పాక్ తో యుద్ధం ముగిసిన‌ట్టేనా?

Publish Date:May 11, 2025

Advertisement

పాక్ తోక జాడింపులు ఇక్క‌డితో ఆగిన‌ట్టేనా?

భార‌త్ ఇంకా సాధించ‌వ‌ల‌సిన ల‌క్ష్యాలేంటి?

భార‌త్ పాక్ వ్య‌వ‌హారాల నిపుణులు ఏమంటున్నారు?

మే 10 సాయంత్రం 5 గంట‌ల నుంచి భార‌త్ పాక్ మ‌ధ్య యుద్ధ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందం అమ‌ల్లోకి వ‌చ్చింది. అయినా నాలుగు గంట‌ల అనంత‌రం అంటే రాత్రి 9 గంట‌ల‌కు పాక్ మ‌న స‌రిహ‌ద్దుల వెంబ‌డి మ‌ళ్లీ డ్రోన్ల మోత మోగించ‌డంతో క‌శ్మీర్ సీఎం ఓమ‌ర్ అబ్ధుల్లా కాల్పుల మోత ఆగ‌లేద‌ని.. విర‌మ‌ణ ఒప్పందం అమ‌లు జ‌ర‌గ‌లేద‌న్న ట్వీట్ తో మ‌రోమారు ఉలిక్కి ప‌డింది ప్ర‌పంచం. మ‌రీ ముఖ్యంగా ఇక యుద్ధం ముగిసిందిలే అని ఊపిరి పీల్చుకున్న ఇరు దేశాల ప్ర‌జ‌లు.. అదిరిప‌డ్డారు. ఇక మీడియా అయితే తిరిగి   యుద్ధ తొడుగులు తొడిగి వార్త‌ల‌ను వండి వార్చ‌డం మొద‌లైంది.

అంత‌కు ముందు అమెరికా స‌గ‌ర్వ ప్ర‌క‌ట‌న చేసింది. ఇదంతా త‌న‌ వ‌ల్లేన‌ని ట్రంప్ కాల‌ర్ ఎగ‌రేశారు. ఇక్క‌డ గుర్తించాల్సిన విష‌యం ఏంటంటే, ట్రంప్ ప‌లికే శాంతి వ‌చ‌నాల‌కు ఒక అర్ధం లేదు. కార‌ణం ఈ దేశం ఉక్రెయిన్- ర‌ష్యా తో యుద్ధంలో ఉండ‌గానే.. అతి పెద్ద ఖ‌నిజ వ‌న‌రుల ఒప్పందం  చేసుకుంది. అంటే ప్రాణాపాయ ప‌రిస్థితుల‌ను సైతం క్యాష్ చేసుకోవ‌డం ఈ అగ్ర ఉగ్ర ప్రేరేపిత దేశానికి గ‌న్నుతో పెట్టిన విద్య అన్న‌మాట‌. 

ఇక భార‌త్ పాక్ వ్య‌వ‌హారాల విష‌యంలోనూ ఇదే చేయాల‌ని చూసింది. కానీ మోడీ ఈ విష‌యం ముందే గ్ర‌హించి ట్రంప్ కి చెక్ పెట్టారు. అస‌లు ట్రంప్ మెయిన్ టార్గెట్ ఏంటంటే.. భార‌త్ ని యుద్ధానికి ఎగ‌దోసి.. ఆయుధాలు కొనిపించాలని. కానీ భార‌త్ ఈ విష‌యం ముందే గ్ర‌హించి.. త‌మ ద‌గ్గ‌రున్న ర‌ష్య‌న్ మేడ్ వార్ వెప‌న్స్  మాత్ర‌మే వాడడానికి ఆస‌క్తి చూపింది. ర‌ష్యా నుంచి 35 వేల కోట్ల రూపాయ‌ల డీల్ ద్వారా దిగుమ‌తి చేసుకున్న ఎస్ 400 తో దాదాపు అనుకున్నంత ప‌ని చేసింది. 

2018లో ఈ డీల్ కుదురుతున్న‌ప్పుడే యూఎస్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. అప్పుడు కూడా ఇదే ట్రంప్ అధికారంలో ఉన్నాడు. మీ మీద ఆంక్ష‌లు గ్యారంటీ అన్నాడు. క‌ట్ చేస్తే భార‌త్ ర‌ష్యాతో త‌న‌కున్న  పాత అనుబంధాన్ని ఈ మాయా స్నేహం కోసం కోల్పోలేదు. ఇప్పుడు కూడా పాక్ కి మిలియ‌న్ డాల‌ర్ల కొద్దీ డబ్బులిచ్చి.. అక్క‌డి ఉగ్ర‌వాదుల‌కు ఆయుధాలు అందేలా చేసి.. వారి ద్వారా దాడులు చేయించి.. ఒకయుద్ధ వాతావ‌ర‌ణం  క‌ల్పించి.. త‌ద్వారా.. భార‌త్ చేత ఆయుధ అత్య‌యిక ప‌రిస్థితి క‌ల్పించాల‌న్న‌ది ఒక ఎత్తుగ‌డ‌. కానీ భార‌త్ అయితే ర‌ష్యా.. లేకుంటే ఇజ్రాయెల్ మీద ఆధార ప‌డుతుంది కానీ, యూఎస్ మీద కాదు. ఈ విష‌యం గ్ర‌హించిన అమెరికా త‌న‌కున్న పెద్ద‌న్న పాత్ర‌ను వెంట‌నే గుర్తు చేసుకుని.. భార‌త్- పాక్ మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి కృషి చేశారు. ఇలాగైనా ప‌రువు ద‌క్కించుకుందామ‌ని.

