ఈ స్వేచ్ఛకు మూలం ఇదే!

Publish Date:Jan 26, 2023

Advertisement

దేశం యావత్తూ భారతదేశానికి వచ్చిన స్వాతంత్య్రం గురించి గొప్పగా పొంగిపోతుంది. స్వాతంత్య్రం సిద్దించినప్పుడు దేశాన్ని నడిపిస్తున్న నాయకుల వల్లనే దేశ స్వాతంత్య్రం సాధ్యమయ్యిందని నినదిస్తుంది. స్వాతంత్య్రం నుండి గణతంత్ర్యం వరకు ఇదే తీరు పెఅతి చోటా కనిపిస్తుంది. కానీ భారతదేశ స్వేచ్చా పోరాటాలు ముందుకు సాగడానికి ప్రాణాలను ఎంతో సునాయాసంగా చేతుల్లో నుండి జారవిడిచిన వీరుల ప్రేరణా ఫలితమే ఈ స్వాతంత్ర్య భారతం. అటువంటి వారిలో భగత్ సింగ్ మొదటి వరుసలో ఉంటారు. అతిచిన్న వయసులో దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ చివరి క్షణాల గురించి వింటే ప్రతి భారతీయ యువత గుండె ఉప్పొంగుతుంది. భారతీయులలో ఉత్తేసిజం కలుగుతుంది. 


 భారత స్వాతంత్ర్య విప్లవజ్యోతి సర్దార్ భగత్ సింగ్ కు ఉరిశిక్ష పడుతుందని ముందే తెలుసు. అందుకే తనతోపాటు శిక్ష పడుతున్న తన స్నేహితులు రాజగురు దత్తులకు, లియోనాయిడ్ ఆండ్రీన్ రాసిన  'సెవెన్ దట్ వర్ హ్యాంగ్' అనే  నవలను చదివి వినిపిస్తూ ఉండేవాడు. ఆ నవలలో ఒక పాత్రకు ఉరిశిక్ష పడుతుంది. అయితే ఆ పాత్ర “నన్ను ఉరి తీయకండి”, “నన్ను ఉరితీయకండి" అంటూ ఉంటుంది. చివరకు ఉరి తీయడానికి ఉరి కంబం వద్దకు తీసుకువెళ్ళేటప్పుడు కూడా “నన్ను ఉరి తీయకూడదు" అంటూనే ఉంటుంది.


భగత్ సింగ్ ఆ ఘట్టం వర్ణించేప్పుడు అతని కళ్ళు వర్షించేవి. అది చూసిన సదరు స్నేహితులు మృత్యువంటే రమ్మని సవాల్ చేసే తమ కామ్రేడ్, మరణభయంతో వణికే ఒక నవలా పాత్ర కోసం కన్నీరు కార్చే దృశ్యం చూసి ఆశ్చర్యపడ్డారు. 1931 మార్చి 23వ తేదీన భగత్ సింగ్ కు  ఉరిశిక్ష అమలు జరుపుతున్నా సమయంలో భగత్ సింగ్ ఉరి కంబం దగ్గరకు వెళ్ళాడు. అక్కడే ఉన్న మేజిస్ట్రేట్ తో..


"మేజిస్ట్రేట్ సాబ్! మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. ఒక భారతీయ విప్లవకారుడు, తన మహత్తర లక్ష్యసాధన కోసం నవ్వుతూ ప్రాణాలర్పించడానికి ఉరి కంబం ఎలా ఎక్కుతాడో చూసే అవకాశం మీకు దొరికింది” అని చెప్పి చిరునవ్వుతో ఉరి కంబపు ఉరి తాడు మెడకు తగిలించుకున్నాడు.


 "నా జీవనజ్యోతి ఉదయపు వెలుగులా ఆరిపోయినా, మా ఆదర్శం, మా భావాలు విద్యుల్లతల్లా ప్రపంచాన్నంతా జాగృతం చేస్తాయి. నా పిడికెడు బూడిద నశించిపోతే ప్రపంచానికి నష్టమేమిటి?” అన్నాడు.


