విలువైన సంపద – మానవత్వమే!

Publish Date:May 3, 2021

Advertisement

చాలా రోజుల క్రితం అరబ్‌ దేశంలో ఓ వర్తకుడు ఉండేవాడు. ఆ వర్తకుడి దగ్గర ఉన్న గుర్రం చుట్టుపక్కలలోకెల్లా అద్భుతమైనది చెప్పుకొనేవారు. దాని అందానికి కానీ, వేగానికి కానీ సాటి వచ్చే గుర్రం మరోటి లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి గుర్రాన్ని చేజిక్కించుకోవాలని చుట్టుపక్కల ధనవంతులంతా తెగ ఉబలాటపడేవారు. వారిలో ఒమర్‌ ఒకడు. వర్తకుడి గుర్రం కోసం ఒమర్ ఎంత ధనం ఇవ్వచూపినా, బదులుగా ఎన్ని ఒంటెలను ఇస్తానన్నా వర్తకుడు ఏమాత్రం లొంగలేదు. తన గుర్రాన్ని ఎట్టి పరిస్థితులలోనూ ఎవ్వరికీ ఇవ్వబోనని తేల్చి చెప్పేశాడు.

 

వర్తకుడు తన డబ్బుకి లొంగకపోయేసరికి ఒమర్ అహంకారం దెబ్బతిన్నది. పైగా అంత అద్భుతమైన గుర్రం తన దగ్గరే ఉండాలన్నా పట్టుదలా పెరిగిపోయింది. దాంతో- మోసం చేసైనా సరే ఆ గుర్రాన్ని చేజిక్కించుకోవాలని ఒమర్‌ పథకం వేశాడు. ఒక బిచ్చగాడి వేషం వేసుకుని వర్తకుడు వెళ్లే దారిలో పడుకున్నాడు. ఒమర్‌ కాసేపు ఎదురుచూసిన తరువాత అటుగా వర్తకుడు రానే వచ్చాడు. బిచ్చగాడి వేషంలో ఉన్న ఒమర్‌ని చూసి జాలిపడ్డాడు. తన గుర్రం మీద నుంచి దిగివచ్చి అతని చేతిలో కాసిని దీనార్లు ఉంచాడు. తన సంచిలో ఉన్న రొట్టె ముక్కలని అందించాడు. ఇంత చేసినా అతని తృప్తి తీరలేదు ‘నీ కోసం నేను ఏమన్నా చేయగలనా!’ అని అడిగాడు. ‘దయచేసి నన్ను మీ గుర్రం మీద ఎక్కించుకుని మీతో పాటు పట్నానికి తీసుకుపోగలరా! అక్కడ నేను ఏమన్నా జీవనోపాధి చూసుకుంటాను,’ అని అర్థించాడు బిచ్చగాడి వేషంలో ఉన్న ఒమర్‌.

 

ఒమర్‌ మాటలకు వర్తకుడు కరిగిపోయాడు. వెంటనే తనతో పాటుగా పట్నానికి తీసుకువెళ్లేందుకు సిద్ధపడ్డాడు. అందుకోసం బిచ్చగాడిని ముందుగా తన గుర్రం మీదకు ఎక్కించాడు. ఒమర్‌కు కావల్సింది అదే! గుర్రం మీదకు ఎక్కిన వెంటనే దాని జీనుని అందుకుని ఒక్కసారిగా దౌడు తీయించాడు. జరిగిన దానికి వర్తకుడు ఒక్కసారిగా మ్రాన్పడిపోయాడు. అయినా వెంటనే తేరుకుని... ‘గుర్రాన్ని తీసుకుపోతే పోయావు! కానీ ఒక్కమాట విని వెళ్లు!’ అని అరిచాడు. వర్తకుడు ఏం చెబుతాడా అని ఆసక్తిగా ఆగాడు ఒమర్. ‘నువ్వు నా గుర్రాన్ని ఇలా చేజిక్కించుకున్న విషయాన్ని దయచేసి ఎవరితోనూ చెప్పవద్దు,’ అన్నాడు కళ్లనీరు పెట్టుకుంటూ వర్తకుడు.

 

‘ఏం నీ పరువు పోతుందా!’ చిద్విలాసంగా అడిగాడు ఒమర్.

‘అహా పరువు గురించి కాదు. ఈ విషయం కనుక నలుగురికీ తెలిస్తే... ఇక మీదట ఎవ్వరూ దారి పక్కన పడి ఉన్న పేదవాడికి సాయం చేసేందుకు ఆగరు. మానవత్వం మీద పేదల మీద జనానికి నమ్మకమే పోతుంది,’ అన్నాడు వర్తకుడు.

వర్తకుడి మాటలకి ఏం సమాధానం చెప్పాలో ఒమర్‌కు పాలుపోలేదు. వెంటనే గుర్రం దిగి అక్కడి నుంచి వడివడిగా నడిచి వెళ్లిపోయాడు.

(ప్రచారంలో ఉన్న కథ ఆధారంగా)

 

- నిర్జర.

By
en-us Political News

  
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.