ఫేక్ వార్తల ప్రచారం, వీడియోల ప్రసార విషయాలలో బీజేపీ ఇంత కాలం తాను పవిత్రంగా ఉన్నానంటూ చేసుకుంటున్న ప్రచారంలో ఇసుమంతైనా వాస్తవం లేదని తేలిపోయింది. విపక్షాలపై దుష్ప్రాచారానికి వీడియో టేప్లను విడుదల చేయడమనే దుష్ట సాంప్రదాయం అంటని సచ్ఛీలత మాది అంటున్న బీజేపీ బండారం బయటపడిపోయింది. పేక్ వార్తలు, వీడియోల విషయంలో బీజేపీకి మినహాయింపు ఏమీ లేదని తేటతెల్లమై పోయింది. రాహుల్ గాంధీకి వ్యతి రేకంగా ఫేక్ వీడియో విడుదల చేసినందుకు ఇద్దరు బీజేపీ ఎంపీలపై ఛత్తీస్ గడ్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది.
ఛత్తీస్గఢ్లో రాహుల్గాంధీకి సంబంధించి విడుదలైన వీడియో మత సామరస్యానికి భంగం కలిగించే దిలా వుందని దాఖలైన ఫిర్యాదుపై బీజేపీ ఎంపీలు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, సుబ్రత్ పాఠక్లపై ఎఫ్ఐ ఆర్ నమోదు అయ్యింది. ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్లో ఎంపీలతో పాటు మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదైందని ఆ పార్టీ మీడియా పబ్లిసిటీ టీమ్ చీఫ్ పవన్ ఖేరా తెలిపారు. ఢిల్లీ, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ వారిపై ఫిర్యాదులు చేసిందని, ఖేరా, ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సుప్రియా శ్రీనాటే విలేకరులతో అన్నారు.
రాహుల్ పై ఫేక్ వీడియోలు విడుదల చేసి బీజేపీ ఎంపీలిద్దరూ దేశద్రోహానికి పాల్పడ్డారని ఆయన దేశంలో మత సామరస్యానికి భంగం కలిగించే ఉద్దేశంతో కేంద్ర మాజీ మంత్రి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే, అది దేశద్రోహమేనని ఆమె ఆరోపిం చారు. అబద్ధ వార్తలు ప్రచారంచేసేవారికి బీజేపీలో ప్రమోషన్లు వస్తున్నాయన్నారు. హైదరాబాద్లో ప్రధాని దాదాపు అరగంట సేపు మాట్లాడారని, అయితే శాంతి, మత సామరస్యం కోసం కోసం ఒక్క విజ్ఞప్తి కూడా చేయలేదని ఆమె అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/fake-video-on-rahul-fir-on-two-bjp-mps-in-chattisghar-39-139127.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.