కేవలం ఇది మాత్రమే కాదు. భగత్ సింగ్ కు ఉరిశిక్ష అని తెలిసిన తరువాత ఆయన తాంత్రి తన కొడుకును ఆ శిక్ష నుండి తప్పించాలని ఎంతగానో ప్రయత్నం చేసాడు. అప్పుడు భగత్ సింగ్ తన తండ్రి కోసం ఒక ఉత్తరం రాసాడు. ఆ ఉత్తరాన్ని చదివితే ప్రతి భారతీయుడు దేశానికి ఎంతో గౌరవం ఇస్తాడు. ఆ ఉత్తరం ఇలా సాగుతుంది...


పూజ్యులైన తండ్రిగారికి,


నన్ను ఉరికంబం నుంచి తప్పించేందుకు కన్నతండ్రిగా మీరు పడుతున్న తపనకు కొడుకుగా సంతోషపడతానేమో, కానీ ఈ దేశపౌరుడిగా మాత్రం సిగ్గుపడుతున్నాను. మీ కొడుకునైనందుకు మీ ఆశల్ని, ఆకాంక్షల్ని గౌరవిస్తాను. కానీ మీ కన్నా ముందు ఈ మాతృభూమి రుణం తీర్చుకునే హక్కు నాకు లేదంటారా? నేను బ్రిటిషర్లపై చేసిన దాడిని నేరంగా భావించటం లేదు. అందుకే నేనెప్పుడూ మీ ముందు నిర్దోషినని నిరూపించుకునేందుకు, కోర్టులో వాదించేందుకు అంగీకరించలేదు. నాన్నా... నా జీవితం మనదేశం కన్నా విలువైందేమీ కాదు. కేవలం నా జీవితమే కాదు ప్రతి యువకుడి జీవితం కూడా ఇలా మాతృభూమికే సమర్పణం చేయాలని నమ్ముతాను. అందుకు ఎన్ని ప్రతిఘటనలనైనా ఎదుర్కోవాలి. అలాంటి ప్రగతి కోసం నిలబడే ఏ వ్యక్తి అయినా కాలం తీరిన పాత విశ్వాసాల్ని సవాలు చేయాలి. నాకు తెలుసు నా మెడకు ఉరితాడు బిగించడమే జీవితంలో ఆఖరిక్షణం అవుతుంది. అయినా ఒక లక్ష్యం కోసం పోరాడిన జీవితానికి అలాంటి ముగింపు గర్వకారణమే కాని దయనీయం కాదు. ఎలాంటి స్వార్ధం లేకుండా, ఎలాంటి పారితోషికం ఆశించకుండా నా జీవితాన్ని దేశస్వాతంత్య్రం కోసం అర్పించాననే సంతృప్తితో, చిరునవ్వుతో మృత్యువును ఆహ్వానిస్తున్నాను. మానవాళికి సేవచేయటానికి, పీడితులకు విముక్తిని కల్పించటానికి యువతరం ముందుకొచ్చినప్పుడే నవయుగానికి నాంది సాధ్యమవుతుంది.  నాన్నా... నా మరణం తరువాత  ముందు తరాలకు త్యాగమనే సుగుణం తీగలా వ్యాపించేలా చూడండి. ఎలాంటి పరీక్షాసమయంలోనైనా మహత్తరమైన మానసిక దృఢత్వాన్ని సడలనీకుండా చూసుకొమ్మని ప్రోత్సహించండి... ఇక సెలవు…


                        ఇట్లు

               మీ ప్రియ పుత్రుడు

                  భగత్ సింగ్.


ఓసారి ఇలాంటి విప్లవ వీరుల మాటలు, వారి అంతరంగం విన్నా, వారి నాటి స్థితిగతులు తెలుసుకున్నా దేశానికి తగిన మార్గం ఈ భారతీయ పౌరులకే అర్థమవుతుంది.


