ఈటల రాజేందర్ కారెక్కేస్తారా?.. కాళేశ్వరంపై బీఆర్ఎస్ అనుకూల గళం సంకేతమదేనా?

Publish Date:Jul 10, 2026

Advertisement

 తెలంగాణ రాజకీయాలలో ఈటల రాజేందర్ పరిచయం అక్కర్లేని పేరు. బీఆర్ఎస్ హయాంలో కీలక నేతగా, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక మంత్రిగా ఈటల కీలక పాత్ర పోషించిన సంగతి విదితమే. అయితే ఈ తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో విభేదాల కారణంగా బీఆర్ఎస్ ను వీడి కమలం గూటికి చేరారు. అయితే వామపక్ష భావజాలం ఉన్న ఈటల బీజేపీలో ఎలా ఇముడుతారా అన్న చర్చ ఆ సందర్భంగా జోరుగా సాగింది. అయితే ఈటల కమలం పార్టీలో కుదురుకున్నట్లుగానే కనిపించారు. మధ్య మధ్యలో అడపాదడపా ఇబ్బందులు తలెత్తినా సర్దుకున్నారు.  అయితే ప్రస్తుతం మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్న ఈటల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించారు. ఒక దశలో ఆయకు ఆ పదవి దక్కడం ఖాయమని అంతా భావించారు. అయితే అది జరగలేదు. అప్పటి నుంచీ ఈటల రాజకీయంగా మౌనం వహించారు. బీజేపీ కార్యక్రమాలలో పెద్దగా కనిపించడం లేదు. 

ఈ నేపథ్యంలోనే ఈటలకు బీజేపీలో ఉక్కపోత ఎక్కువైందన్న  చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగింది. ఆయన కమలం గూటికి వీడతారంటూ ప్రచారం కూడా జరిగింది. ఈ తరుణంలో ఆ ప్రచారానికి బలం చేకూర్చేలా ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు.  కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న  రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం  కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్   బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది. 

అయితే.. తాజాగా కాళేశ్వరంపై హైదరాబాద్ లో  మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్, కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల్లో జరుగుతున్న జాప్యాన్ని  తప్పుపట్టారు. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి మిడ్ మానేరు  అత్యంత కీలకం అన్న ఆయన..   కరవు  ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. లోలెవల్ పాయింట్‌కు చేరుతున్న నీటిని ఎత్తిపోసి రైతాంగాన్ని ఆదుకోవడానికి  కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు.  

ఆ సందర్భంగా తాను ఎవరికో భయపడి మాట్లాడే వ్యక్తిని కాదనీ.. తాను  తెలంగాణ మట్టిబిడ్డను, ఉద్యమకారుడినీ అదే తన గుర్తింపనీ ఉద్ఘాటించారు. ఈ వ్యాఖ్యల ద్వారా కమలం పార్టీకి తాను కట్టుబానిసను కాననీ, తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వెళ్లడిస్తాననీ అన్యాపదేశంగానే అయినా విస్పష్టంగా చెప్పారు.  తనకు తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమనీ, ఈ తరువాతే.. పార్టీ అని కుండబద్దలు కొట్టారు.   దీంతో  ఈటల రాజేందర్ కేసీఆర్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య అంతర్గత అవగాహన ఉందంటూ అధికార పక్షం ఆరోపణలు గుప్పించడం, బండి సంజయ్ వంటి బీజేపీ నేతలు ఈటలను తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఈటల మళ్లీ కారెక్కే అవకాశం ఉందంటూ రాజకీయవర్గాలలో ప్రచారం జోరందుకుంది.  

Etela Rajender join the BRS, Kaleshwaram Project, BRS Support Rumors, Telangana Politics, BJP MP Etela Comments

By
en-us Political News

  
నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.
మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.
మాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
రావణ్ అరెస్టుపై వైసీపీ, ఇతరులు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరస్థులకు వైసీపీ ఇలా బాహాటంగా మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రశ్న రావణ్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో, సమాజానికి ఎంతటి ముప్పుగా పరిణమించాడో ప్రజలంతా గమనించాలని కోరారు.
తిపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే విషయంలో జనసేన ఏమంత యాక్టివ్ గా లేదన్నది వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక ఈ విషయంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా పార్టీ లీడర్లు, క్యాడర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాదే పాద‌యాత్ర ప్రారంభిస్తాన‌ని కేటీఆర్ స్వయంగా ప్రకటించి కూడా వెనక్కు తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఏ మంత వ్యతిరేకత కనిపించడం లేదన్న అవగాహనతోనే కేటీఆర్ తన పాదయాత్రను వాయిదా వేసుకున్నారన్న చర్చ జరుగుతోంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సమక్షంలో కమలం కండువా కప్పుకుని బీజేపీలో చేరారు. వీరు ముగ్గురూ ఇలా బీజేపీలో చేరారో లేదో అలా బీజేపీ హైకమాండ్ వీరి రాజీనామాతో ఖాళీ అయిన ఆ మూడు రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకే వీరినే తమ అభ్యర్థులుగా ప్రకటించింది.
దేశంలో ఉగ్రవాదులు, నక్సలైట్లపై చర్యలు తీసుకునేందుకు ఉద్దేశించిన అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ (ఉపా) గురించి కనీస అవగాహన లేకుండా కొడాలి నాని మాట్లాడుతున్నారన్నారు. కొడాలి నాని వ్యాఖ్యలు అజ్ణానంతో చేశారని తాను భావిస్తున్నాననీ, ఒకవేళ ఆయన తెలిసి బుద్ధిపూర్వకంగానే ఉపా చట్టాన్ని ఉప్మా యాక్ట్ అని అవమానించి ఉంటే, భారత రాజ్యాంగాన్ని, చట్టాలను కించపరిచినందుకు ఆయనపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఇప్పుడు చలామణి అవుతున్న పార్టీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కి మధ్య ఇటీవలి కాలంలో తీవ్ర విభేదాలు తలెత్తినట్లు పార్టీ వర్గాలలో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.