పోలీసులు అడ్డుకున్నారంటూ రోడ్డుపైన బైఠాయింపు.. భూమన ఇంటి వద్ద హైడ్రామా

Publish Date:Apr 17, 2025

Advertisement

తిరుపతిలోని ఎస్పీ  గో  శాలలో గడిచిన మూడు నెలల్లో 100  గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో తిరుపతిలో గురువారం (ఏప్రిల్ 17) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరుణాకరరెడ్డి ఆరోపణలు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. అలాగే టీటీడీ  ఈవో శ్యామల రావు, కూటమి నాయకులు కూడా ఖండించారు. గడిచిన కొద్ది  రోజులుగా ఈ వివాదం కొనసాగుతున్నది. అనవసర ఆరోపణలు చేయడం భావ్యం కాదని కూటమి ఎమ్మెల్యే లు, ఎంపీలు, నాయకులు చెబుతున్నారు.  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సైతం గోశాలను సందర్శించి వివాదం కారణమైన భూమన ఆరోపణల్లో నిజం లేదని,  గోవులు సహజంగా మరణిస్తే దానికి రాజకీయం రంగు పులమడం సరైంది కాదని సూచించారు.  

ఈ నేపథ్యంలోనే గోశాల ఆరోపణల పై తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు ఎక్స్ వేదికగా జగన్ కు, టీటీడీ మాజీ  చైర్మన్ భూమన కు గోశాలకు రావాలని సవాల్ విసిరారు. ఆ సవాల్ ను స్వీకరించిన   భూమన కరుణాకర్ రెడ్డి ఎ  గురువారం ఉదయం 10 గంటలకు వస్తానని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.  మరో వైపు కూటమి నాయకులు సైతం గోశాలకు రావాలంటూ ర్యాలీ చేపడుతున్నట్లు ప్రకటించారు.శాంతిభద్రతల నేపథ్యంలో పోలీసులు ర్యాలీ లు, నిరసనలు లేకుండా గోశాల పరిశీలన చేసి మీడియా తో మాట్లాడవచ్చని ఆదేశాలు జారీ చేశారు. 

 ఈ నేపథ్యంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద గురువారం (ఏప్రిల్ 17) ఉదయం నుంచి హై డ్రామా కొనసాగింది. పోలీసులు హౌస్ అరెస్టు లు చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. వైసీపీ వారిని బయటకు పంపకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని విమర్శలు గుప్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు, కూటమి ఇన్ చార్జిలు ఉదయం గోశాల వద్దకు చేరుకున్నారు.     మరో వైపు భూమన, ఎంపీ, మాజీ ఎమ్మెల్యే లు అనుచరులు, కార్యకర్తలు దాదాపు రెండు వేల మందితో గోశాలకు బయలు దేరారు. దీంతో పోలీసులు అంత మందితో గోశాల వద్దకు వెళ్లడం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందనీ, పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తామని అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగి రోడ్డుపైనే బైఠాయించారు.  కొంత సమయానికి కారు ఎక్కి వెళ్తామని చెప్పిన తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. అప్పటి వరకు గోశాలలో ఎదురు చూసిన ఎమ్మెల్యే పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కి ఫోన్ చేసి తాము ఎదురుచూస్తున్నానీ, ఎస్కార్ట్ ఇస్తాము గోశాలకు రావాలనీ కోరారు. వస్తానని భూమన సమాచారం ఇచ్చారు.

ఇది జరిగిన కొంత సమయానికి గోశాల వద్దకు తిరుపతి ఎంపీ గురుమూర్తి, భూమన కుమారుడు అభినయ్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ పోలీసులు అభినయ్ రెడ్డి ని లోనికి అనుమతించలేదు.. ఎంపీ ను పోలీసులు దగ్గర ఉండి లోపలికి తీసుకురాగా.. అక్కడ ఎదురు చూస్తున్న కూటమి ఎమ్మెల్యే లు ఎంపీని ప్రశ్నించారు. సవాల్ విసిరిన వ్యక్తి రాకుండా మీరెందుకు వచ్చారని వచ్చారని ప్రశ్నించారు. తాను గోడ దూకి వచ్చాను.. పోలీసులు లోపలికి అనుమతించలేదని ఎంపీ సమాధానం ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే లు మాట్లాడుతూ మీరు వచ్చిన విధంగానే ఆయనా వచ్చిండచ్చు కదా అంటూ ప్రశ్నించారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఎంపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇలా ఉండగా గోశాల బయట భూమన కుమారుడు అభినయ్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకుంటున్నా గోశాలలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు భూమన అభినయ్ రెడ్డిని అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.  ఈ సందర్భంగా భూమన తెలుగుదేశంపై విమర్శలు గుప్పించారు. వారు సవాల్ చేయడంతోనే గోశాల వద్దకు వచ్చాననీ, సవాల్ చేసిన వాళ్లు గోశాలలో కూర్చుని తమను లోనికి రానీయకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారనీ విమర్శలు చేశారు.  

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.