                                   ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
మత విశ్వాసాల ప్రకారం యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించారు. క్రైస్తవ మతంలో యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా భావిస్తారు. ఆయన ప్రపంచానికి ప్రేమ, క్షమ, సేవ, త్యాగం యొక్క మార్గాన్ని చూపించాడు. బైబిల్ ప్రకారం ఆయన బెత్లెహెంలో జన్మించాడు.
ప్రపంచంలోని దేశాలన్నీ జరుపుకునే వేడుకలలో క్రిస్మస్ కూడా ఒకటి.  భారతదేశంలో కంటే విదేశాలలోనే క్రిస్మస్ వేడుకలు మరింత గొప్పగా, వైభంగా,  సాంప్రదాయంగా జరుగుతాయి.  అయితే ఈ వేడుకలు కూడా..
తెలివి లేని వెధవ.. ఇలా ఎవరైనా అంటే వెంటనే కోపం వస్తుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫీలవుతారు. మరీ ముఖ్యంగా తాము తెలివైన వాళ్లం అని నిరూపించడానికి ఏదో ఒకటి చేస్తారు.  సమయం సందర్భం...
గణితం ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. చిన్న పిల్లల నుండి చదువు రాని వారి వరకు ప్రతి ఒక్కరు రోజువారి జీవితంలో గణితాన్ని ఉపయోగిస్తూనే ఉంటారు. కానీ పెద్దవుతున్న కొద్ది చాలామందిలో గణితం అనేది ఒక భయం కింద నాటుకుపోతుంది. కానీ గణితంతో గమ్మత్తులు చేసి ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టిన గణిత మేథావి, శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్. శ్రీనివాస రామానుజ్ డిసెంబర్ 22వ తేదీన జన్మించారు. ఈ సందర్బంగానే ప్రతి సంవత్సరం డిసెంబర్ 22వ తేదీని జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని గురించి తెలుసుకుంటే....
ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే.  ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది...
పెళ్లయ్యాక భార్యభర్తల మద్య గొడవలు అనేవి చాలా సహజం.  చాలా మంది భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు ఇంటి గొడవలు అని చెబుతారు. అవి ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే గొడవలే అయినా,  ఇంటికి, కుటుంబానికి సంబంధించినవి అయినా టోటల్ గా ప్రతి భార్యభర్త జంట..
నేటి కాలంలో అమ్మాయిలు అబ్బాయిలతో సహా అన్ని రంగాలలో రాణిస్తున్నారు.  అన్ని పనులు చేయగలుగుతున్నారు. కొన్ని సందర్బాలలో అబ్బాయిల కంటే ధైర్యాన్ని చూపగలుగుతున్నారు. అయినా సరే అమ్మాయిల విషయంలో సమాజం నుండి ఇంటి వరకు ప్రతి చోట ఒక చిన్నతనం కనిపిస్తుంది....
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు.
తల్లిదండ్రులను, తోడబుట్టిన వారిని ఎవరూ ఎంచుకోలేరు.  అవి దేవుడు ఇచ్చే బందాలు.  కానీ ప్రతి వ్యక్తి స్నేహితులను ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మంచి స్నేహితులు ఉన్న వారి జీవితం చాలా బాగుంటుంది. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులు...
ప్రతి మనిషి వేర్వేరు వ్యక్తిత్వం కలిగి ఉంటాడు.  ఒకే ఇంట్లో, ఒకే తల్లి కడుపున పుట్టిన వ్యక్తులే వేర్వేరు స్వభావాలను కలిగి ఉన్నప్పుడు బయటి వ్యక్తుల స్వభావం ఒకే విదంగా ఉండటం అనేది జరగదు.  అయితే బయట కొందరిని చూస్తే వీళ్లు అచ్చు మనలాగే ఉన్నారే...
ప్రేమ,  భార్యాభర్తల బంధం,  సహజీవనం.. ఏదైనా సరే.. మనసులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది కీ పాయింట్ గా ఉంటుంది. నేటికాలంలో బంధాలు చాలా పెళుసుగా మారాయి.  చాలా తొందరగా బ్రేకప్ లు  జరుగుతున్నాయి...
పెళ్లి ప్రపంచంలో ప్రజలందరూ సాగించే ఒక పవిత్రమైన  బంధం. భారతీయులు పెళ్లికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.  సాధారణంగా వయసు రాగానే పెళ్లి వయసు వచ్చింది అని అంటుంటారు.  దానికి తగ్గట్టే పెళ్ళిళ్లు చేస్తుంటారు....
గొడవలు లేని భార్యాభర్తల బంధం అంటూ ఉండదు. వాస్తవానికి భార్యాభర్తల మధ్య  జరిగే గొడవలు చాలా వరకు వారి బంధాన్ని మరింత బలంగా మార్చడంలో సహాయపడతాయి.  భార్యాభర్తల మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు  ఒకరి మీద ఒకరికి ఉండే ప్రేమను స్పష్టం చేస్తాయి...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.