Publish Date:Oct 11, 2022
అదేదో సినిమాలో భారీ ఆయిల్ పైపులు అండర్గ్రౌండ్లో అమర్చి విలన్ తాలూకు పేద్ధ ఆయిల్ ట్యాంక్ నుంచి అమాంతం రెండు మూడు రోజుల్లో ఆయిల్ అంతా లాగేస్తారు. అప్పటివరకూ పేద్ద ఆయిల్ ట్యాంక్ ని పెద్ద మేడలో కిటికీలోంచి చూసుకుంటూ విలన్ తెగ ఆనందిస్తుంటాడు. కానీ ఓ మధ్యాన్నం అంతా అయిపోయి ఒక్క ఫోన్ కాల్ కోట్ల ఆస్తిని తుడిచేస్తుంది. ఇంత కాకున్నా ఆ మొదటి భాగం మాత్రం వాస్త వంగా ఒక గుడుంబా కింగ్ పక్కా జిరాక్స్ చేశాడు మరో విధంగా.. లాభం చేకూరేలా!
అయితే మధ్యప్రదేశ్లో ఒక గ్రామంలో నీరసంగా ఒక వ్యక్తి బోరు దగ్గరకి వెళ్లాడు. పంపు కొట్టగానే నీళ్లు వచ్చాయి. అవి మంచినీళ్ల నుకుని నోట్లో పోసుకోగానే ఏదో తేడా అనిపించింది. రెండురోజుల క్రితం తాగిన సారా గుర్తొచ్చింది. అనుమానించి మళ్లీ కొంచి బలంగా బోర్ కొట్టి చిన్న గ్లాసు నింపుకుని మరీ తాగి అదే.. అని తెగ ఆనందపడుతూ అరుస్తూ తాగి తూలి పడ్డాడు.
కొంతమంది అటుగా వెళుతూ పడిపోయిన ఈ వ్యక్తి ని చూసి ఈడ గూడ మందుకొట్టి పడ్డాడ్రా అనుకుని దగ్గరి కెళ్లారు. పంపుకొట్టి నీళ్లు అనుకుని అదే గ్లాసుడు అతని మీద పోశారు. ఠక్కున లేచి నోరెళ్లబెట్టి మరీ తాగాడు. ఏందిరా అయ్యా.. అంటే.. మందు.. మందురా బాబు.. మందు! అంటూ అరిచి గోల చేశాడు. వచ్చినవాళ్లు ఆశ్చర్యంగా, కాస్తంత ఖంగారుగానూ అతనికేసి చూశారు. మావా ఇందులోనే ఏదో మత్తు ఉంది అంటూ ఓ కుర్రాడు. పడిపోయిన ఆ వ్యక్తిని అవతలకి తీసికెళ్లి కూచోబెట్టాడు. అప్పుడు ఆ పంపు రహస్యం చెప్పాడు. బోర్ నీల్లనుకునేర్రా..అది మందు! అని అన్నాడు. ఆ కుర్రాడికి గీత వినిపించి నంత యింది.
పరుగున వచ్చి అతనూ బోర్ కొట్టాడు.. అవును అతను చెప్పింది కరెష్టే..మావా.. అన్నాడు రెండు గుక్కలు తాగి. మధ్యప్రదేశ్ లో ఒక గ్రామంలో సీన్ ఇది. అక్కడ అక్రమ మద్యం రవాణా చేసేవారు, లోకంలో ఎవ్వరూ ప్రదర్శించలేని తెలివి తేటలు ప్రదర్శించి, జనానికి మద్యం పోస్తూ డబ్బు వీలయినంత గణిస్తున్నారు. అందులో భాగమే ఈ బోర్ పంపు ఆలోచన. ఇంతకీ విషయమేమంటే.. కొందరు అక్రమమద్యం అమ్మే వాళ్లు పెద్ద పెద్ద మద్యం డ్రమ్ములు భూమిలో పాతిపెట్టారు. పైన బోర్కి వాటిని కనెక్ట్ చేశారు. అంతే జనానికి, పోలీసులకి అనుమానం లేకుండా సాగుతూ వచ్చింది. కానీ దొంగపని ఎన్నాళ్లు సాగుతుంది? తాగి తూలినవారే రగస్యం బయటపెట్టేశారు!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/flowing-taddy-through-bore-pump-39-145267.html
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.