సంస్కారమే ముఖ్యమని తేల్చిన పరిశోధన

Publish Date:Jun 6, 2019

Advertisement


కాలం మారిపోయింది. జీవితం ఉరుకులపరుగుల వేగంతో నడిచిపోతోంది. ఇలాంటి పోటీ ప్రపంచంలో తన పిల్లవాడు ఎక్కడ వెనబడిపోతాడో అని తల్లిదండ్రులు కంగారుపడటం సహజమే! కానీ పిల్లవాడిని ఎలాగైనే పరుగులెత్తించాలనే తపనతో అతడి మీద తమ ఆశలని అద్ది... తమవైన లక్ష్యాలను నిర్దేశిస్తే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది! మొదటికే మోసం వస్తుందని తేలుస్తోంది ఓ పరిశోధన.

 

చదువా- సంస్కారమా!

అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన కొందరు పరిశోధకులు ఆరోతరగతి చదువుకుంటున్న ఓ 506 మంది పిల్లల ముందు ఓ ప్రశ్నని ఉంచారు. మీ తల్లిదండ్రులు మీ నుంచి ఏం ఆశిస్తుంటారు? అన్నదే ఆ ప్రశ్న. ఇందుకోసం వారు ఒక ఆరు అంశాలతో కూడిన ఓ జాబితాను రూపొందించారు. ఈ జాబితాలో మంచి మార్కులు సాధించడం, ఆటపాటల్లో ముందుండటంలాంటి వ్యక్తిగత విజయాలకి సంబంధించిన ఓ మూడు అంశాలు ఉంటే... ఇతరులకి సాయపడటం, మర్యాదగా ప్రవర్తించడం వంటి వ్యక్తిత్వపరమైన అంశాలు ఓ మూడు ఉన్నాయి. అంటే తల్లిదండ్రులు తమ పిల్లవాడు వ్యక్తిగత విజయాలను సాధించాలని అనుకుంటున్నారా? లేకపోతే వారు మంచి వ్యక్తిత్వాన్ని రూపొందించుకోవాలని అనుకుంటున్నారా? అని తేల్చేందుకు ఈ జాబితాను రూపొందించారన్నమాట.

 

సంస్కారవంతులదే విజయం

తమ తల్లిదండ్రుల అభీష్టానికి అనుగుణంగా వ్యక్తిగత విజయాలు సాధించాలనుకునేవారు అనేకరకాల మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తేలింది. ఆందోళన, ఉద్వేగం, క్రుంగుబాటు వంటి సమస్యలతో వీరు సతమతమవడాన్ని గమనించారు. పైగా వీరి ప్రవర్తన గురించి కూడా ఉపాధ్యాయులకు తరచూ ఫిర్యాదులు వస్తున్నాయని తేలింది. అన్నింటికంటే చిత్రమైన విషయం ఏమిటంటే చదువులో కూడా వీరు వెనకబడుతున్నారని బయటపడింది. ఇందుకు పూర్తి విరుద్ధంగా సంస్కారానికి అధిక ప్రాధాన్యతని ఇచ్చిన కుటుంబాలలోని పిల్లలు... ఇటు చదువులోనూ, అటు ప్రవర్తనలోనూ అందరికంటే ఓ అడుగు ముందున్నారట!

 

విలువలే ముఖ్యం

ర్యాంకులు, బహుమతులు వంటి బాహ్యమైన విషయాలతో తనని తాను కొలిచి చూసుకునే పిల్లవాడికి తన మీద తనకు నమ్మకం కలగదు. వ్యక్తిగత విజయాలు సాధిస్తేనే తనకు విలువ అన్న అభిప్రాయం అతని మనసు మీద తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా అటు చదువులోనూ రాణించలేకపోతాడు, ఇటు తనదైన వ్యక్తిత్వాన్నీ రూపొందించుకోలేకపోతాడు. అన్నింటికీ మించి జీవితాన్ని ఆస్వాదించలేకపోతాడు.

 

అలాగని పిల్లల్ని వాళ్ల మానానా వాళ్లని వదిలేయమనో, నిరంతరం నీతిబోధలు చేస్తూ ఉండమనో పరిశోధకులు ఉద్దేశం కాదట! అటు చక్కగా చదువుకోమని ప్రోత్సహిస్తూనే, ఇటు వారిలో మంచి విలువలని కూడా పెంపొందించే ప్రయత్నం చేయాలంటున్నారు. ఇటు వ్యక్తిగత విజయాలకీ, అటు వ్యక్తిత్వానికీ సరసమానంగా ప్రాధాన్యతని ఇవ్వమని సూచిస్తున్నారు.

 

- నిర్జర.

By
en-us Political News

  
కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉంటారు. జీవితంలో ఎదురయ్యే ఎన్నో సమస్యలకు, కష్టాలకు తగ్గట్టు మనుషులు సర్దుబాటు చేసుకుంటూ తమను తాము మార్చుకుంటూ ముందుకు వెళతారు.
నార్సిసిస్టులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. బయటకు మేధావులలా కనిపిస్తుంటారు. వారు తమ మాటలతో ఇతరులు తప్పు అని నిరూపిస్తుంటారు. వాటికి తగిన కారణాలను కూడా చెబుతూ ఉంటారు.
భార్యాభర్తల బంధం చాలా అపురూపమైనది.  జీవితాంతం కలిసి ఉండాల్సిన బంధం అది. కానీ నేటికాలంలో ఈ బంధం పలుచబడిపోతోంది. చాలామంది పెళ్లిళ్లు ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నారో.. అంత త్వరగా విడిపోతున్నారు...
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది...
కొత్త అనే పదంలోనే బోలెడంత ఆశ ఉంటుంది.  ప్రతి ఒక్కరూ తమకు కొత్త అనే పదం నుండి ఎంతో గొప్ప మేలు జరుగుతుందని అనుకుంటారు.  అలా జరగాలని కూడా కోరుకుంటారు.  అందుకే రేపు అనే రోజు మీద కూడా చాలా ఆశ ఉంటుంది అందరికీ...
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.