తెలంగాణలో బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్న సెలబ్రిటీలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కు పాదం మోపిన సంగతి తెలిసిందే వివిధ పోలీస్ స్టేషన్ లలో కేసులు నమోదు కావడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న సెలబ్రిటీలు పోలీసుల విచారణకు డుమ్మా కొడుతున్నారు. అరెస్ట్ చేస్తారన్న భయంతో విచారణకు హాజరు కావడం లేదని సెలబ్రిటీలు చెబుతున్నారు. నేరం చేయనప్పుడు అరెస్ట్ చేసే అవకాశమే లేదు . అయినా సెలబ్రిటిలు పోలీసుల విచారణకు డుమ్మా కొట్టడానికి ప్రధాన కారణం బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహించడమే. బెట్టింగ్ యాప్ ప్రోత్సహించడం హీనియస్ క్రైం. బెట్టింగ్ యాప్ ల వల్ల ఆత్మహత్యలు కూడా తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్నాయి కూడా. ఈ విషయం తెలుసుకాబట్టే సెలబ్రిటీలు పోలీస్ స్టేషన్ లకు రావడానికి భయపడుతున్నారు. అలా భయపడుతున్న వారిలో యూట్యూబర్ హర్షసాయి చేరాడు. ఆయనపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో వేర్వురు కేసులు నమోదయ్యాయి. విచారణకు రావాలని పోలీసులు పిలిచినప్పటికీ హర్షసాయి ముఖం చాటేశాడు. నేరుగా గురువారం ( ఏప్రిల్ 3) హైకోర్టును ఆశ్రయించాడు. తనపై మియాపూర్ , పంజాగుట్ట పోలీస్ స్టేషన్లలో అక్రమ కేసులు నమోదయ్యాయంటూ న్యాయస్థానం ఆశ్రయించాడు. తనపై కక్ష్య కట్టిన కొందరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని చెబుతున్నారు. వాస్తవానికి సామాజిక కార్యకర్త ఒకరు ఆధారాలతో బయట పెట్టడం వల్లే 15 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. ఈ ఆధారాలతో పోలీసులు చార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్టుకు సమర్పిస్తారు. కోర్టు విచారణ జరుపుతుంది. అభియోగాలు ఎదుర్కొంటున్న వారు తాము నిర్దోషులమని ప్రూవ్ చేసుకోవల్సి ఉంటుంది. అవేవి లేకుండానే సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు హైకోర్టు నాశ్రయిస్తున్నారు. తనపై నమోదైన కేసులు క్వాష్ చేయాలని కోర్టును అభ్యర్థిస్తున్నారు. కేవలం కేసు నమోదైతేనే కోర్టు నాశ్రయించడం అంటే తాము చేసిన నేరాన్ని పరోక్షంగా ఒప్పుకోవడమేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. హైకోర్టునాశ్రయించిన సెలబ్రిటీలలో మొదటి స్థానంలో నిలిచిన వారిలో వైకాపా అధికార ప్రతినిధి శ్యామల ఉన్నారు. కాసులకు కక్కుర్తి పడ్డ శ్యామల ఒక్కో బెట్టింగ్ యాప్ నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది. ఆమె హైకోర్టు నాశ్రయించి తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని అభ్యర్థించింది. ఆమె అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. యాంకర్ విష్ణు ప్రియ కూడా తెలంగాణ హైకోర్టు నాశ్రయించి భంగపడింది. తాజాగా యూట్యూబర్ హర్షసాయి హైకోర్టు నాశ్రయించినప్పటికీ ఫలితం శూన్యమని న్యాయనిపుణులు చెబుతున్నారు. క్వాష్ కొట్టివేస్తే అవమానమైనప్పటికీ హర్షసాయి హైకోర్టునాశ్రయించడం గమనార్హం. హర్షసాయిపై ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్ అత్యాచార ఆరోపణలు చేశారు. ఆయనపై నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైనప్పటికీ పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకున్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి హర్షసాయి మోసం చేసినట్టు ముంబైకు చెందిన యువతి కూడా కేసు పెట్టిన సంగతి తెలిసిందే. డబ్బులు ఆర్జించడమే పరమావధిగా సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్ లను ప్రోత్సహిస్తున్నారు. దొరికితే దొంగ దొరకకపోతే దొర అన్నట్టుంది సెలబ్రిటీల తీరు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/if-found-25-195521.html
సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. సీతారాం ఏచూరి గత ఏడాది మృతి చెందినప్పటి నుంచీ సీపీఎం ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగా ఉంది. . ఈ నేపథ్యంలో తమిళనాడులోని మదురైలో జరిగిన పార్టీ 24వ మహాసభల్లో కేరళ మాజీ ఎంఏ బేబీ సీపీఎం నూతన సారథిగాఎన్నికయ్యారు.
