వెంకయ్యను డబుల్ ఇంజిన్ బుల్ డోజ్ చేసిందా?

Publish Date:Aug 11, 2022

Advertisement

ఎంతటి గొప్పవారినైనా అట్టడుగుకు నెట్టేయడం, ఎంతటి అనామకులైనా అమాంతం అందలం ఎక్కించడంలో డబుల్ ఇంజిన్ మోడీ- షా ద్వయానిది అందెవేసిన చేయి. దేశంలో బీజేపీని బతికి బట్టకట్టించేందుకు కాలికి బలపం కట్టుకుని మరీ రథయాత్ర చేసిన ఆ పార్టీ ఒకప్పటి అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీని, ఆ పార్టీ కోసమే తమ సర్వ శక్తియుక్తులను ధార పోసిన మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, దివంగత సుష్మా స్వరాజ్ లాంటి వారికి ఈ డబుల్ ఇంజిన్ ఏమాత్రం ప్రాధాన్యం కల్పించలేదనేది జగమెరిగిన సత్యం. వీరి కోవలోకే తాజాగా పదహారణాల మన తెలుగుబిడ్డ,  తాజా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వస్తారు.

 ఇంత కాలం అనుసరిస్తూ వస్తున్న సాంప్రదాయం ప్రకారం అయితే.. వెంకయ్య నాయుడిని దేశ ప్రథమ పౌరుడిని చేయాల్సి వస్తుంది. లేదంటే జాకీర్ హుస్సేన్ కు అవకాశం ఇచ్చినట్లు రెండోసారైనా వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతి పదవిలో కొనసాగించి ఉండాల్సిందనే అభిప్రాయం ప్రతి తెలుగువాడిలోనూ ఉంది. విద్యార్థి దశ నుంచీ ఏబీవీపీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొని, ఆనక బీజేపీ ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన వెంకయ్య నాయుడికి బలవంతపు విశ్రాంతి ఇవ్వడంతో మోడీ- షా ద్వయం రాజనీతి  ఔచిత్యాన్ని ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వెంకయ్య నాయుడు పోషించిన పాత్ర మరిచిపోలేనిది. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వెంకయ్య నాయుడికి వాజ్ పేయి కేబినెట్ లో సమాచార ప్రసారశాఖ, రవాణా శాఖ లాంటివి ఇస్తానంటే అవి వద్దని, తనకు వ్యవసాయశాఖ కావాలని అడగగలిగిన మనిషి వెంకయ్య నాయుడు. మోడీ హయాంలో పట్టణాభివృద్ధిశాఖ అప్పగించినప్పుడు గ్రామీణ ప్రాంతానికి చెందిన తనకు పట్టణాభివృద్ధి గురించి ఏం తెలుసునని అనగలిగిన వ్యక్తిత్వం వెంకయ్య నాయుడు. అయినప్పటికీ ఆయనకు పట్టణాభివృద్ధి శాఖనే మోడీ కేటాయించడం ప్రధాని మోడీ వ్యక్తిత్వం. అలా తనకు ఇష్టమైన శాఖ కాకుండా వేరే శాఖ ఇచ్చినప్పటికీ అత్యంత చాకచక్యంతో దాన్ని నిర్వహించి మెప్పించిన వ్యక్తి మన వెంకయ్య నాయుడు.

ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన తర్వాత వెంకయ్య నాయుడు నిర్వహించిన మీడియా చిట్ చాట్ లో చేసిన వ్యాఖ్యలు.. ఆయనలో ఏ మూలనో దాగి ఉన్న అసంతృప్తిని వెల్లడించాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయినప్పటికీ వెంకయ్య నాయుడు ఆ అసంతృప్తిని ఇసుమంతైనా బైట పడనివ్వని తీరు ఆయన హుందాతనానికి నిదర్శనం.  కనుక అసంతృప్తిని ఏ మాత్రం బహిర్గతం కానివ్వని తీరు అందరినీ ఆకర్షిస్తోంది. ఆకట్టుకుంటోంది. ప్రధాని, లేదా రాష్ట్రపతి పదవికి పూర్తి అర్హతలున్న ఎల్కే అద్వానీ కూడా ఇలాగే పెద్దమనిషిలా వ్యవహరించారు. ఎలాంటి సమస్య వచ్చినా వెంకయ్య నాయుడు తనదైన శైలిలో చాకచక్యంగా పరిష్కరిస్తారనే పేరు ఉంది. అలాంటి వెంకయ్య నాయుడు మీడియా చిట్ చాట్ లో చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడుదేశ ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి.

మళ్లీ తాను రాజకీయాల్లోకి రానని విస్పష్టంగా చెప్పిన వెంకయ్య, క్రియాశీలకంగా ఉండడం మాత్రం మానుకోనని  స్పష్టం చేశారు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తూనే ఉంటానన్నారు. తన దృష్టికి వచ్చే అంశాలను ప్రధాని దృష్టికి తప్పకుండా తీసుకెళ్తానన్నారు. ఈ సందర్భంగానే వెంకయ్య నాయుడు చేసిన ఒక వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. ‘పుస్తకం రాస్తే.. వాస్తవాలు రాయాలి.. బతికున్నవారి గురించి యథార్థాలు రాస్తే.. అనర్థాలు వస్తాయి’ అని ఆయన చమత్కారంగా అన్నా ఆ మాటల వెనుక నర్మగర్భంగా, నిగూఢంగా ఒకరిపై వేసిన చురకలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజ్యసభ చైర్మన్ గా చివరిరోజు వెంకయ్య నాయుడి కళ్లు చెమ్మగిల్లడం దేశం యావత్తు గమనించింది. కొన్ని సందర్భాల్లో ఆయన కర్ఛీఫ్ తో కళ్లు తుడుచుకున్న దృశ్యాలు కూడా మీడియాలో ప్రసారం అయ్యాయి.

మీడియాతో చిట్ చాట్ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఉప రాష్ట్రపతి తర్వాత రాష్ట్రపతి స్థానానికి వెళ్లలేకపోయాననే బాధ ఏ మాత్రం లేదని చెప్పడం గమనార్హం. తాను ఏదీ కోరుకోకపోయినా.. దేవుడి దయ, పెద్దల అభిమానం వల్ల అన్నీ లభించాయని చెప్పడంలో వెంకయ్య నాయుడిలోని పెద్దమనిషి తత్వం స్పష్టం అవుతోందంటున్నారు. అపూర్వ శక్తి గలిగి, రోజుకు 14 గంటలు పనిచేసే మోడీకి కూడా ‘అప్పడప్పుడూ నవ్వుతూ ఉండాల’ని, ‘అవసరమైనంత నిద్రపోవాల’ని సూచించగల చనువున్న వ్యక్తి వెంకయ్యనాయుడు. అలాంటి వెంకయ్యనాయుడిని మోడీ- షా ద్వయం ఎందుకు ఇలా దారుణంగా పక్కన పెట్టేసిందని మిలియన్ డాలర్ల ప్రశ్నగా వస్తోంది.

By
en-us Political News

  
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే..  క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో  అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.