Publish Date:Feb 16, 2026
బీఆర్ఎస్ కింద పడ్డా పై ‘చేయి’ మాదేనంటోంది. ‘హస్త’ వాసి బాగాలేదంటోంది. కాంగ్రెస్ పార్టీపై ప్రజలలో వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో తెలియడానికి మునిసిపోల్స్ ఫలితాలే నిదర్శనమని బల్లగుద్ది మరీ చెబుతోంది. పురపోరులో ఈ స్థాయిలో పరాజయాన్ని మూటగట్టుకుని కూడా ఓటింగ్ శాతం చూడండి.. గత లోక్ సభ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ కు వచ్చిన ఓట్ల శాతం పెరిగిందనీ, కాంగ్రెస్ కు తగ్గిందనీ చెబుతూ సొంత భుజాలను చరిచేసుకుంటోంది. అయితే.. బీఆర్ఎస్ ఓట్ల శాతం భాష్యంపై జనంలో పెద్దగా స్పందన రావడం లేదు. పైపెచ్చు పార్టీ శ్రేణుల్లోనూ ఈ తరహా వ్యాఖ్యల పట్ల ఒకింత వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సాధారణంగా ఒక పరాజయం తరువాత ఏ పార్టీ అయినా, లోపాలను సవరించుకోవడంపై దృష్టి పెడుతుంది. అలాంటిది వరుస పెట్టి పరాజయాలు ఎదురౌతున్నా బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అంతర్మథనం వైపు దృష్టి సారించడం లేదు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై వారి ఆదరణ పొందడానికి అవసరమైన కార్యాచరణ ప్రకటించలేదు.
2023 అసెంబ్లీ ఎన్నికల లగాయతు.. బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకూతీసికట్టు అన్నచందంగా కనిపిస్తోంది. 2023లో పార్టీ పరాజయం తరువాత.. ఆ పార్టీ టికెట్ పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీకి దూరమయ్యారు. శాసన సభ్యత్వం రద్దు కాకుండా కాపాడుకోవడానికో, అనర్హత వేటు భయంతోనో.. కారణమేమైతేనేం.. సాంకేతికంగా తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామనిన చెబుతున్నప్పటికీ ఆ ఎమ్మెల్యేలు పార్టీకి విధేయంగా లేరన్నది తేటతెల్లమైపోయింది. ఇక కీలకమైన కేకే వంటి నాయకులు సైతం బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేశారు. ఈ పరిస్థితుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచీ బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాల్సిన కేసీఆర్.. పార్ట్ టైం పార్టీ కార్యక్రమాలకే పరిమితమై.. ఫామ్ హౌస్ దాటి అడుగుబయటపెట్టేది లేదని చాటుతున్నారు. ఇక కార్య నిర్వాహక అధ్యక్షుడిగా పార్టీని ముందుండి నడిపించాల్సిన కేటీఆర్ సామాజిక మాధ్యమం వేదికగా అధికారపార్టీపై విమర్శల పేరుతో దూషణలకు పరిమితమౌతున్నారు.
పంచాయతీ పోరులో పరాజయం తరువాత మునిసిపోల్స్ లో జెండా పాతడం ఖాయమని ఘనంనగా ప్రకటించారు కేటీఆర్. అయితే ఫలితాలలో ఎన్నికలు జరిగిన 115 మునిసిపాలిటల్లో బీఆర్ఎస్ గెలుచుకున్నవి కేవలం 16 మునిసిపాలిటీలే. ఇక బీఆర్ఎస్ పార్టీ ఒక్కటంటే ఒక్క వార్డులో కూడా గెలుపొందని మునిసిపాలిటీలు 13కు పైగా ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపు-ఓటములు సహజమే. కానీ.. తన అంచనాలలోని సంఖ్యకు కనీసం దరిదాపులకు కూడా రాకుండా మునిసిపల్ పోరు ఫలితాలు ఉన్నా.. ఎక్కడ తేడా కొడుతోందన్న ఆత్మ విమర్శ చేసుకునేందుకు మాత్రం కేసీఆర్, కేటీఆర్ అండ్ కో రెడీగా లేరు. పంచాయతి, పుర పోరు కాదు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం మా విజయం ఖాయం అంటూ కేటీఆర్ చాటడం చూస్తుంటే.. కింద పడిన ప్రతిసారీ పైచేయి మాదేనని చాటేందుకు చేస్తున్న ప్రయత్నంగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే తరహాలో కేటీఆర్ గమనం ఉంటే భవిష్యత్ లో మరిన్ని ఘోర పరాభవాలకు బీఆర్ఎస్ సిద్ధపడాల్సిందే అంటున్నారు పరిశీలకులు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/even-after-hitting-rock-bottom-25-214165.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.