తలనొప్పికి ఇన్ని కారణాలు ఉన్నాయా!

Publish Date:Aug 22, 2024

Advertisement

చాలామంది సహజంగా చిరాకు, అసహనంతో ఉన్నప్పుడు ఏమైంది అని అడిగితే తలనొప్పి అనే మాటను ఎక్కువశాతం చెబుతుంటారు. అయితే వస్తున్న తలనొప్పి ఏమైనదీ తేలక తికమక పడటం కూడా అంతే సహజం.
 

తలనొప్పికి ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి. 


1. మానసిక కారణాలు


2. మెదడులోపల కంతులు ఏర్పడటం


3. యరీమియా, డయబిటిస్ వంటి కారణాలు


4. మైగ్రేన్, టెన్షన్ తలనొప్పులు, ఇతర శారీరక బాధలవల్ల కలిగే తలనొప్పులు.


మానసికంగా తలనొప్పి ఉందని బాధపడే వ్యక్తి రోజులు, వారాల తరబడి తలనొప్పితో బాధపడతాడు. పెద్దగుడ్డ తీసుకుని తలచుటూ గట్టిగా బిగించి కట్టుకుంటాడు. ఇలా కట్టుకోవడానికి నొప్పికంటే ప్రెషర్ (ఒత్తిడి)కారణం. డిప్రషన్, ఆందోళన, ఆవేశం వల్ల వచ్చే తలనొప్పులు మామూలుగా వాడే తలనొప్పి టాబ్లెట్స్ తో తగ్గవు.

ప్రతీ తలనొప్పి ప్రమాదకరమైంది కాదు


మెదడులో ప్రెషర్, కంతివల్ల కొందరిలో తలనొప్పి రావడం వుంటే మరికొందరిలో జ్వరంవల్ల, అతిగా మద్యం సేవించడం వల్ల తలనొప్పి కలుగుతుంది. ముఖ్యంగా మద్యం మైకం వదిలే సమయంలో (హాంగ్ ఓవర్ ) తలనొప్పి అనిపిస్తుంది. తలకి దెబ్బ తగలడం, వడదెబ్బ తగలడం, మెదడుకి రక్తం సరఫరా తగ్గడం వంటి పరిస్థితుల్లో కూడా తలనొప్పి తీవ్రంగా ఉంటుంది. 


మైగ్రేన్ తలనొప్పిని తెలుసుకోవడమెలా? 


మైగ్రేన్ తలనొప్పి సాధారణంగా వంశ పారం పర్యంగా వస్తుంది. తలకి ఒకవైపే నొప్పి అనిపిస్తుంది. ఎండ చూసినకొద్దీ నొప్పి ఎక్కువ అవుతుంది. తలనొప్పి వచ్చే ముందు కంటిముందు రింగులు రింగులు లాగానో, మరోలాగానో కనబడతాయి. తలనొప్పి రావడానికి 10-15 నిమిషాలు ఇటువంటి చికాకు పరిస్థితి ఉండవచ్చు. ఆ తరువాత ఒక చెంపన నొప్పి మొదలవుతుంది. నిదానంగా రెండవ వైపుకి కూడా నొప్పి అనిపించవచ్చు. ఈ నొప్పి చాలా తీవ్రంగా వుంటుంది నొప్పి ఎక్కువైన తరువాత వాంతి అవవచ్చు. కొందరు ఈ నొప్పికి తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోతారు. మైగ్రేన్ తలనొప్పి 4 నుంచి 43 గంటల పాటు వుంటుంది.


 కళ్ళజోడుతో తలనొప్పి పోవచ్చు! 


కొందరికి కళ్ళకి సంబంధించిన దోషం ఉండి తలనొప్పి వస్తుంది. వీరికి కళ్ళు పరీక్ష చేసి కళ్ళజోడు పెడితే తలనొప్పి తగ్గిపోతుంది. గ్లాకోనూ అనే కళ్ళవ్యాధి వల్ల కూడా తలనొప్పి వస్తుంది. మెడ దగ్గర కండరాలు, లిగమెంట్లు బిగదీసుకోవడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. సైనసైటిస్ వల్ల కూడా. తలనొప్పి వస్తుంది.


తలనొప్పిలో తేడాలు 


తలనొప్పి రావడానికి ఎన్నో కారణాలు, మానసిక ఆందోళన, ఒత్తిడి, మానసిక వ్యాధుల వల్ల తలనొప్పి రావడం ఉంటే, మెదడు వ్యాధులు, మెదడులో కంతులవల్ల తలనొప్పి వస్తుంది. రక్తనాళాల వ్యాకోచ సంకోచాలవల్ల తలనొప్పి వస్తే, విషజ్వరాలు, యబియా, డయబిటిస్ వంటి పరిస్థితుల్లో తలనొప్పి వస్తుంది.


