ఎదిగిన మనిషి

Publish Date:Nov 8, 2016

Advertisement

 

అతను కోట్ల రూపాయల విలువ చేసే సంస్థకు అధిపతి. కానీ ఆ సంస్థను ఆయన తరువాత చేపట్టేందుకు పిల్లలు లేరు. అయినా ఆయన పెద్దగా బాధపడేవాడు కాదు. తన ఉద్యోగులలో సమర్థమైనవాడికే ఆ సంస్థ పగ్గాలు అందించాలని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. ఆ రోజు రానేవచ్చింది. తనకు వారసుడిగా ఆ కంపెనీని ఎవరి చేతిలో ఉంచాలా అని నిశ్చయించేందుకు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి ఒక పదిమంది ఉద్యోగులు హాజరయ్యారు.

 

‘‘సుదీర్ఘకాలంగా నా సంస్థలోని ఉద్యోగులందరినీ గమనించిన మీదట, వందలాది మంది ఉద్యోగులలలో మీరు అత్యంత సమర్థులు అని తేలింది. ఇక మీలో ఎవరో ఒకరికి నా కంపెనీ బాధ్యతలని అప్పచెప్పబోతున్నాను,’’ అన్నాడు యజమాని. యజమాని మాటలకి ఉద్యోగుల మనసులు సంతోషంతో గంతులు వేశాయి. కానీ ‘‘మీ అందరిలోకి ప్రతిభావంతుడు ఎవరా అని తేల్చేందుకు నేను ఒక పరీక్షను పెట్టాలనుకుంటున్నాను,’’ అని యజమాని చెప్పేసరికి అప్పటిదాకా సంతోషంతో ఎగిరిన వారి మనసులు కాస్తా బిక్కచచ్చిపోయాయి. ఈలోగా యజమాని తన ముందున్న ఒక పెట్టేలోంచి పది గింజలను బయటకు తీశాడు.

 

‘‘సంస్థ అనేది ఒక మొక్కలాంటిది. ఆ మొక్కను పెంచి పెద్దచేయాలంటే ఎంతో శ్రమ, మరెంతో పట్టుదల అవసరం. మీలో అలాంటి లక్షణాలు ఎంతవరకు ఉన్నాయో తేల్చేందుకే ఈ పరీక్ష. నేను మీ అందరికీ తలా ఒక చిక్కుడు గింజను ఇస్తున్నాను. వాటిని మీరు ఒక రెండు నెలలపాటు పెంచి చూపించాలి,’’ అంటూ తలా ఓ గింజా చేతిలో ఉంచాడు.

 

ఆ గింజలను అందుకున్నవారంతా సంతోషంగా వాటిని ఇంటికి తీసుకువెళ్లారు. వాటికి రోజూ నీళ్లు పోయసాగారు. అసలు చిక్కుడు మొక్క అన్న పేరే విననివారు, దానిని ఎలా పెంచాలో తెలుసుకొనేందుకు ఇంటర్నెట్‌లో తెగ వెతకసాగారు. రోజూ తాము పెంచుతున్న చిక్కుడు మొక్క ఎంత అద్భుతంగా ఉందో ఎదుటివారితో గంటల తరబడి మాట్లాడటం మొదలుపెట్టారు.

 

ఇలా ఒక  రెండు నెలలు గడిచాయి. యజమాని ఇచ్చిన గడువు పూర్తయ్యింది. తలా ఒక కుండీని తీసుకుని యాజమాని ముందు చేరారు. ఒకొక్కరే తమ చేతిలోని కుండీని యజమానికి చూపుతూ సంబరపడిపోసాగారు. యజమాని చిరునవ్వుతో వాటిని చూస్తుండిపోయాడు. ఇంతలో ఒక ఉద్యోగి వెనకాలే ఉండిపోవడాన్ని యజమాని గుర్తించాడు.
‘‘అదేంటి నీ చేతిలో ఉన్న కుండీని చూపించకుండా అలా ఉండిపోయావేంటి?’’ అని అడిగాడు యజమాని. దానికి సదరు ఉద్యోగి వణికిపోతూ ముందుకువచ్చాడు. అతని చేతిలోని కుండీని చూసి ఉద్యోగులంతా ఒక్కసారి గొల్లున నవ్వారు. కారణం! అందులో అసలు మొక్కే లేదు.

 

‘‘సర్! క్షమించండి. మీరు ఇచ్చిన గింజని నేను చాలా శ్రద్ధగానే నాటాను. దానికి తగినంత మట్టి ఉండేలా చూసుకున్నాను. రోజూ నీళ్లు కూడా పోశాను. కానీ ఎందుకనో ఇన్నాళ్లు గడిచినా అది మొలక వేయనే లేదు. మీరు పెట్టిన పరీక్షలో నేను పరాజయం పొందాను,’’ అన్నాడు ఆ ఉద్యోగి సిగ్గుపడుతూ.

 

ఉద్యోగి చెప్పిన మాటలు విన్న యజమాని ఒక్క పెట్టున నవ్వాడు. ‘‘అదేం కాదు! పరీక్షలో నువ్వొక్కడివే నెగ్గావు. నిజానికి నేను మీ అందరికీ కాల్చి, ఉప్పునీటిలో ఉడకబెట్టిన గింజలను ఇచ్చాను. అవి మొక్కలుగా మారే సమస్యే లేదు. కానీ మీరంతా ఎలాగొలా పరీక్షని నెగ్గితీరాలన్న పంతంతో ఏపుగా పెరిగిన మరో మొక్కని తీసుకువచ్చి నాకు చూపించారు. మనిషి ఎదగాలంటే శ్రమ, పట్టుదల ఎంత అవసరమో నిజాయితీ కూడా అంతే అవసరం. అవి అతనిలో మాత్రమే ఉన్నాయి,’’ అని తేల్చాడు.

 

ఈ కథని మనం చాలాసార్లు చదివే ఉంటాము. కాకపోతే పాత్రలు మారి ఉండవచ్చు. పరీక్ష వేరుగా ఉండి ఉండవచ్చు. కానీ ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఒప్పుకోగలిగేవాడు విజయం సాధిస్తాడన్న నీతి మాత్రం మారదు. విజయం సాధించినా సాధించకపోయినా నిజాయితీ ఉన్నవాడు ఇతరులకంటే ఒక మెట్టు పైనే నిలబడగలడన్న సూత్రమూ మారదు.

 

- నిర్జర.

By
en-us Political News

  
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.