Publish Date:Aug 14, 2022
క్లాస్ ఫస్ట్ రాలేదు, ఉద్యోగంలో ప్రమో షన్ రాలేదు, పోనీ ఊరికేమైనా ఘన కార్యం చేశాడా అంటే అదీ లేదు. కానీ హుస్సేన్ని మాత్రం లెబనీయులు హీరో అనే అంటున్నారు. కారణం అత ను తన బ్యాంక్ అకౌంట్లో కొంత డబ్బు తీసుకోవడానికి నానా హడావుడీ చేయాల్సి వచ్చింది. చాలామంది భయపడ్డారు కూడా. సినిమా క్రైమ్ సీన్స్ని తలపిస్తుంది.
ఈమధ్యనే ఒకరోజు బస్సాం అల్-షేక్ హుస్పేన్ అనే వ్యక్తి లెబనాన్ బీరూట్కి చెందిన హామ్రా లో ఒక బ్యాంక్ కి వెళ్లాడు. అందరూ డబ్బులు తీసుకోవ డానికి వెళ్లనట్టే వెళ్లలేదు. చేతిలో ఏకం గా షాట్ గన్ పట్టుకుని మరీ వెళ్లాడు. లోపలికి వెళ్లగానే అక్క డున్న వారిని బెదిరించాడు. అంతే కాదు ఒక రౌండ్ కాల్పులూ జరిపేడు. అయితే అక్కడున్నవారికేమీ కాకుండానే చేశాడా పని. నిజానికి అతను బ్యాంక్ను మరీ దోపిడీ చేసి పోవాలని దొంగలా చొరబడలేదుట. అతని అకౌంట్లోంచి కొంత డబ్బు తీసు కోవడానికే వచ్చానని తీరిగ్గా చెప్పి డబ్బు తీసుకున్నాడు.
బీరూట్ ఫెడరల్ బ్యాంక్ అనే బ్యాంక్లో హుస్సేన్ అకౌంట్లో సుమారు 1.67 కోట్లు డబ్బు ఉంది. అందులోంచి రూ.7,96 లక్షలు తీసుకోవాలని వెళ్లాడు. కానీ బ్యాంక్ వారు అంత మొత్తం ఒక్కసారిగా ఇవ్వడానికి అంగీకరించినట్టు లేదు. అతను అడిగాడు, ప్రాధేయపడ్డాడు. తన తండ్రి అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నాడు. ఆయన మందులు, ఆస్పత్రి బిల్లు కట్టడానికి చేతిలో చిల్లి గవ్వ లేదు, ఇపుడు బ్యాంక్ నుంచే తీసి ఇవ్వాలని వేడుకున్నాడు. బహుశా బ్యాంక్వారు తిరస్కరించి ఉంటారు. అతగాడికి కోపం వచ్చి ఓ పదిమందిని షాట్గన్ చూపించి డబ్బు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. అంతే బ్యాంక్వారు భయపడి ఆయన అడిగింది మూటగట్టి మరీ ఇచ్చారు. వాస్తవానికి లెబనాన్లో ఆర్ధికపరిస్థితులు ఈ మధ్యకాలం ఊహించని విధంగా మార్పు చెందాయని వార్తలు వస్తున్నాయి.
హుస్సేన్ నవ్వుతూ అవి తీసుకుని సిగెరెట్ వెలిగించుకుని మరీ బయటకి వచ్చాడు. కానీ మెట్లు దిగ్గానే పోలీసులు ఎదుర య్యారు. కానీ హుస్సేన్ సినిమాల్లోలా పారిపోలేదు. వాళ్లదగ్గరికే వెళ్లి లొంగపోయాడు. ఇంత పనిచేసేవేంద్రా భయ్.. అంటూ. బేడీలే వేసారు. అయ్యా నా పరిస్థితిల్లో ఎవరున్నా ఇంతే ఆవేశపడతారని అన్నాడు హుస్సేన్. అసలే పోలీసులు, అతడి మాట ల్ని అస్సలు నమ్మలేదు. పైగా ఇప్పటికే ఒకసారి ఇలాంటి దోపిడీ జరిగిందని ఇతన్ని కట్టడి చేయకపోతే మరీ సంఖ్య పెంచు తాడని భయపడే పోలీసులు అరెస్టు చేశారట. ట్విస్ట్ ఏమిటంటే, హుస్సేన్ ధైర్యసాహసా లకు బీరూట్ ప్రజలు మాత్రం అతన్ని హీరోగానే పిలుస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/drama-at-lebanan-bank-39-141897.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్మెన్లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.