ఏ తలనొప్పో తేల్చుకోవడమెలా?


తలనొప్పి ఎలా ప్రారంభమవుతున్నదీ, ఎంతసేపు ఉంటున్నదీ, నొప్పి ఏ రకంగా వున్నదీ, ఏ చోట ఎక్కువ అనిపిస్తున్నదీ, వదలకుండా వుంటున్నదా, వచ్చీ పోతూ ఉందా తలనొప్పి ఎప్పుడు ఎలా ఎక్కువ అవుతున్నదీ, వంశంలో ఇంకెవ్వరికైనా ఈ సమస్య ఉందా అనే అంశాలని దృష్టిలో ఉంచుకుని పరిశీలించడం అవసరం.


తలనొప్పి సంగతి అంతుపట్టనప్పుడు తక్కిన సాధారణ పరీక్షలతోపాటు సి. టి స్కానింగ్, యం. ఆర్. ఐ. పరీక్షలు, రక్త పరీక్షలు జరపాలి.


తలనొప్పే కదా అని తేలిగ్గా తీసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం.


                                 ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
ప్రతి ఒక్కరూ ఎక్కువ కాలం బ్రతకాలని అనుకుంటారు. కానీ చాలామందికి అది కలగా ఉంటోంది. నేటికాలంలో సగటు మానవుడి ఆయుష్షు చాలా క్షీణించింది.  ఒకప్పుడు మన ఋషులు, మహర్షులు కేవలం వంద కాదు.. కొన్ని వందల ఏళ్ళు బ్రతికారు....
మందారం పువ్వులు ప్రతి ఇంటి పెరట్లో  ఖచ్చితంగా ఉంటాయి.  ఎర్రగా ముద్దొచ్చే మందారాలలో బోలెడు ఔషద గుణాలు కూడా ఉంటాయి.  మందారాలను ఎక్కువగా పూజలలోనూ,  హెయిర్ కేర్ లోనూ ఉపయోగిస్తుంటారు. అయితే కేవలం జుట్టులో పెట్టుకోవడానికో లేదా జుట్టు సంరక్షణ కోసం మందారం నూనె లేదా హెయిర్ ప్యాక్ లోనో మాత్రమే కాదు....
శరీరంలో ముఖ్యమైన అవయవం గుండె.  ఏ ఇతర అవయవాలు సరిగా పని చేయకపోయినా ప్రాణం నిలబడుతుందేమో కానీ.. గుండె కొట్టుకోవడం కొన్ని నిమిషాల పాటు ఆగిపోతే శరీరం నిర్జీవం అవుతుంది...
భారతీయులు రిఫ్రెషింగ్ కోసం తీసుకునే పానీయాలలో టీ చాలా  ముఖ్యమైనది.  ఉదయం లేవగానే బ్రష్ చేసి టీ తాగాలి,  టిఫిన్ తినగానే టీ తాగాలి,  స్నేహితులతో బయట కలిస్తే టీ తాగాలి,  ఆఫీసు వర్క్ లో కాసింత బ్రేక్ కావాలంటే టీ తాగాలి...
ప్రతి మనిషి శరీరానికి సహజ ధర్మాలు ఉంటాయి.  ఆకలి వేసినప్పుడు ఆహారం తినడం,  దాహం వేసినప్పుడు నీరు త్రాగడం ఎలాగో.. మలమూత్ర విసర్జన కూడా అలాగే జరగాలి.  కానీ చాలామందికి మూత్రాన్ని ఆపుకునే అలవాటు ఉంటుంది...
ప్రతి ఏడాది ఎండలు పెరుగుతున్నట్టే చలి కూడా పెరుగుతోంది.   చివరి ఏడాది కంటే ఈ ఏడాది చలి తీవ్రత కూడా పెరిగింది.  చలి ఉదయం, రాత్రి వేళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది నిజానికి చాలా మంది నిద్రించే సమయం...
లవంగాలు వంటింట్లో ఉండే ఒక మసాలా దినుసు.  
ఆయుర్వేదంలో ఉసిరికాయను "అమృతఫలం" అని పిలుస్తారు.  అంటే అమృతంతో సమానమైన ఔషద గుణాలు కలిగిన ఫలం. అమృతంలాగా శరీరానికి గొప్ప ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది అని అర్థం.  ఉసిరికాయలో అనేక విటమిన్లు, ఖనిజాలు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.