పాలలో కలిపి ఈ ఆహారాలు తీసుకుంటే విషంతో సమానం..

Publish Date:Dec 9, 2023

Advertisement

ఆహారమే ఆరోగ్యం. మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచి ప్రమాదకరమైన జబ్బులను సైతం తట్టుకునేలా చేస్తుంది. కానీ ఆరోగ్యం అనుకుంటూనే చాలామంది ఆహారం విషయంలో తప్పులు చేస్తారు. ఈ తప్పులు కాస్తా పెద్ద ముప్పులకు దారితీస్తాయి. చాలామంది సాధారణమేలే అనుకుంటూనే పాలతో కొన్ని పదార్థాలు మిక్స్ చేయడం లేదా పాలతో పాటు తినడం చేస్తుంటారు. అవి పాలతో పాటు తీసుకోగానే విషంతో సమానమైన నష్టాన్ని శరీరానికి కలిగిస్తాయి. ఆయుర్వేదం ఈ విషయాన్ని తెలిపింది కూడా.  ఈ ఆహారాలు కొన్ని అప్పటికప్పుడు వాటి ప్రభావం చూపకపోయినా అవి స్లో పాయిజన్ లా శరీరాన్ని, శరీరంలో అవయవాలను నిర్వీర్యం చేస్తాయి. పాలతో తినకూడని ఆ  ఆహారాలేంటో తెలుసుకుంటే..

పాలు.. చేపలు..

పాలు, చేపలు కలిపి వండటం, పాల ఉత్పత్తులైన పనీర్, పెరుగు, చీజ్ వంటి వాటితో కలిపి చేప వంటకాలను తయారుచేయడం అస్సలు చేయకండి. చేపలు, పాలు, పాల ఉత్పత్తులతో కలిస్తే ఆహారం విషపూరితం అవుతుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ కు దారితీస్తుంది. జీర్ణాశయాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది. మరీ ముఖ్యంగా ఈ కాంబినేషన్ తింటే చర్మ సంబంధ సమస్యలు వస్తాయి.


పాలు.. పుల్లని పండ్లు..

పుల్లని పండ్లను సిట్రస్ పండ్లు అని కూడా అంటారు. సిట్రస్ పండ్లలో విటమిన్-సి ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా పాలలో కాసింత నిమ్మరసం పడితే పాలు విరిగిపోవడం గమనించే ఉంటారు. అలాగే పనీర్ తయారీకి చాలామంది పాలలో నిమ్మరసం పోసి తయారుచేస్తుంటారు. అయితే పనీర్ ను మళ్లీ వేయించడం లేదా ఉడికించడం చేస్తారు కాబ్టటి అది తిన్నా పర్వాలేదు. కానీ పాలు-సిట్రస్ పండ్ల కాంబినేషన్ చాలా ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది. కడుపులో  గందరగోళం ఏర్పరుస్తుంది. జీర్ణాశయాన్ని దెబ్బతీస్తుంది.

పాలు.. బ్రెడ్డు..

చాలామంది ఇష్టంగా తినే కాంబినేషన్ ఇది. ఉదయాన్నే కొందరు దీన్ని అలవాటుగా తింటే.. ఆరోగ్యం బాలేనప్పుడు పాలు-బ్రెడ్డు తింటుంటారు. అయితే బ్రెడ్డులో కూడా ఈస్ట్ బ్రెడ్డును పాలతో తినడం మంచిది కాదు. ఇది కడుపులో అసౌర్యం కలిగిస్తుంది. జీర్ణాశయాన్ని బలహీనంగా మారుస్తుంది. జీర్ణాశయ గోడలను మెల్లగా శిథిలం చేస్తుంది.

పాలు.. అరటిపండ్లు..

పాలు, అరటిపండ్లు చాలా మందికి ఇష్టమైన కాంబో. గ్లాసుడు పాలు, ఓ అరటిపండు తింటే దాదాపు రెండు గంటల సేపు ఆకలి అనే మాట మాట్లాడరు. ఈ కాంబినేషన్ వల్ల పుడ్ పాయిజనింగ్ వంటి ప్రమాదాలు ఏర్పడకపోయినా గొంతులో కఫానికి దారితీస్తుంది. ఇది శ్వాస సంబంధ సమస్యలకు, రోజంతా చికాకుగా ఉండటానికి కారణం అవుతుంది.

పాలు.. పుచ్చకాయ, కర్బూజ..

పుచ్చకాయ, కర్బూజ వంటి పండ్లలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లను పొరపాటున పాలతో తీసుకోకూడదు. చాలామంది ఈ పండ్లకు పాలు కలిపి మిల్క్ షేక్ తయారుచేసుకుని తాగడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఇవి తీసుకోవడం వల్ల జీర్ణసంబంధ సమస్యలు ఏర్పడతాయి. అంత ఈజీగా వదలవు.

కేవలం పైన చెప్పుకున్నవే కాకుండా పాలతో పాటూ ఉప్పు, కారం, మాంసాహారం, ఆకు కూరలు వంటివి తీసుకోకూడదు.

                                                         *నిశ్శబ్ద.

By
en-us Political News

  
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు..
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు...
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా...
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
భారతీయుల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది.  పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లేకుండా రోజు అస్సలు గడవదు.  ఇక ఇప్పట్లో చాలా మంది పనీర్ కుడా బాగా వినియోగిస్తున్నారు....
మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా వివరించారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.