Publish Date:Oct 10, 2022
భారత్ మహిళల క్రికెట్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, పాకిస్తాన్ వికెట్కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ ఐసిసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నారు. ఇంగ్లండ్ తో భారత్ తలపడిన వన్డే సిరీస్ లో హర్మన్ ప్రీత్ అద్బుత ప్రతిభ కనపరచిన సంగతి తెలిసిందే. ఐసిసి సెప్టెంబర్ నెల అవార్డు పోటీలో భారత్ వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన, బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానాలను హర్మన్ అధిగమించింది. వాస్తవా నికి వారిద్దరూ గత టోర్నీల్లో ఎంతో అద్భుత ప్రతిభ కనపరిచారు.
నిగర్, స్మృతీతో పోటీపడి ఈ అవార్డు గెలుచుకోవడం గొప్ప ఆనందాన్నిస్తోందని హర్మన్ ప్రీత్ అన్నది. ఇంగ్లండ్లో ఇంగ్లండ్ మీద వన్డే సిరీస్ గెలవడం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఎన్నదగ్గ విజయమని, అందుకు ప్రజలు, క్రికెట్ అభిమానుల నుంచి ఇప్పటికే శుభాకాంక్షలు అందుకున్నామని భారత్ కెప్టెన్ అన్నది. 1999 తర్వాత ఇంతటి ఘన విజయం సాధించడం అదే మొదటిసారి కావడం విశేషం. పైగా కెప్టెన్ గా ఆమెకు ఎంతో ప్రత్యేకం. ఈ సిరీస్ లో ఆమె 103.27 స్ట్రయిక్రేట్తో 221 యావరేజ్తో అత్యధి కంగా 221 పరుగులు చేసింది.
ఐసీసీఅవార్డుల పోటీలో భారత్స్పిన్నర్ అక్షర్ పటేల్, ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్రీన్లను అధిగమిం చాడు పాక్ ఆల్రౌండర్ రిజ్వాన్. సెప్టెంబర్లో జరిగిన టి20 ల్లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శించి అందరి దృష్టీ ఆకట్టుకున్నాడు. తన అవార్డును ఇటీవల పాకిస్తాన్లో భారీ వర్షాలకు కష్టాల్లో చిక్కుకున్న ప్రజలకు అంకితమిస్తున్నానని రిజ్వాన్ ప్రకటించాడు. సెప్టెంబర్లో పాక్ స్టార్ ఆడిన పది మ్యాచ్ల్లో ఏడు అర్ధ సెంచరీలు చేశాడు. ఆసియాకప్లో హాంకాంగ్, భారత్ ల మీద విజృంభించా డు. టోర్నీలో అత్యధిక స్కోర్ చేసిన బ్యాట్స్మన్గా నిలిచాడు.
కాగా విజేతలు హర్మన్ ప్రీత్, రిజ్వాన్లు ఐసిసి నుంచి బంగారు పతకాలు అందుకుంటారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/icc-players-of-the-monthharmanpreet-39-145203.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.