Publish Date:Jun 18, 2026
తెలంగాణకు భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాపై ఈగల్ ఫోర్స్ మరోసారి ఉక్కు పాదం మోపింది. ఒడిశా లోని దట్టమైన కోరాపుట్ అటవీ ప్రాంతంలో అత్యంత సాహసోపేతంగా నిర్వహిం చిన ఈ ఆపరేషన్లో ఈగల్ ఫోర్స్ 500 కిలోల గంజా యిని స్వాధీనం చేసుకు న్నారు. ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఈగల్ ఫోర్స్ నిర్వహించిన ఈ హై రిస్క్ ఆపరేషన్కు ఒడిశా పోలీసులు ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపిం చారు.విశ్వసనీయమైన సమాచారం అందడంతో రంగంలోకి దిగిన ఈగల్ ఫోర్స్ బృందాలు, బలిమేళా నుంచి జయపూర్ వరకు సుమారు 80 కిలోమీటర్ల మేర గంజాయి తరలిస్తున్న బొలెరో వాహనాన్ని వెంబడించారు.
అడవులు, ఘాట్ రోడ్లు దాటుకుంటూ సాగిన ఉత్కంఠభరిత చేజింగ్ అనంతరం వాహ నాన్ని అటవీ ప్రాంతం లో నిలిపివేసిన డ్రైవర్ చీకటి మాటున పరారయ్యాడు. అనంతరం వాహనాన్ని తనిఖీ చేసిన అధికారులు అందులో మొత్తం 115 ప్యాకెట్లలో దాచిన 500 కిలోల గంజాయి ఉన్నట్లుగా గుర్తించారు. వీటిలో 90 ప్యాకెట్లు ఐదు కిలోల చొప్పున, మరో 25 ప్యాకెట్లు రెండు కిలోల చొప్పున ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయితో పాటు బొలెరో వాహనాన్ని ఒడిశా కోరాపుట్ పోలీసు లకు అప్పగించారు.
ఈ ఘటనపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసు కున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వాహనం ఒడిశాలోని నబరంగ్పూర్ జిల్లాకు చెందిన అమీర్ అలీ ఖాన్ పేరిట రిజిస్ట్రేషన్ అయినట్లు అధికారులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.కాగా, 2024లో కూడా రాంచీ వరకు వెంబడించి 500 కిలోల గంజాయిని పట్టుకున్న ఈగల్ ఫోర్స్, మరోసారి అదే స్థాయిలో విజయవంతమైన అంతర్రాష్ట్ర ఆపరేషన్ నిర్వ హించడం విశేషం.... తెలంగాణకు మాదకద్ర వ్యాల సరఫరాను అడ్డుకునే క్రమంలో ఈగల్ ఫోర్స్ చేప డుతున్న వరుస చర్యలు స్మగ్లింగ్ ముఠాల్లో గుండె దడ పుట్టిస్తున్నాయి... తెలంగాణ ఈగల్ ఫోర్స్ చేసిన సాహసాన్ని చూసి ఒరిస్సా పోలీసులు సైతం అవాక్కయ్యారు.... ఒరిస్సా పోలీసు ఉన్నతాధికారులు ఈగల్ ఫోర్స్ ను అభినందించారు...
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/eagle-force-attack-in-odisha-forests--interstate-gang-25-223407.html
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది