఎంపిక చేసి మరీ పిలిపించారు. వరుసగా రెండు రోజుల పాటు రోజు కో నియోజకవర్గం చొప్పున జగన్ సమీక్షించారు. అంతే అక్కడితో నియోజకవర్గ సమీక్షలను జగన్ బంద్ చేశారు. నియోజకవర్గ సమీక్షలు, క్యాడర్ తో సమావేశాలు అంటేనే ఆయన అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారనీ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఎందుకు అలా అని ఆరా తీస్తే అసలు విషయం వెల్లడైంది. పరిశీలకుల కథనం ప్రకారం జగన్ అభిమానులు టుది కోర్ అనుకున్న 50 మంది పార్టీ కార్యకర్తలను ఎంపిక చేసి మరీ నియోజకవర్గ సమీక్షల కోసం పిలిపిస్తే.. జగన్ ముందు వారు హాజరు ప్రభో అనడానికి ముందే నియోజకవర్గంలో పార్టీకి సానుకూల అంశాలు తప్ప ప్రతికూల అంశాలు ఏ మాత్రం ప్రస్తావించవద్దని విస్పష్ట ఆదేశాలు ఇస్తే.. వారు మాత్రం జగన్ ముందు సమస్యలనే ఏకరవు పెట్టారట.

బిల్లులు, పథకాలలో కోతలు, రోడ్లపై గుంతలు, అడుగంటిన అభివృద్ధి అంటూ ఓ పేద్ద జాబితాను జగన్ ముందు ఇచ్చారు. కుప్పం క్యాడర్, రాజాం క్యాడర్ కూడా కూడబలుక్కున్నట్లు ఇవే విషయాలు ప్రస్తావించడంతో జగన్ ఇక క్యాడర్ తో కలిసే ప్రశక్తే లేదని ఖరాఖండిగా నిర్ణయానికి వచ్చేశారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతో జగన్ నియోజకవర్గాల సమీక్ష రెండు నియోజకవర్గాలకే పరిమితమైంది. ఇక నియోజకవర్గాన్ని కాపాడుకుని, అక్కడ పార్టీ జెండా ఎగిరేలా చూడాల్సిన బాధ్యతను ఉన్న చోట ఎమ్మెల్యేలకూ లేని చోట్ల నియోజకవర్గ ఇన్ చార్జీలకు అప్పగించేసి జగన్ చేతులు దులిపేసుకున్నారు.  దీంతో పార్టీ క్యాడర్ లో అసంతృప్తి కొండలా పేరుకు పోతోంది. ఈ పరిస్థితిపై పార్టీ క్షత్రస్థాయి క్యాడర్ లో ఆందోళన పెరుగుతోంది. జగన్ ఇప్పటికైనా పట్టించుకుని క్యాడర్ సమస్యలను అడ్రస్ చేయకపోతే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ తరఫున పని చేయడానికి క్యాడర్ ఉండని పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

By
en-us Political News

  
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.