ఢిల్లీ మద్యం కుంభకోణం నేపథ్యంలో హైదరాబాద్లో ఈడీ దాడులు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటి వరకూ ఊహించని విధంగా ఇండియా అహెడ్ ఆంగ్ల వార్తా ఛానెల్ మీదా దాడులు చేపట్టడం ఒక్కసారిగా పత్రికా లోకం ఆశ్చర్యపరిచింది. తెలుగు దినపత్రిక ఆంధ్రప్రభ యాజమాన్యానికి సంబంధించిన ఈ ఆంగ్ల వార్తా ఛానల్ మీద ఈడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో కొంతకాలం సేల్స్ విభాగం అధిపతిగా ఉన్న అర్జున్ పాండే కుంభకోణంలో కీలకపాత్ర వహించడం మరింత వెలుగులోకి వచ్చింది. అలాగే ఇందులో మరొక కీలక వ్యక్తిగా భావిస్తున్న బోయినపల్లి అభిషేక్ కూడా ఆంధ్రప్రభ ఇండియా అహెడ్లో పెట్టుబడు లు పెట్టారన్నది బయటపడింది. ఈ నేపథ్యంలోనే పక్కా ఆధారలతో శుక్రవారం ఆంధ్రప్రభ యజమాని ముత్తా గోపాల కృష్ణను ఈడీ ప్రశ్నించింది.
శుక్రవారం ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్లతో పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో ఈడీ తాజా దాడులు చేప ట్టింది. ఇందులో భాగంగానే హైదరాబాద్లోని ఆంధ్రప్రభ కార్యాలయంపైనా సాయింత్రవరకూ సోదాలు చేశారు. మరీ ముఖ్యంగా అసలు ఈ కుంభకోణంలో కీలకంగా భావిస్తున్న అర్జున్ పాండేకు ముత్తా గోపాల కృష్ణ కుటుంబం నిర్వహిస్తున్న ఆంగ్ల ఛానల్కి సంబంధాల మీదనే ఎక్కువ దృష్టి పెట్టారు. అంతేగాక,
ఢిల్లీలో ఉప ముఖ్యమత్రి మనీష్ సిసోడియా సన్నిహితుడుగా భావిస్తున్న దినేశ్ అరోరా, హైదరాబాద్లో అభినవ్(మాదాపూర్), శరత్ చంద్ర(కూకట్పల్లి) ఇళ్లపైనా దాడులు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపా రు. గతంలో అరెస్టు చేసిన సమీర్ మహేంద్రు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ దాడులు జరిగాయి.
తెలంగాణా అధికార టీఆర్ ఎస్ పార్టీ ముఖ్యనేతలకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న బోయిన్పల్లి అభి షేక్ నివాసం, కార్యాలయాల్లో ఈడీ గతంలో దాడి చేసినపుడు లిక్కర్ స్కామ్లో ఏ-14గా ఉన్న రామ చంద్ర పిళ్లై సంస్థల్లో అభిషేక్ భాగస్వామిగా ఉన్నట్టు తెలిపే ఆధారాలు లభించాయి. ఇపుడు తాజాగా ఇండియా అహెడ్ సంస్థలో అభిషేక్ డైరెక్టర్గా ఉన్నసంగతి వెలుగుచూసింది. ముత్తా గోపాలకృష్ణ కుమా రుడు గౌతమ్తో పాటు అభి షేక్ జేఈయూ ఎస్ నెట్వర్కింగ్ ప్రయివేట్ లిమిటెడ్కు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ సంస్థ కు 2021 నుంచీ అభిషేక్ డైరెక్టర్గా ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏ-15గా ఉన్న అర్జున్ పాండే అక్కడి మీడియాకు కీలకంగా వ్యవహరించినట్టు సిబీ ఐ ఆరోపించింది. ఇండోస్పిరిట్ సంస్ఠ ఎండీ సమీర్ మహేంద్రు నుంచి ఓన్లీ మచ్ లౌడర్ సంస్థ సీఈవో విజయ్ నాయర్ తరపున అర్జున్ పాండే కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. జూబ్లీహిల్స్ కార్యాలయంలో సోదాల్లో పలు పత్రాలు సాంకేతిక ఆధారాల్ని ఈడీ బృందాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి గచ్చిబౌలిలోనూ ఈడీ ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/delhiliquorscameed-searches-mutta-39-145074.html
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.