వైసీపీలో పెరుగుతున్న రఘురామ రాజులు..! పార్టీలో నివురు తొలగిన అసమ్మతి, అసంతృప్తి

Publish Date:Jul 5, 2022

Advertisement

వైసీపీలో అసమ్మతి రాజుకుంటోంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలలో ఇంత కాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి, అసమ్మతి ఇప్పుడు రాజుకుని మంటగా మారుతోంది. పార్టీకి హైకమాండ్ అంటే  అధినేత జగన్ మాత్రమే. అసమ్మతి ఇప్పుడు అధినేతను ధిక్కరించడానికి సైతం వెనుకాడని పరిస్థితి కనిపిస్తోంది. ఇంత కాలం వైసీపీలో అసమ్మతి అంటూ ఎవరైనా బహిరంగంగా బయటకు వచ్చారంటే అది రెబల్ ఎంపీ రఘురామ రాజు మాత్రమే.

ఆయన ధిక్కారాన్ని సహించలేని అధినేత జగన్ ఆయన పట్ల వ్యవహరించిన తీరు తెలిసిందే. ఏపీ సీఐడీ పోలీసులు ఆయనను అరెస్టు చేసి భౌతికంగా హింసించారంటే దాని వెనుక ఉన్నది ఎవరో ఎవరైనా తేలిగ్గా ఊహించగలరు. ధిక్కారాన్ని, అసమ్మతి స్వరాన్ని అధినేత సహించడని స్పష్టంగా తెలిసినా కూడా పార్టీలో అసమ్మతి గళం పైకి లేస్తున్నదంటే పార్టీలో అసంతృప్తి ఎంతగా పేరుకుపోయిందో ఇట్టే అవగతమౌతుంది.

తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి తన నిరసనను పార్టీ అధినేతకు దిమ్మతిరిగేలా వినిపించారు. గత కొంత కాలంగా ఆయన సుతిమెత్తగా తన అసమ్మతిని, అసంతృప్తినీ వ్యక్త పరుస్తూనే ఉన్నారు. అయితే మంగళవారం ఆయన తన నిరసనను వ్యక్తం చేసిన తీరు పార్టీ వర్గాలనే దిగ్భ్రమకు గురి చేసింది. వైసీపీ ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆయన నేరుగా డ్రైనేజీలోకి వెళ్లి కూర్చున్నారు.   నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో డ్రైనేజీ పనులకు నిధులు కేటాయించడం లేదనీ, కార్పొరేషన్ అధికారులు ఎమ్మెల్యేనైన తన మాటలు వినడం లేదని ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నా..  ఎమ్మెల్యేగా తాను కోరుతున్నా డ్రైనేజీ పనులకు నిధులు కేటాయించడం లేదంటే ఏమనుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.  

ఎమ్మెల్యే  నిరసనకు  సంఘీ భావంగా ఆయన అనుచరులు కూడా డ్రైనేజీలోకి దిగారు. ఈ మొత్తం  సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకు పెద్ద చర్చకు శ్రీకారం చుట్టింది.  రోడ్లు, డ్రైనేజీలు వంటి పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాదనీ, రాష్ట్ర వ్యాప్తంగా ఏ నియోజకవర్గంలోనూ కూడా ఇటువంటి పనులకు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదనీ, ఇది అందరికీ తెలిసిన విషయమేనని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా ఎమ్మెల్యే కోటం రెడ్డి ఇలా బహిరంగ నిరసనకు దిగడం పార్టీని ప్రజలలో పలుచన చేయడానికేనని పార్టీ వర్గాలు అంటున్నాయి.  

తనకు మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తికి తోడు, తనతో అంతగా సఖ్యత లేని కాకాణికి మంత్రిపదవి ఇవ్వడంతో పెచ్చరిల్లిన అసహనంతో గత కొద్ది కాలంగా కోటం రెడ్డ పార్టీని భ్రష్టు పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.  అయితే ఒక్క కోటం రెడ్డే కాదు.. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులూ కూడా బహిరంగంగానే పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రకటనలూ ప్రసంగాలూ చేస్తున్నారు. ఇటీవల బొత్స కూడా విజయనగరం జిల్లాలో ప్లీనరీ సదస్సులో మాట్లాడుతూ పార్టీ క్యాడర్ నాయకత్వం మీద విశ్వాసం కోల్పోతోందనీ, వారు పార్టీని వీడే ఆలోచన చేస్తున్నారనీ చెప్పడమే కాకుండా ఇప్పటికైనా మేలుకోకపోతే పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుందని కుండ బద్దలు కొట్టారు. అంతకు ముందు సమీక్షా సమావేశంలోనే బాలినేని వంటి నేతలు పార్టీలో అసమ్మతి, పనులు జరగకపోవడంతో ప్రజలలో పెల్లుబుకుతున్న ఆగ్రహం గురించి అధినేత ఎదుటే గళమెత్తారు.  

ఇక జోగి రమేష్ అయితే ప్రభుత్వ సలహాదారు సజ్జల సమక్షంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకు కొందరు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా మాజీ మంత్రి వెల్లంపల్లి ఈ రోజు వైసీపీలోనే ఉన్నా ముందు ముందు ఉంటారన్న నమ్మకం లేదని అన్నారు.    మాజీ మంత్రి బాలినేని విషయం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సొంత పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారని ఆయన పలు సందర్భాలలో బహిరంగంగా చెప్పారు.

గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని అయితే గన్నవరం, బందర్ నియోజకవర్గాలలో వచ్చే ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు ఎవరన్నది ప్రకటించేసి ఆయా నియోజకవర్గాలలో ఇప్పటికే ఉన్న గ్రూపు తగాదాలకు అజ్యం పోశారు. ఇలా ఇక్కడ ప్రస్తావించిన జిల్లాలలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వైసీపీలో గ్రూపు తగాదాలు శృతి మించి రాగానపడ్డాయని పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి.  పరిస్థితి ఇలాగే కొనసాగితే నియోజకర్గానికి ఒక రఘురామరాజు తయారైనా ఆశ్చర్యపోవలసిన పని లేదని పరిశీలకులే కాదు, వైసీపీ శ్రేణులు సైతం అంటున్నాయి.

By
en-us Political News

  
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.