రాహుల్ ఫేక్ వీడియో కేసు.. టీవీ యాంకర్ అరెస్ట్

Publish Date:Jul 5, 2022

Advertisement

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మాజీ  అధ్యక్షుడు. కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైనా పార్లమెంట్ సభుడు. అక్కడ ఆయనకో ఆఫీస్ వుంది.. ఆ ఆఫీస్ పై దాడి జరిగింది. ఆ దాడిచేసింది ఎవరు, ఏమిటి అనేది పస్తుతానికి అప్రస్తుతమే అయినా, అధికార సిపిఎం పార్టీ అనుబంధ విద్యార్ధి విభాగం, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు రాహుల్ గాంధీ కార్యాలయం పై దాడి చేసినట్లు సమాచారం. కేరళలోని అటవీ ప్రాంతాల్లో బఫర్‌ జోన్ల ఏర్పాటు విషయంలో స్థానిక ఎంపీ రాహుల్‌ జోక్యం చేసుకోవడం లేదని, అసలు యాన్ కనిపించడమే లేదని  నిరనసకు దిగిన ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు ఆయన కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. 80-100 మంది కార్యకర్తలు రాహుల్‌ కార్యాలయంలో వీరంగం సృష్టించారు. అక్కడి వస్తువులను ధ్వంసం చేశారు. ఆందోళనకారుల్లో 8 మందిని పోలీసులు అదుపులోకి తేసుకున్నారు.

రాహుల్  గాంధీ కార్యాలయంపై దాడి ఘటనపై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ కార్యాలయంపై దాడిని చేయించింది కేరళలోని అధికార పార్టీ సీపీఎంకు చెందిన విద్యార్థి విభాగం కార్యకర్తలే అని ఆరోపించారు. అందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని కాంగ్రెస్ నాయకులు సిపిఎం ప్రభుత్వాని డిమాండ్ చేశారు.  అయితే, రాహుల్ ‘గాంధీ’ దాడిని ఖండిస్తూనే, “అయినా వారు చిన్న పిల్లలు. వారిని క్షమింపుడు” అంటూ, పోలీసులు అదుపులోకి తీసుకున ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను క్షమించి వ‌దిలి పెట్టాల‌ని పోలీసులను  కోరుతూ ఒక వీడియో విడుదల చేశారు . 

అయితే ఈ వీడియోను జీ న్యూస్ త‌ప్పుగా ప్లే చేసింది. రోహిత్‌ రంజన్... జీ టీవీ ఛానెల్‌లో పేరుగాంచిన డీఎన్‌ఏ షోకి వ్యాఖ్యతగా చేస్తున్నాడు. రాహుల్‌ గాంధీ వయనాడ్ లో తన ఆఫీస్ పై జరిగిన దాడి గురించి వీడియో రిలీజ్ చేయగా..దాన్ని ఉదయ్ పూర్ లో కన్హయ్యలాల్ అనే టైలర్ ని ముస్లిం యువకులు హత్య చేసిన ఘటనకి లింక్ చేస్తూ వీడియోను టీవీలో ప్లే చేశారు. ఉద‌య్‌పూర్ నిందుతులని వ‌దిలిపెట్టాల‌ని రాహుల్ చెప్పినట్లు ఉద్దేశం వ‌చ్చేలా రాహుల్ వ్యాఖ్యలను వక్రీకరించి వీడియోను ప్లే చేశారు.దాని మీద రాహుల్ గాంధీని త్రోల్ చేస్తూ, వేల సంఖ్యలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో జీ టీవీ న్యూస్‌ యాంకర్‌ రోహిత్‌ రంజన్‌ పై చత్తీస్‌గఢ్‌, రాజస్తాన్ రాష్గ్రాల్లో కేసులు నమోదయ్యాయి.

కాగా, మంగళవారం ఉదయం ఘజియాబాద్ పోలీసులు ఢిల్లీ శివార్లలోని రోహిత్ నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. వాస్తవానికి చత్తీస్‌గఢ్‌ పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నిచగా ఘజియాబాద్‌ పోలీసులు రంగంలోకి దిగి రంజన్‌ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే నాటకీయ పరిణామాల మధ్య అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు. అదలా ఉంటే, ఇప్పడు నేరం చేసిన వారిని రాహుల్ గాంధీ వదిలేయమని ఎలా చెపుతారని, కొదరు ప్రశ్నిస్తున్నారు. నిజమే, కారణాలు ఏవైనా తప్పు చేసిన వారిని క్షమింఛి వదిలేయడం వలన వారు మళ్ళీ అదే తప్పు చేసే ప్రమాదం ఉందని..,సోచిన్నా పెద్ద అనే తేడాలేకుండా తప్పు చేసిన వారిని తగిన విధంగా శిక్షించ వలసిందే అంటున్నారు.

By
en-us Political News

  
బాంకీపూర్ నియోజకర్గం దశాబ్దాలుగా బీజేపీ కి బలమైన కోటగా నిలబడుతోంది. 1995 నుండి ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. గత ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ విజయం సాధించారు. ఆయన తాజాగా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఈ నియోజకవర్గానికి రాజీనామా చేశారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు, బయటి నుంచి వచ్చే రాజకీయ మద్దతుపై ఆధారపడటం మానుకోవాలని ఈ సందర్భంగా నితిన్ నబీన్ విస్పష్టంగా చెప్పారు. బయటి నుంచి మద్దతు లభిస్తుంది, దానితో ఎన్నికల్లో గెలిచేయవచ్చు అనే భ్రమల నుంచి తెలంగాణ బీజేపీ నాయకులు వెంటనే బయటకు రావాలనీ, . నాయకత్వంలో అలసత్వాని ఇకపై ఇసుమంతైనా సహించేది లేదనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ఉప్పల్‌లో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ..
నేడు తెలంగాణకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల, ప్రాంతీయ సమీకరణాల చుట్టూనే తిరుగుతుంటాయి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చాయి.
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు...కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాల్..
మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని అంటున్నారు. మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29) క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.
జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
సాయికృష్ణ మిస్సింగ్ కేసును రాజకీయం చేయాలని వైసీపీ చూస్తోందనీ., కానీ ఈ కేసులో నిందితుడైన సీఐ నాగరాజు కూడా కాపు సామాజిక వర్గానికి చెందినవాడేనని గుర్తుచేశారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందినవాడైనా తప్పేనని, దానికి కులాన్ని అంటగట్టడం సరికాదని హితవు పలికారు.
ఆ అమ్మాయి నోట జగన్ సార్ అనే మాట రాగానే.. అది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డేనంటూ వైఎసీపీ సోషల్ మీడియా విభాగం పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారానికి తెరలేపింది. ఆ అమ్మాయి ప్రాణాలు కాపాడింది వైఎస్ జగనేనంటూ ఫోటోలు మార్ఫింగ్ చేసి నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ క్రెడిట్ చోరీపై కిరాక్ ఆర్పీ సాక్ష్యాలను చూపిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు.
  బాధిత తల్లితో సిఐ నాగరాజు మాట్లాడిన ఆడియో సంభాషణలు, ఆయన ప్రదర్శించిన దురుసు ప్రవర్తన ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమై ప్రపంచమంతటా సంచలనం సృష్టించాయన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.