పరిస్థితులు తారుమారు.. ఒకప్పుడు పప్పులు.. ఇప్పుడు హీరోలు.!

Publish Date:Aug 10, 2026

Advertisement

భారతీయ రాజకీయాల్లో గత కొద్ది సంవత్సరాలుగా   ఎక్కువగా వినిపిస్తున్న,   చర్చనీయాంశమైన పదాలలో  పప్పు అన్న మొదటి వరుసలో ఉంటుంది.   ప్రత్యర్థులపై వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి, వారి సామర్థ్యాన్ని తక్కువ చేసి చూపించడానికి రాజకీయ నాయకులు తరచూ ఈ పప్పు పదాన్ని ఉపయోగించారు. జాతీయ రాజకీయాలలో ఈ పప్పు అన్న పదానికి ప్రత్యామ్నాయంగా రాహుల్ ను చూపుతూ ప్రత్యర్థులు తెగ ట్రోల్ చేసేవారు.

అలాగే ఏపీలో పప్పు పద ప్రయోగానికి ఎక్కువగా గురైన వారు నారా లోకేష్. లోకేష్ తన యువగళం పాదయాత్ర ద్వారా కంప్లీట్ గా  మేకోవర్ అయ్యారు. గతంలో ఆయనను పప్పు అంటూ ఎగతాళి చేసిన వారే లోకేష్ పరిణితిని, ట్రాన్స్ ఫార్మ్ అయిన తీరును ప్రశంసించాల్సిన పరిస్థితిలో పడ్డారు. గతంలో ఆయనను పప్పు అంటూ ఎగతాళి చేసిన వారు ఇప్పుడు సైలెంటైపోయారు.   పప్పు అన్న పదం ఇప్పుడు ఎవరిని ఉద్దేశించి మారుతోందన్న చర్చ రాష్ట్ర రాజకీయాలలో జోరుగా సాగుతోంది. అలాగే జాతీయ రాజకీయాలలో కూడా రాహుల్ గాంధీ పరిణితి చెందిన నేతగా మేకోవర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 

కాలంతో పాటు  రాజకీయ పరిస్థితులు కూడా మారుతుంటాయి. ఒకప్పుడు కొందరిని లక్ష్యంగా చేసుకుని విసిరిన ఈ పదబంధం, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాల మధ్య ఎవరిని ఉద్దేశించాలన్న చర్చ జోరందుకుంది.  రాజకీయ విశ్లేషకులు ,  మేధావులు ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.   ప్రజాస్వామ్యంలో ప్రజల ఆలోచనా విధానం, యువత స్పందన,  నాయకుల ఇమేజ్ ఎల్లప్పుడూ ఒకేలా ఉండవని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. 

పార్లమెంటు వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య జరిగే వాదనలు,   ప్రభుత్వ పనితీరుపై వచ్చే గణాంకాలు ఈ రాజకీయ పదాల పుట్టుకకు, వాటి అర్థం మారడానికి  కారణం అవుతున్నాయి.  లోక్‌సభలో జరిగిన చర్చల సమయంలో కొందరు ఎంపీలు ద్రవ్యోల్బణం, పడిపోతున్న పారిశ్రామిక వృద్ధి రేటు వంటి అధికారిక గణాంకాలను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ సమయంలో తయారీ రంగంలో నమోదైన ప్రతికూల వృద్ధి రేట్లు,  ఆర్థిక సంక్షోభ సూచీలను ఉదహరిస్తూ, అసలైన అసమర్థత ఎవరిదంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి. సమాజంలో ఒకవైపు ప్రజా వ్యతిరేకత పెరుగుతున్నప్పుడు, కేవలం సోషల్ మీడియా ప్రచారాలు లేదా క్యూరేటెడ్ ఇమేజ్ మేనేజ్‌మెంట్  శాశ్వతం కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశంలో మారుతున్న యువత ఆలోచనా ధోరణి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం,ఆర్థిక అసమానతలు వంటి వాస్తవ సమస్యలను ప్రజలు  గమనిస్తున్నారు. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ట్రెండ్లు, మీమ్స్,  క్రియేటర్ ఎకానమీ ద్వారా రాజకీయ నాయకుల వ్యూహాలను యువత తిప్పికొడుతోంది.   

ఒకప్పుడు ఒకరిని అప్రతిష్ఠపాలు చేయడానికి వాడిన పప్పు అన్న పదమే ఇప్పుడు బూమరాంగ్ అయ్యి.. ఎవరిని ఇరుకున పెడుతుందో గమనించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా, ప్రజాస్వామ్యంలో ఏ  ఇమేజ్ కూడా శాశ్వతం కాదని, ప్రజల చైతన్యమే అంతిమ తీర్పును ఇస్తుందని చరిత్ర పదే పదే నిరూపిస్తుంటుంది. రాహుల్ గాంధీని పప్పు అంటూ ఎగతాళి చేసిన వారూ, యువత అంటే 59 ఏళ్ల యువకులు కారంటూ ఎద్దేవా చేసిన వారూ ఇప్పటి పరిస్థితుల్లో యూత్ ట్రోలింగ్ కు గురి కావడమే కాకుండా వాస్తవ సరిస్థితులలో అడుగు వెనక్కు వేసి మరీ ఆబోరు కాపాడుకోవలసిన పరిస్థితిలో ఉన్నారు. 

