Publish Date:Oct 14, 2022
ప్రొఫెసర్ సాయిబాబాను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని ముంబై హైకోర్టు ఆదేశించింది. తనకు జీవిత ఖైదు విధిస్తూ ట్రయల్ కోర్టు 2017వ సంవత్సరంలో ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జిఎన్ సాయిబాబా దాఖలు చేసిన అప్పీల్ను జస్టిస్ రోహిత్ డియో, అనిల్ పన్సారేలతో కూడిన నాగపూర్ డివిజన్ బెంచ్ అనుమ తించింది. ప్రొఫెసర్ సాయిబాబాతో పాటు మరో అయిదుగురికి ఈ కేసు నుంచి విముక్తి లభించింది. శారీరకంగా వికలాంగుడయి వీల్చైర్కే పరిమితమయిన ఇంగ్లీషు ప్రొఫెసర్ సాయి బాబా 2014 లో అరెస్టయి నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ కేసులో అరెస్టయిన మిగిలినవారిలో మహేష్ తిక్రి, పాండు పోరా నరోత్, హేమ్కేశవ్దత్త మిశ్రా, ప్రశాంత్ రాహి, విజయ్ నానతిక్రి ఉన్నారు. అయితే వారిలో పాండుపోరా నరోత్ ఈ ఏడాది ఆగష్టులో మరణించాడు. మావోయిస్టులతో సంబంధం లేదని తేలడంతో వీరందరిని, వేరే కేసుల్లో ఎలాంటి సంబంధాలు లేకుంటే, వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది.
2017 మార్చిలో మహారాష్ట్ర గడ్చిరోలీ జిల్లా కోర్టు ప్రోఫెసర్ సాయిబాబా తదితరులను మావోయిస్టులతో సంబంధాలున్నాయన్నకేసులో అరెస్టు చేయమని ఆదేశించింది. వారిలో ఒక జర్నలిస్టు, జవహర్లాల్ నెహ్రూ వర్సిటీ విద్యార్ధి కూడా ఉన్నారు. వీరంతా మావోయిస్టులతో కలిసి దేశంలో అల్లర్లు చేయడానికి కుట్రపన్నుతున్నారన్న అభియోగంతో యుఏపిఏ, ఐపిసీ క్రింద అరెస్టయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/gnsaibaba-acqitted-in-maoist-link-case-39-145410.html
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.