ఈ మొత్తం ఎపిసోడ్ లో చైనా సీనేంట‌ని చూస్తే మీ సార్వ‌భౌమ‌త్వానికి భంగం క‌లిగితే మేము మ‌ద్ధ‌తునిస్తామ‌ని చెప్పి... త‌న దృష్టినంతా బ‌లూచిస్తాన్ మీదే పెట్టింది. బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ.. గానీ బ‌లూచిస్తాన్ ని ఆక్ర‌మించుకుంటే... పాక్ నుంచి విడిపోతే.. త‌మ ఫోక‌స్ మొత్తం షిఫ్ట్  చేద్దామ‌ని చూసింది. అయితే ఆ ప‌ని పూర్తి కాక పోవ‌డంతో తీవ్ర నిరాశ చెందింది డ్రాగ‌న్ దేశం. కార‌ణం త‌మ‌కు కావ‌ల్సింది పాక్ కాదు. పాక్ ఆధీనంలో ఉన్న బ‌లూచిస్తాన్. అక్క‌డున్న అపార‌మైన ఖ‌నిజ వ‌న‌రుల మీదే ఈ దేశ‌పు ధ్యాసంతా. అందుకే తామక్క‌డ‌ గ్వాద‌ర్ పోర్టు నిర్మించింది. అందుకే అక్క‌డ హైబ్రిడ్ రోడ్లు వేసింది. అందుకే అక్క‌డ ఇత‌ర ఎన్నో మౌలిక స‌దుపాయాల‌ను ఏర్పాటు చేసింది. ఈ విష‌యం గుర్తించిన బ‌లూచీలు.. చైనీయుల‌ను తిప్పి కొడుతుంటే.. కూడా లెక్క చేయ‌క ఎయిర్ పోర్టుల‌ను నిర్మించింది. బ‌లూచీలు కూడా ప‌ట్టు వ‌ద‌ల్లేదు. త‌మ‌ను అడ్డు పెట్టుకుని పాక్ చైనాతో చేస్తున్న దందాను గుర్తించి. ఆ దేశ‌ ట్రైన్ ని హైజాక్ చేశారు. ఆపై క్వెట్టాలోని పాక్ స్థావ‌రాల‌పై దాడి చేశారు. ఇంకా ఎన్నో ర‌కాలుగా పాక్ ని దెబ్బ తీసే య‌త్నం చేశారు. బ‌లూచిస్తాన్ లో మూడొంతుల్లో రెండు వంతుల భూభాగం త‌మ ప‌రం చేసుకున్నారు. ఆ కార్య‌క్ర‌మం కూడా పూర్త‌యి ఉంటే అప్పుడు తెలిసేది  చైనా పూర్తి నైజం.

ఇవ‌న్నీ ఇలా ఉంచితే.. పాకిస్తాన్ కి కూడా లోప‌ల ఏమంత స‌జావుగా లేదు. పార్ల‌మెంటులో ఎంపీల నుంచి బ‌య‌ట సాధార‌ణ  ప్ర‌జ‌ల వ‌ర‌కూ అంద‌రూ క‌ల‌సి ఆ దేశ ప్ర‌భుత్వానికి, సైన్యానికీ త‌మ తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇక ఇమ్రాన్ పార్టీ కార్య‌క‌ర్త‌లు సైతం రోడ్ల‌పైకి వ‌చ్చి.. ఇదొక ద‌మ్ములేని ప్ర‌భుత్వ‌మ‌ని ఎద్దేవా చేశారు. త‌మ అధినేత ఇమ్రాన్ని విడిపించి పాక్ ని ర‌క్షించాల‌ని డిమాండ్ చేశారు.

 దానికి తోడు భార‌త్ క‌రాచీ పోర్టు వంటి వాటిని ధ్వంసం చేసి.. దిగుమ‌తుల‌ను సైతం లేకుండా చేయ‌డం.. ఆల్రెడీ దేశంలో ఉన్న క‌రువు కాట‌కాలు. వాటికి తోడు ప్ర‌తిదీ ఎదురు తిర‌గ‌డం. ఉన్న ఆ కొద్ది మంది ఉగ్ర‌వాదులు కూడా చ‌నిపోవ‌డంతో ఏం చేయాలో దిక్కు తోచ‌ని  స్థితిలో ఉంది. ఈ కండీష‌న్లో.. ట్రంప్ ఇలా ఫోన్ చేయ‌డం ఆల‌స్యం అలా.. కాల్పుల విర‌మ‌ణ‌కు ఓకే చెప్పేసింది పాక్. ఆ దేశ మిల‌ట‌రీ డీజీ భార‌త్ మిల‌ట‌రీ డీజీతో డీల్ ఓకే చెప్పేశాడు. అయితే బుద్ధిలేని పాక్ ద‌ళాలు ఎప్ప‌టిలాగానే త‌మ పాత బుద్ధిని ప్ర‌ద‌ర్శిస్తూ.. మ‌న సరిహ‌ద్దుల వెంబ‌డి తిరిగి కాల్పులు జ‌రిపాయి.

