రాను రాను మనిషిలో సహనం పోతోందా లేక ఆగ్రహం రాజ్యం చేస్తోందా అన్నది తేల్చుకోలేని కాలంలో ఉన్నాం. చిన్న చిన్న విషయాలకీ కోపతాపాలు ప్రదర్శి స్తున్నారు. చిన్నపాటి అవగా హనాలోపానికి బీపీలు పెంచు కుని ప్రాణాలు తీసుకోవడమో, తీయడమో చేస్తున్నారు. మరి చదువు, సంస్కారం, నీతి సూత్రా లు, ప్రవచనాల ప్రయోజనం లేదనుకోవాలా? ఏమోగాని చిన్న విషయంలో ఒక కుర్రాడు అమ్మమ్మను కొట్టి చంపేసేడు! ఆమె వాడిని బాల్యంనుంచి ఎత్తు కుని తిప్పే ఉంటుంది, అమ్మో, నాన్నో కొడితే దూరంగా తీసికెళ్లి ఏ చాక్లెట్తోనో వాడిని ఆనందపరిచి అటూ ఇటూ తిప్పి ఇంటికి తీసుకువచ్చే ఉంటుం ది. జ్వరం వస్తే తిండి మానేసి వాడి మంచం దగ్గరే రెప్పవేయకుండా కూచునే ఉంటుంది. ఇన్నేళ్ల సేవలకు వాడిచ్చిన ప్రేమ పూర్వక బహుమతి మరణం!
బెంగుళూరులో ఓ చిన్నకుటుంబం..శశికళ, సంజయ్, శాంతకుమారి..తల్లి, కొడుకు, అమ్మమ్మ. 2016లో ఓ దుర్ఘటన. సరదా గా ఓ రోజు సంజయ్ బయటినుంచీ మంచూరియా తెచ్చాడు. ఇంట్లో చిరుతిళ్లు బోర్ కొ్ట్టి తెచ్చాడనే అనుకోవాలి. రవ్వం త రుచి చూసి వదిలేసి ఉంటే బాగుండేది. కానీ ఆ పెద్దామె అసలు రుచి చూడకుండానే, బయటినుంచి తెచ్చింది తినడమే మిటని ఆమె ఛాదస్తం అంతా ప్రదర్శించి దాన్ని పారేసింది. అంతే సంజయ్కి కోపం వచ్చింది. మాటా మాటా పెరిగింది. కోపం నషాళా నికి ఎక్కింది. ఆ వెర్రి కోపంలో పెద్దామె తనను చిన్నప్పటినుంచీ ఆడించిన అమ్మమ్మ అనే ప్రేమ కూడా వదిలేసుకుని కర్ర తీసుకుని విచక్షణా రహితంగా కొట్టాడు. శాంతకుమారి తన మనవడి వల్ల చనిపోయింది. సంజయ్ మరొక స్నేహితుడితో, తల్లితో కలిసి శాంతకుమారి శవాన్ని సినిమాల్లో చూపించినట్టు గోడపగలగొట్టి అందులో పెట్టి మళ్లీ గోడను కప్పే రంగులు వేయించాడు. బీరువాలో పుస్తకం దాచి తీరిగ్గా ఆ సంగతి వదిలేశారు. కొద్దిరోజుల తర్వాత ఆ యిల్లు వదిలి వెళి పోయారు శశికళ, సంజయ్.
ఇంటి యజమాని 2017లో ఆ ఇల్లు అమ్మకానికో, మళ్లీ అద్దెకి ఇవ్వడానికో తాళం తీసి గోడ వ్యవహారం అనుమానించి పగుల గొడితే అలమార్లోంచి బొమ్మలా పెద్దామె శవం కిందపడింది. అంతే అంతా ఖంగారుపడ్డారు. పోలీసులు చాలారోజులు, చాలా ప్రయత్నాలు అయ్యాకగాని సంజయ్ మహానుభావుడు, మహామనవడు దొరకలేదు. ఏందిరా అయ్యా.. అని నాలుగు పీకి అడిగితే.. అసలు సంగతి చెప్పాడు. పోలీసులు, స్టేషన్ సెల్లో ఉన్న ఇతరులు ఆశ్చర్యపోయారు. కోపానికి కళ్లు మూసుకు పోతాయా అని. ఏదో ఆవేశంలో చేశాడు..రిపెంట్ అయ్యాడనుకున్నారంతా.. అదేమీ లేదు. ఏమీ ఎరగనట్టే ఉన్నాడు సంజయ్.. కటకటాల్లో.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/grandmavictim-of-anger-39-145122.html
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.