Publish Date:Aug 11, 2022
ఎన్నాళ్లో వేచిన ఉదయం.. అంటూ పెద్ద రోడ్డుకి ఇరుపక్కల నుంచి హీరోలు కలుసుకునేందుకు ఏకంగా పాట అందుకుంటారు.. స్నేహబంధమూ.. అంటూ నలుగురయిదుగురు వయసుమళ్లి స్నేహితులూ అంతే ఉత్సాహంగా పాడేసుకుంటారు.. ఇందులో ఎంతో నిజం ఉంది. స్నేహానికి ప్రదేశం, దేశం, ఖండా లతో పరి మితులు విధించలేం. అంతెందుకు రాజకీయాల పరంగా పాకిస్తాన్ను ఛస్తే స్నేహితుడిగా అంగీ కరించలేం. కానీ ఆటల విషయానికి వచ్చేసరికి క్రీడాకారులంతా సరదాగా గడిపేస్తుంటారు. ఒకరిని ఒకరు అభినందించుకోవడం, జోక్స్ వేసుకోవడమూ చూస్తుంటాం.
ఇది అసలు సిసలు ప్రేమ. కాలం మారి నా అలాంటి స్నేహాలు ఉంటాయి. ఇపుడు తాజాగా హార్వర్డ్ వర్సి టీలో ఇద్దరు తమ స్నేహం గురించి తెలియ జేశారు. ఒకరు భారత్కి చెందిన అమ్మాయి, మరొకరు పాకి స్తాన్! వీరిద్దరూ చాలాకాలం తర్వాత కలిసేరు. కానీ అంతే స్నేహపూర్వకంగా, మరెంతో అభిమానంతో మాట్లాడుకున్నారు. తాను ఇన్నాళ్లకు పాక్ స్నేహితురాలిని కలవడం ఎంతో ఆనందంగా ఉందని స్నేహా ప్రకటించింది.
చిత్రమేమంటే ప్రజల్లో ఉన్న అభిమానాన్ని రాజకీయ నాయకులు రాజకీయాలను దూరం పెట్టడానికి ఏమాత్రం ప్రయత్నించడం లేదు. దాడులు, మారణహోమాలు సృష్టించడానికే కంకణం కట్టుకోవడం పాక్ వంతు అయింది.
స్నేహా బిస్వాస్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుతోంది. ఇటీవలే ఆమె కాలేజీ ఆవరణలో ఒకమ్మాయిని చూసి క్షణం నివ్వెరపోయింది. ఎక్కడో కలిసిన మొహంలానే ఉందే అనుకుంది. అంతే ఒక్కసారి గతం సినిమా రీలులా తిరిగింది. రీలు ఆగగానే ఆమె తన పాకిస్తానీ స్నేహితురాలన్నది గుర్తించింది. ఇస్లామా బాద్ అమ్మాయితో ఫస్ట్ సెమిస్టర్ అయ్యేలోగా మరింత సన్నిహితురాలయ్యింది స్నేహా. ఆమె ధైర్యంగా చెప్పే అనేక విషయాలపట్ల స్నేహా ఆకర్షితురాలయింది. మనం అనుకుంటున్న వైరానికి అసలు అక్కడి ప్రజల్లో భారత్పట్ల ఉన్న అభిమానానికి పొంతనే లేదని స్నేహా అభిప్రాయపడటం గమనార్హం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/friendship-39-141750.html
తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. జనసేన పార్టీతో తమకు ఉన్న మిత్రబంధం కేవలం కేంద్ర స్థాయికి , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే పరిమితమని, తెలంగాణలో ఆ పొత్తును పొడిగించే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితుల వేదనను, కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు.
దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తున్న సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్ చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు అంబటి రాంబాబు, పేర్ని నాని మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి.
న్నికల ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరంలో వైసీపీ ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే దాదాపు 199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్రాజ్లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది.
పరామర్శల పేరిట పోలీసుల ఆంక్షలను ఉల్లంఘిస్తూ, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా సాగుతున్న ఆయన పర్యటనల తీరు నేపథ్యంలో జగన్ భద్రత అంశం మరోసారి చర్చకు వచ్చింది. అంతటితో ఆగకుండా, జగన్కు రక్షణ తగ్గించారంటూ వైసీపీ ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వడంతో జగన్ భద్రత అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయోధ్య రామమందిరం పేరిట సేకరించిన విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయనే అంశాన్ని వ్యంగ్యంగా, నాటకీయంగా చూపించేందుకు వారు చేపట్టిన ఈ వినూత్న నిరసన రాజకీయ వివాదానికి దారి తీసింది. రామాలయాన్ని, పూజారి వ్యవస్థను, భక్తుల నమ్మకాలను హేళన చేసేలా ఈ నిరసన ఉందంటూ.. బీహార్లోని జమూయి సివిల్ కోర్టులో ఓ సీనియర్ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
రిజర్వేషన్ల విధానాన్ని అంబేడ్కర్ ఆశయాలు, దృక్పథానికి అనుగుణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్న మోహన్ భగవత్.. విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల విధానం ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. రిజర్వేషన్లు కేవలం రాజకీయ ప్రాతిపదిక కాదనీ సామాజిక అనివార్యత అన్నారు.
గడిచిన దశాబ్ద కాలంలో కేంద్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన బీజేపీ, ప్రస్తుతం కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జగన్ పర్యటనలలో జరిగిన పలు సంఘటనలకు సంబంధించిన వీడియో ఆధారాలను వంగలపూడి అనిత ఈ సందర్భంగా ప్రదర్శించారు. సాధారణంగా ఎవరైనా పరామర్శకు వెళ్తే బాధితులను ఓదార్చడం, వారికి అండగా నిలవడం ఆనవాయితీ అనీ, కానీ జగన్ మాత్రం నిజమైన బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడానికి వెడుతున్నారనీ మండిపడ్డారు.
యూపీలో భారీ వర్షాలు, శాంతిభద్రతల పరిస్థితి, కోర్టు ఆదేశాలు కారణంగా చూపుతూ కాయస్థ పాఠశాల ట్రస్ట్ అనుమతిని ఉపసంహరించుకుంది. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని కాంగ్రెస్ చెబుతోంది. అధికార యంత్రాంగం, బీజేపీ ప్రభుత్వ ఒత్తిడి కారణంగానే రాహుల్ సభకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపిస్తోంది.
కనీసం తనతో సంప్రదించకుండా ఏకపక్షంగా అంబటి రాంబాబు పాదయాత్ర ప్రకటన చేయడంపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో గత్యంతరం లేక అంబటి పాదయాత్ర విరమించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం.