కమల దళంలో అంతర్మథనం.. కొత్త శకానికి శ్రీకారం?

Publish Date:Apr 22, 2025

Advertisement

భారతీయ జనతా పార్టీలో ఏమి జరగుతోంది? జాతీయ అధ్యక్షుని ఎన్నికలో ఎందుకు ఇంత జాప్యం జరుగుతోంది? తెలంగాణ సహా అనేక ఇతర రాష్ట్రల్లో రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక ఎందుకు ముడిపడడం లేదు? అందుకు పార్టీ నేతలు చెపుతున్న కారణాలేనా లేక ఇంకా లోతైన కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే, కమల దళంలో జరుగతున్న పరిణామాల వెనక  లోతైన కారణాలే ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారంగా తెలుస్తోంది. నిజానికి పైకి కనిపిస్తున్నడానికి లోపల జరుగతున్న పరిణామాలకు పొంతనలేదని అంటున్నారు.

 అవును ఢిల్లీలో చోటు  చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే..  భవిష్యత్ లక్ష్యాలు, భవిష్యత్ వ్యూహాలు ఆధారంగా ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో అనివార్యంగా  చేపట్టవలసిన  పెను మార్పులపై లోతైన చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే  పైకి అంతా బాగుందన్నట్లు కనిపిస్తున్నా, అంతర్గతంగా అనేక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని, అందుకే ఒకదానితో ఒకటి ముడి పడిన కీలక నిర్ణయాల్లో జాప్యం జరుగుతోందని అంటున్నారు.  ఇటీవల  అటు ఢిల్లీలో ఇటు నాగాపూర్ లో అగ్రనేతల వరస సమావేశాలు కేవలం పార్టీ అధ్యక్షుని ఎన్నికకు పరిమతం కాదని.. అంతకు మించిన అంతర్మధనం జరుగుతోందని  విశ్లేషకులు అంటున్నారు. 

ముఖ్యంగా  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాగపూర్ పర్యటన (మార్చి30) తర్వాత, చోటు చేసుకుంటున్న పరిణామాలు బీజేపీలో ఏదో జరుగుతోందనే అనుమానాలకు మరింత బలం చేకూర్చే విధంగా ఉన్నాయని, అంటున్నారు.  అలాగే  బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంబంధాల విషయంలోనూ పునఃసమీక్ష జరుగుతోందని విశ్వసనీయంగా తెలుస్తోంది.  ఆర్ఎస్ఎస్ వందేళ్ళ పండగను పురస్కరించుకుని, సంఘ్ పరివార్ ఎజెండాలో మిగిలి  ఉన్న అంశాలపై మరింత దృష్టి పెట్టాలని ఆర్ఎస్ఎస్ బావిస్తోందని అంటున్నారు .అందులో భాగంగా పార్టీ పైన, ప్రభుత్వం పైన కూడా నాగపూర్ ప్రత్యక్ష పర్యవేక్షణ ఉండేలా,  ఢిల్లీ పై నాగపూర్ పట్టు బిగిస్తోందని అంటున్నారు. 

మళ్ళీ ఉప ప్రధాని?

 ఈ నేపధ్యంలో  రానున్న రోజుల్లో ఇటు బీజేపీలో, అటు ప్రభుత్వంలో భారీ మార్పులు ఉంటాయని, అంటున్నారు. ఇందులో భాగంగా, గతంలో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో ఉన్న ఉప ప్రధాని పదవిని పునరుద్దరించే ఆలోచన ఉందని అంటున్నారు. వాజ్ పేయి ప్రభుత్వంలో హోం మంత్రిగా ఉన్న అద్వానీకి  2002లో ఆర్ఎస్ఎస్ ఆలోచన మేరకే   పదోన్నతి లభించిందనీ, ఇప్పడు కూడా, ఆర్ఎస్ఎస్ ఆలోచన మేరకే మళ్ళీ  ఉప ప్రధాని పదవిని పునరుద్దరించాలని  భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే..  అప్పటిలాగా ఇప్పడు కూడా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు పదోన్నతి లభిస్తుందా? ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్, నాగపూర్ ఎంపీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలలో ఒకరిని అదృష్టం వరిస్తుందా? అన్నది   తెలియాల్సి ఉందంటున్నారు.  నిజానికి, ప్రస్తుతం  బీజేపీ ముందున్న ప్రధాన సమస్య, ప్రధాన చిక్కు ముడి ఇదే అంటున్నారు.

ఈ రోజు  ఉప ప్రధాని రేపటి  ప్రధాని?

అవును. 2002లో ఉప ప్రధానిగా పదవిని చేపట్టిన అద్వానీ, 2004 ఎన్నికలలో  బీజేపీ ప్రధాని అభ్యర్ధిగా తెరపైకి వచ్చారు. అటల్జీ ప్రధానిగా ఉన్న సమయంలోనే అద్వానీని బీజేపీ, ఎన్డీఎ కూటమి ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించింది. సరే.. ఆ ఏన్నికల్లో బీజేపీ సారధ్యంలోని ఎన్డీఎ బండి తిరగబడింది. కాంగ్రెస్ సారథ్యంలోని యుపీఎ అధికారంలోకి వచ్చింది. అద్వానీ, ఐదేళ్ళు ప్రతిపక్ష నేతగా కొనసాగారు. తిరిగి 2009 లోనూ ఆయనే ప్రధాని అభ్యర్ధిగా బీజేపీ బరిలో దిగింది. అయితే మళ్ళీ అదే ఫలితం ఎదురైంది. అద్వానీ మరోసారి బస్సు మిస్సయ్యారు.   అది వేరే విషయం.  అదలా ఉంచితే, ఇప్పడు మళ్ళీ అదే ఆనవాయితీ కొనసాగితే, ఈ రోజు ఉప ప్రధాని ఎవరైతే వారే రేపటి (2029) ప్రధాని అభ్యర్ధి అవుతారు. అందుకే. పార్టీలో  ఇంతటి అంతర్మథనం సాగుతోందని, పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే, ఆర్ఎస్ఎస్ అనుకున్నది అనుకున్నట్లు జరిగితే, మోదీ సహా చాలా మంది సీనియర్లు తెరమరుగు అవుతారని, కొత్త తరం తెరపైకి వస్తుందనీ,  కమల దళంలో కొత్త శకానికి శ్రీకారం చుడుతుందని అంటున్నారు.

By
en-us Political News

  
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు. క‌ట్ చేస్తే ఏదో అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.