Publish Date:May 20, 2025
జగన్ హయంలో పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకత్వం ఆకాశమే హద్దన్నట్లుగా సాగింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరడ్డి పెత్తనం ఇష్టారాజ్యంగా సాగింది. అడ్డూ అదుపూ లేకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూ కబ్జాలకు పాల్పడ్డారు. అధికారం అండతో అదికారులను గుప్పిట పెట్టుకుని వింటారని ప్రభుత్వ భూమి... అటవీ భూమి.. ప్రైవేట్ భూములు అన్న తేడా లేకుండా పెద్దిరెడ్డి కబ్జాల పర్వం కొనసాగిందన్న ఆరోపణలు ఉన్నాయి.
గత ఎన్నికలలో వైసీపీ అత్యంత ఘోర పరాజయాన్ని చవి చూసింది. అయితే పుంగనూరులో మాత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చావుతప్పి కన్నులొట్టపోయిన చందాన విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత తన కబ్జాల వ్యవహారం ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్నది. కూటమి సర్కార్ అధికార పగ్గాలు అందుకున్న వెంటనే మదనపల్లి సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ఫైల్స్ దగ్థం కేసులో కూడా పెద్ది రెడ్డి ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
అన్నమయ్య జిల్లా మదనపల్లి శివారులోని బీకే పల్లి సర్వే నెంబర్ 552లో ప్రభుత్వ భూమి మొత్తం 10.05 ఎకరాల భూమిలో కొంత భాగం మాజీ సైనికుడికి కేటాయించారు. ఈ భూమిలో పెద్దిరెడ్డి 1.35 ఎకరాలు భూమి నుంచి కబ్జా చేశారు. 552-7 సర్వే నెంబర్ లో 3.40 ఎకరాలు, 552-8లో 0.50 ఎకరాల భూమి పెద్దిరెడ్డి భార్య స్వర్ణలత మాజీ సైనికుడు కుటుంబం నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందులో బైపాస్ రోడ్డు, ఫ్లై ఓవర్ కు 18 సెంట్లు పోయింది. 552-7 ఆనుకుని ఉన్న 552-1 లోని 1.35 ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నారని రెవెన్యూ అధికారులు తేల్చారు. మదనపల్లి సర్వేయర్ రెడ్డి శేఖర్ రెడ్డి, ఆర్ఐ భరత్ రెడ్డి హద్దులు గీసి ఆక్రమణలు తొలగించి 1.35 ఎకరాలు ప్రభుత్వ భూమి గా తేల్చారు. ఆ భూమిని పెద్దిరెడ్డి అధీనం నుంచి స్వాధీనం చేసుకున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/government-land-under-peddireddy-kabza-seized-25-198319.html
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.