పచ్ఛగడ్డికోసేటి పడుచుపిల్లా... అంటూ నాగేశ్వర్రావు వాణిశ్రీని ఆటపట్టించే పాట అప్పట్లో చెవులు కోసు కుని వినేవారు, ఆ ఒక్కపాట కోసమే జనం వీలయినన్నిసార్లు చూశారు. ఆ ప్రేమ పొలంలో గడ్డికోయిస్తూ పెరి గింది. కానీ ఎక్కడో ఆస్ట్రేలియాలో లాప్టాప్మీద చక్కగా వేళ్లను నొప్పుల్లేకుండా టైప్ చేయాల్సిన అమ్మా యి హర్యానా పల్లెలో గడ్డిమోసేంత ఫ్రేమలో పడింది!
ప్రేమకు ఏదీ అడ్డులేదు..దేశ సరిహద్దులూ చెరిగిపోతున్నాయి. ఈరోజుల్లో ఎవరు ఎవర్నయినా ప్రేమించి పెళ్లాడేస్తున్నారు. ప్రేమ పుట్టాలే గాని పక్కింటి రామలక్ష్మయినా, మెల్బోర్న్ కోర్ట్నీ అయినా దేశాలు దాటా ల్సిందే! చిత్రమేమంటే మన సంస్కృతీ సంప్రదాయాల్ని విదేశీయులు అమాంతం ఇష్టపడటం, వీల యితే ఫాలో అవుతున్నారు. చాలామంది విదేశీయులు భారత్లో పల్లెల్లో తిరగడానికి ఎంతో ఇష్టపడుతు న్నారు. వాళ్లకి నగరాల్లో తిరిగి తిరిగి, తిని తినీ మన పల్లెల్లోకి వచ్చి ఇడ్లీలు, మిరపకాయ బజ్జీలు అంటే నాలిక కోసుకుంటున్నారు! దీనికి తోడు ప్రేమలో పడితే వెంటనే మెల్బోర్న్నీ వదిలి బుందేల్ఖండ్ అయినా పరిగెట్టి వచ్చేస్తామంటున్నారు. అదీ సంగతి అదీ ప్రేమ శక్తి, అదే కోర్ట్నీని బీహార్కి లాక్కొచ్చింది!
లవ్లీన్ అనే హర్యానా కుర్రాడి భార్య కోర్ట్నీ. ఆమె తన భర్తతో హర్యానా గ్రామంలోనే ఉండడానికి ఇష్టపడి వచ్చేసింది. అత్తమామలకు హిందీ తప్ప మరోటి రాదు. ఈమెకు ఇంగ్లీషు.. మధ్యలో ట్రాన్స్లేటర్గా భర్త.. ఎన్నాళ్లు జోడు పదవులు నడుపుతాడో మరి. కానీ అతి త్వరలోనే అమ్మాయికి ఎంతో కొంత హిందీ నేర్పితే పెద్దవాళ్లిద్దరూ బతికిపోతారు. ప్రస్తుతానికయితే పొలాలు, పంటలు పండించడం, కోతలు రైతాంగం గురించి అబ్బాయిగారు తన ఇంగ్లీషు భార్యామణికి చాలానే చెప్పేశాడట. అందుకే ఆమె అత్యుత్సాహంతో పొలంలో వాణిశ్రీలా గడ్డిమోపు తలమీదెట్టుకుని మరీ నడవడం బాగా ప్రాక్టీస్ చేసింది. కొత్త ఎప్పుడూ వింతే! గడ్డి, గడ్డిమోపులు, గేదెలు, పొలాలు మనకి పాత, కాస్తంత చిరాకేమో.. ఆ పిల్లకి మాత్ర మహా సరదా!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/its-love-that-let-her-walk-in-farmland-39-145112.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.