శ్రీ రామనవమి రోజే వేములవాడ రాజన్న ను వరుడిగా భావించి హిజ్రాలు పెళ్లి చేసుకునే ఆచారం అనాదిగా వస్తోంది. ప్రతీ యేటా శ్రీ రామనవమి రోజు హిజ్రాలు రాజరాజేశ్వర స్వామికి భార్యలుగా భావించి పెళ్లి చేసుకుంటారు. హిజ్రాలంటే సమాజంలో చులకన భావం ఉంది. ఆ చులకన భావాన్ని పోగొట్టే విధంగా శ్రీరామనవమి రోజే హిజ్రాలు ఏడడుగుల బంధంలో అడుగుపెడతారు.
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. వేలాది భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు
వైకాపా నేత , మాజీమంత్రి అంజద్ భాషా సోదరుడు అహ్మద్ బాషా అరెస్ట్ అయ్యారు. అహ్మద్ భాషాపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారి అయిన సంగతి తెలిసిందే.
తెలంగాణలో రేషన్ బియ్యం దళారులు చేతుల్లో వెళ్లిపోతుంది. దీనికి ప్రధాన కారణం దొడ్డు బియ్యం. ఈ బియ్యం వండుకుని తినడానికి ఎవరూ ఆసక్తి కనబరచడంలేదు.
తెలంగాణ బిజెపి సారథి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టార్గెట్ గా హైద్రాబాద్ కు చెందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన విమర్శల నేపథ్యంలో పార్టీలో అంతర్యుద్దం మొదలైంది. రాజాసింగ్ వ్యాఖ్యలను పార్టీ ఇంతవరకు ఖండించలేదు
కాంక్రీట్ జంగిల్ గా మారిన నగరాల్లో వన్య ప్రాణులు వచ్చేస్తున్నాయి. తాజాగా తిరుపతిలోని ఎస్వీయు క్యాంపస్ లో చిరుతపులి చిక్కింది. గత కొంత కాలంగా ఈ చిరుతపులి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది అటవీ శాఖ ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం ఇదే తొలిసారి. ఆదివారం (ఏప్రిల్ 6) ఉదయం జస్టిస్ సంజీవ్ ఖన్నా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం (ఏప్రిల్ 6) స్వామివారిని దర్శించుకునేందుకు 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
కోహినూర్ వజ్రం గురించి మనం ఎక్కడో ఎప్పుడో వినే ఉంటాం. అవును చిన్నప్పడు పాఠ్య పుస్తకాల్లో ఎక్కడో చదువుకునే ఉంటాం. అయితే, ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాలలో ఒకటైన కోహినూర్ వజ్రం ఇప్పడు ఎక్కడుందో, మనలో చాలా మందికి తెలియదు. ఇప్పడు ఎక్కడ వుందో అనే కాదు, అసలు ఎక్కడ పుట్టిందో, అక్కడికి ఎలా చేరిందో కూడా మనకు తెలియదు.
పార్లమెంట్ సమావేశాలంటే, ఏముంది? మూడు వాయిదాలు, ఆరు వాకౌట్లు. కాదంటే, గౌరవ సభ్యుల అరుపులు, కేకలు.. నిరసనలు, నినాదాలు, ఇంతే కదా అని ఎవరైనా అనుకుంటే అనుకోవచ్చును. తప్పు కాదని చెప్ప లేము.
అవును మరి సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని కదా అంటారు. సో.. పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా అందరం చూస్తున్నది అదే అయినప్పుడు.. కళ్ళ ముందు కనిపిస్తున్న చిత్ర విచిత్ర, విన్యాస వికారాలను, కాదని అనడం కుదరదు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వేదికగా కొత్త స్కెచ్ లు వేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసిపి అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. రోజుకు ఒకరి పైన కేసులు నమోదు అవుతున్నాయి.
రాజమండ్రి వైసీపీలో మాజీ ఎంపీ మార్గాని భరత్, జక్కంపూడి గణేష్ల మధ్య ఆధిపత్యపోరు పోరు తార స్థాయికి చేరుకుంది. ఆ ఇద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఆ పార్టీ పరువుతో పాటు నాయకుల ప్రతిష్ఠను కూడా బజారున పడేస్తున్నది.