Publish Date:Feb 29, 2020
ప్రకాశం జిల్లాలో రోజువారీ కూలీ పని చేసుకునే తిరుపాల్ కు ఏడుగురు కూతుళ్లు, ఓ కొడుకు. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకుని ఎలాగైనా బాగా చదివించాలన్నతపన. రాత్రీ పగలూ కష్టపడ్డాడు. తండ్రి కష్టం చూడలేక పి.హెచ్.డి వరకూ చదువుకున్న కొడుకును రోడ్డు ప్రమాదం రూపంలో విధి తీసుకెళ్లిపోయింది. ఏకైక కుమారుడి మరణం తట్టుకోలేక మూడునెలలకే ప్రాణాలు తల్లి కూడా చనిపోయింది. తాజాగా పీహెచ్ డీలో అతడు చూపిన ప్రతిభకు యూనివర్శిటీ ప్రకటించిన ఐదు గోల్డ్ మెడల్స్ ను అందుకునేందుకు వచ్చిన తండ్రి... శుక్రవారం గుంటూరు జిల్లా నాగార్జున వర్శిటీలో కనిపించిన హృదయవిదారక దృశ్యమిది...
ప్రకాశం జిల్లా మార్కాపురం బాపూజీ కాలనీకి చెందిన తిరుపాల్ నిరుపేద. రోజువారీ కూలీనాలీ చేసుకుంటూ రాత్రి కూడా పూలు అమ్మకుంటూ బతికే తిరుపాల్ కు ఏడుగురు కూతుళ్లు, ఓ కొడుకు. కొడుకు పేరు చెన్నకేశవులు. కూతుళ్ల పరిస్ధితి ఎలా ఉన్నా కొడుకు చెన్నకేశవులను మాత్రం ఎలాగైనా కష్టపడి బాగా చదివించాలన్న తపన ఆ కుటుంబానిది. రోజంతా కూలిపని, రాత్రిళ్లు పూలమ్ముకుంటూ సంపాదించిన డబ్బులతో తిరుపాల్ తన కొడుకును చదివించారు. బాగా చదువుకుని అక్కాచెల్లెళ్లను బాగా చూసుకోవాలనేది అతడి తపన. దీంతో మార్కాపురంలోనే డిగ్రీ వరకూ విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న చెన్నకేశవులు పీజీ కోసం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అడుగుపెట్టాడు. నాలుగేళ్లుగా రాజనీతి శాస్త్రం, ప్రజాసంబంధాల విభాగంలో పీజీతో పాటు పీహెచ్డీ కూడా చేస్తున్న చెన్నకేశవులను విధి వెంటాడింది. గతేడాది ఆగస్టులో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో చెన్నకేశవులు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆ కుటుంబం అతనిపై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి.
కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి లక్ష్మమ్మ కూడా మూడు నెలల తర్వాత కన్నుమూసింది. దీంతో ఓ వైపు కొడుకును, మరోవైపు భార్యను పోగొట్టుకుని జీవచ్ఛవంగా బతుకుతున్న తిరుపాల్ కు తాజాగా నాగార్జున యూనివర్సిటీ నుంచి ఓ కబురు అందింది. కొడుకు చెన్నకేశవులు యూనివర్శిటీ పరీక్షల్లో ఐదు గోల్డ్ మెడల్స్ సాధించాడని, వాటిని అందుకోవడానికి యూనివర్సిటీకి రావాలనేది దాని సారాంశం. ఈ వార్త వినగానే తిరుపాల్ కుప్పకూలిపోయాడు. చివరికి ఎలాగోలా కుటుంబం సాయంతో శుక్రవారం యూనివర్శిటీకి వెళ్లిన తిరుపాల్ కన్నీటి మధ్యే తన కుమారుడి తరపున ఐదు గోల్డ్ మెడల్స్ ను అందుకున్నాడు. తాత్కాలిక వీసీ రాజశేఖర్ చేతులో మీదుగా తండ్రి తిరుపాల్ వీటిని స్వీకరించాడు..ఈ హృదయవిదారక దృశ్యం యూనివర్శిటీ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చిన వారందరికీ కన్నీళ్లు పెట్టించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/heart-touching-incident-in-acharya-nagarjuna-university-25-94912.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.