ఇవ‌న్నీ ఇలా ఉంచితే.. పాకిస్తాన్ ఈ కాల్పుల విర‌మ‌ణ‌కు త‌లొంచ‌డానికి ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌లు. ఇంత యుద్ధం జ‌రుగుతుంటే త‌మను ఆర్ధికంగా  ఆదుకోమంటూ ఎక్స్ లో పోస్టులు పెట్టిన దారుణ‌మైన ప‌రిస్థితి.  దీంతో ఈ పాపిష్టి దేశం కాల్పుల‌ను విర‌మించుకోవ‌డంలో ఒక అర్ధ‌ముంది కానీ.. భార‌త్ ఇంకా ప‌ట్టు ప‌ట్టి ఉండాల్సిందంటారు నిపుణులు. 

ఈ సారికి పీవోకే స్వాధీనం చేసుకుని ఉండాల్సింది. అక్క‌డి ఉగ్ర మూక‌ల స్తావ‌రాల‌ను ధ్వంసం చేయ‌డంతో స‌రి పెట్ట‌కుండా ఉండాల్సిందంటారు యుద్ధ నిపుణులు. అంతే కాదు బ‌లూచిస్తాన్ సైతం పాక్ నుంచి వేరు ప‌డి ఉండే వ‌ర‌కూ యుద్ధం  కంటిన్యూ చేసి ఉండాల్సింది. ఆ దేశ ఉగ్ర ముఖాలైన హ‌ఫీజ్, మ‌సూద్ ల‌ను అప్ప‌గించే వ‌ర‌కూ కాల్పులను విర‌మించ‌మ‌ని తెగేసి చెప్పి ఉండాల్సింది. ఈ మూడు విష‌యాలైనా.. పాక్ తో మ‌నం ప‌ట్టు వ‌ద‌ల‌కుండా డిమాండ్ చేసి ఉండాల్సిందంటారు పాక్ వ్య‌వ‌హారాల నిపుణులు.

By
en-us Political News

  
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
ప్రజాస్వామ్య విలువలతో కూడిన పాలనకు, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఎలాంటి అరమరికలూ లేకుండా మిత్రధర్మాన్ని తప్పకుండా నడపిన వాజ్ పేయి స్ఫూర్తిగా ముందుకు సాగాలన్న సంకేతాన్ని ఈ విగ్రహావిష్కరణ ద్వారా చంద్రబాబు ఇచ్చారని అంటున్నారు.
బెంగ‌ళూరు టు ఢిల్లీ అన్నట్లుగా ప్ర‌త్యేక ఎపిసోడ్లు న‌డిచాయి. రాహుల్ గాంధీ డీకేకి స్పెష‌ల్ మెసేజీలు పెట్టారు. క‌ట్ చేస్తే ఏదో అనుకుంటే ఏమీ కాలేదు అన్నట్లుగా క‌ర్ణాట‌క‌లో సీఎం మార్పు జరగలేదు. కన్ఫ్యూజన్ కంటిన్యూ అవుతోంది.
2022 నవంబర్ లో అప్పటి వైసీపీ సర్కార్ రోడ్డు విస్తరణ పేరుతో మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని ఇప్పటం అనే కుగ్రామంలో ఇళ్ల ను కూల్చివేసింది. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటించి బాధితులకు అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ గ్రామాన్ని సందర్శిస్తానని అప్పట్లో మాట ఇచ్చారు.
పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది.
దానం విషయంలో మాత్రం ఆయన అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం, ఆ పార్టీ తరఫున ఎంపీగా పోటీలోకి దిగడంతో.. ఇవే కోర్టులో , అలాగే స్పీకర్ ఎదుట తిరుగులేని ఆధారాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో దానంపై అనర్హత వేటు పడటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
మొత్తం మీద ఆ కేసులో కీలక మలుపునకు ఈ పెన్ డ్రైవ్ ఆధారం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని దర్యాప్తు అధికారులు అంటున్నారు. ఈ కేసును త్వరితగతిన దర్యాప్తు చేసి నివేదికను కోర్టుకు సమర్పించాలన్న ఉద్దేశంతో హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో 9 మంది అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పార్టీ పగ్గాలు చేపట్టడానికీ, ప్రధాని మంత్రి పదవిని అధిష్టించడానికి కాంగ్రెస్ లో సమర్థత ఉన్న నేత తన సతీమణి ప్రియాంక వధేరా గాంధీ మాత్రమేనంటూ రాబర్ట్ వధేరా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఈ కార్యక్రమానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే వైఎస్ కుటుంబీకులంతా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలకు వైఎస్ తనయ వైఎస్ షర్మిల మాత్రం హాజరు కాలేదు.
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.