Indian politics, Pappu political term, Parliament debate, economic indicators, political narrative, Trolling, bumarang

By
en-us Political News

  
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
పొత్తు ధర్మానికి విరుద్ధంగా, శ్రేణుల్లో అయోమయం సృష్టించేలా వ్యవహరిస్తున్నవీరి వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రెండు పార్టీల హైకమాండ్ లూ రంగంలోకి దిగాయి. ఇకపై ఎలాంటి బహిరంగ విమర్శలకు దిగకూడదని, సంయమనం పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఇరు నేతలకు అధిష్ఠానాల నుంచి సీరియస్ వార్నింగ్ లు వెళ్లినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
రాజమహేంద్రవరంలో డాక్టర్ ప్రియాంక ఘటన అయినా.. కాశీబుగ్ట సమీపంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరవవర్మ హిట్ అండ్ రన్ కేసు అయినా.. రాజకీయంతో సంబంధం లేకుండా ఈ విషయంలో నిర్లక్ష్య డ్రైవంగ్ తో నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటనగానే చూసి నిందితులకు శిక్ష పడాలనే ఎవరైనా కోరుకుంటారు. కానీ జగన్ రెడ్డి రూట్ మాత్రం సపరేట్ గా కనిపిస్తోంది.
గత కొంత కాలంగా ఆయన బీజేపీ గూటికి చేరుతారా, లేదా ఫ్యాన్ పార్టీలోనే చేరి హోం కమింగ్ అంటారా అన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఆ మధ్య ఒక సారి తాను సొంత పార్టీ పెడతానంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఆ తరువాత ఆ విషయంలో ఒక అడుగు కూడా ముందుకు వేయలేదు. అయితే గత రెండు మూడు రోజులుగా.. సోషల్ మీడియాలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ మళ్లీ విజయసాయి కొత్త పార్టీ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి.
వివిధ చేతివృత్తులు, సాంప్రదాయ వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న రజక, నాయిబ్రాహ్మణ, కుమ్మరి, చేనేత, మత్స్యకార, గాండ్ల,  ఇతర వెనుకబడిన కులాలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఉపాధి పరికరాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
మెగా డీఎస్సీ   ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది. , మెగా డీఎస్సీ పట్ల యువతలో బై అండ్ లార్జ్ హర్షం వ్యక్తం అవుతోంది. నియామక ప్రక్రియ పారదర్శకంగా ఉందన్న భావనే సర్వత్రా గట్టిగా వ్యక్త మౌతోంది. డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నిరసనలకు వ్యతిరేకంగా జగన్ ఖిల్లా అయిన కడపలో యువత రోడ్డెక్కారు.
 ఒంగోలు ఎమ్మెల్యే  దామచర్ల జనార్ధన్‌రావు, మాజీ మంత్రి,   జనసేన   సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి విభేదాలు ఇరు పార్టీల మధ్యా రాజకీయ రచ్చకు కారణమైంది.  దామచర్ల, బాలినేని మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, అలాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి.  
యువ రాజకీయనాయకుడిగా గతంలో ఎదుర్కొన్న విమర్శలను పటాపంచలు చేస్తూ, పరిపాలనా విధానాల్లో సాధించిన పరిణతి, స్పష్టమైన వ్యూహాలతో ఆయన తన రాజీకీయ ఇమేజ్‌ను పూర్తిగా ట్రాన్స్ ఫార్మ్ చేసుకున్నారని ఆ కథనం పేర్కొంంది.
ఉత్తర్ ప్రదేశ్ రాజకీయం మళ్లీ ఒక్కసారిగా తీవ్రస్థాయిలో వేడెక్కింది.
టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో యూనిట్ ఇంఛార్జ్‌లకు నిర్వహించిన శిక్షణా తరగతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా కేవలం 11 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే విషయంలో తాజాగా తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైనా 40 శాతం ఓటు షేర్ దక్కించుకుందని చెప్పారు.
దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులను పక్కనపెట్టి, కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంపై తమ్ముళ్లలో అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఈ పరిణామాలు నారా లోకేష్ నాయకత్వ తీరుపై, కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై పార్టీలోనే అసంతృప్తి వ్యక్తమౌతోంది.
ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు హైకోర్టులో ఏకంగా 300 కోర్టు కేసులు వేయించారని, అయితే ధర్మాసనం వారికి తీవ్రంగా మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పిందని గుర్తుచేశారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే వైకాపా నైజమని మండిపడ్డారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.