ఏపీ పాఠశాలల విద్యార్థులకు ఉచిత నేత్ర పరీక్షలు.!

Publish Date:Jul 16, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  పాఠశాల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు ఉచితంగా నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించింది. గురువారం (జులై 16) నుంచే ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  ఈ ఉచిత కంటి పరీక్షల స్క్రీనింగ్ ప్రోగ్రామ్ గురువారం (జులై 16) అధికారికంగా ప్రారంభమైంది. విద్యార్థుల్లో కంటి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి, వారికి మెరుగైన దృష్టిని అందించడమే లక్ష్యంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు.

ఈ   పథకం ద్వారా   రాష్ట్రంలోని ప్రభుత్వ,  ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నదాదాపు 43.30 లక్షల మంది విద్యార్థులకు పూర్తి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. వయసు రీత్యా 6 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు ఉన్న పాఠశాల విద్యార్థులందరూ ఈ ఉచిత వైద్య సేవల పరిధిలోకి వస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా శిక్షణ పొందిన వైద్య బృందాలు ఆయా పాఠశాలలకే   వెళ్లి విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించనున్నాయి.

చిన్న వయసులోనే కంటి లోపాలు రావడం వల్ల విద్యార్థుల చదువుపై ఆ ప్రభావం పడకుండా ఉండాలన్న లక్ష్యంతో  ఈ నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.   ఈ   కంటి స్క్రీనింగ్ ప్రక్రియ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.50 లక్షల మంది విద్యార్థులలో వివిధ రకాల దృష్టి లోపాలు లేదా కంటి సమస్యలు బయటపడవచ్చని అధికారులు  అంచనా వేస్తున్నారు. ఇలా పరీక్షల్లో కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించిన విద్యార్థులందరికీ ప్రభుత్వం తరఫున ఉచితంగా ప్రిస్క్రిప్షన్ కళ్లజోళ్లను అందజేయనున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నడుస్తున్న  నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్‌నెస్ అండ్ విజువల్ ఇంపెయిర్‌మెంట్  కింద ఈ   కంటి వైద్య శిబిరాల విధివిధానాలను అమలు చేస్తున్నారు. తరగతి గదుల్లో బోర్డుపై రాసే అక్షరాలు సరిగ్గా కనిపించక ఇబ్బంది పడే విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో ఊరటనివ్వనుంది. ప్రతి పాఠశాలలోనూ పారదర్శకంగా ఈ స్క్రీనింగ్ ప్రక్రియ సాగేలా విద్యా, ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశారు.

తమ పిల్లల కంటి చూపును మెరుగుపరుచుకునేందుకు,  వారి విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసేందుకు తల్లిదండ్రులంతా బాధ్యతగా ఈ కంటి పరీక్షల శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ  కోరుతున్నారు. పాఠశాలల్లో ఏర్పాటు చేసే ఈ క్యాంపులకు పిల్లలు తప్పకుండా హాజరయ్యేలా చూడాలని కోరారు. ఈ సదుపాయం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు కంటి వైద్య ఖర్చులు తప్పడమే కాకుండా నాణ్యమైన చికిత్స అందుతుంది. 

AP Free Eye Checkup, School Students Eye Screening, Andhra Pradesh News, Free Spectacles Distribution, National Programme for Control of Blindness

By
en-us Political News

  
జగన్నాథుడి రథోత్సవంలో విషాదం.. వంద మందికి గాయాలు..!
హైదరాబాద్ మహానగరంలో మాదకద్రవ్యాల కలకలం మరోసారి రేగింది.
హైదరాబాద్‌లోని గోల్కొండ శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్స వాలు గురువారం వైభ వంగా ప్రారంభమయ్యాయి.
ఈ భేటీ కేవలం ఒక అధికారిక పరామర్శకే పరిమితం కాకుండా, అత్యంత ఆత్మీయ వాతావరణంలో సాగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ నివాసంలో ఉన్న ఆయన వ్యక్తిగత గ్రంథాలయాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆసక్తిగా తిలకించారు. అక్కడ ఉన్న వివిధ రకాల పుస్తకాలను పరిశీలించారు.
భాగ్యనగరంలో నిత్యం మెట్రో రైళ్లలో ప్రయాణించే లక్షలాది మంది ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అత్యంత తీపి కబురు అందించింది.
ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజీఐ) విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీ ఎత్తున ఎర్రచందనం స్మగ్లింగ్ యత్నాన్ని భగ్నం చేశారు.
తాజాగా యూఎస్ కరెన్సీపై తన బొమ్మ ముద్రణతో మరో సారి టాక్ ఆప్ ది వరల్డ్ గా మారారు. అమెరికా స్వాతంత్ర్యం 250 వసంతాలు పూర్తి చేసుకుంటున్న చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని.. ప్రెసిడెంట్ ట్రంప్ ముఖచిత్రంతో కూడిన సరికొత్త నాణేన్ని అక్కడి ప్రభుత్వం తీసుకువస్తోంది.
గోల్కొండ జగదాంబికా మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి ప్రభుత్వ పక్షాన మంత్రులు అధికారికంగా తొలి బంగారు బోనం, పట్టువస్త్రాలు సమర్పించడంతో ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసనల్లో భాగంగా వాంగ్‌చుక్ నిరవధిక నిరశన చేపట్టారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందంటూ దాఖలైన ఒక అత్యవసర పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది.
గల్ఫ్ జలాల్లో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి కాలంలో దాడులు విపరీతంగా పెరిగిన సంగతి విదితమే. ముఖ్యంగా మొంబాసా బి, అల్ బహ్యా, జీఎఫ్ఎస్ గెలాక్సీ, ఎంటీ వెద్యాన్, అల్ రెకయ్యాత్ వంటి వాణిజ్య నౌకలపై జరిగిన వరుస దాడులు అంతర్జాతీయ నౌకాయాన రంగాన్ని కుదిపేస్తున్నాయి.
ఆంక్షల ప్రకారం, సాధారణ పౌరులకు గానీ, దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు గానీ కోట ప్రాంగణంలోకి ప్రవేశం ఉండదు. కేవలం ఈ వేడుకల ఏర్పాట్లలో పాల్గొనే ఉన్నతాధికారులు, సిబ్బంది,  అధికారిక అనుమతి పత్రాలు ఉన్న  వ్యక్తులను మాత్రమే కఠిన తనిఖీల అనంతరం లోపలికి అనుమతిస్తున్నారు.
పాకిస్తాన్ సైనిక బలగాలు తమ ప్రాంతాన్ని చట్టవిరుద్ధంగా, అక్రమంగా ఆక్రమించుకున్నాయని అమ్జాద్ అయూబ్ మీర్జా ప్రకటించారు. ఈ ప్రాంతం ఎంతమాత్రం స్వతంత్రమైనది కాదని, పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడి ప్రజలను బానిసలుగా చూస్తోందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
విద్యా రంగానికి సంబంధించి మొత్తం ఐదు పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో మూడు సాధారణ డే స్కూళ్లు కాగా, మిగిలిన రెండు పూర్తి స్థాయి వసతులతో కూడిన రెసిడెన్షియల్ పాఠశాలలు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.