ఇండియాలో రీప్యాకింగ్ దందా.. అమెరికా, దుబాయ్ నుంచి ఎక్స్ పైర్ అయిన సరుకు.!

Publish Date:Jul 17, 2026

Advertisement

మార్కెట్లో లభించే విదేశీ బ్రాండ్ల చాక్లెట్లు, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ విషయంలో జరుగుతున్న భారీ నకిలీ దందా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు.  అమెరికా, దుబాయ్ వంటి దేశాల నుండి గడువు ముగిసిన (ఎక్స్ పైర్ అయిన) ఆహార పదార్థాలను తక్కువ ధరకు తెప్పించి, వాటిపై కొత్త తయారీ తేదీలను ముద్రించి మార్కెట్లో విక్రయిస్తున్న  ముఠాను పోలీసులు పట్టుకున్నారు.

ఈ ముఠాకు సూత్రధారి అయిన 54 ఏళ్ల అటల్ జైస్వాల్ తో పాటు అతని ఆరుగురు సహచరులను పోలీసులు అరెస్ట్ చేశారు.  ఇండియాలో  ఇంపోర్టెడ్ ఫుడ్ వ్యాపారం పేరిట వీరు ఈ భారీ మోసానికి తెరలేపారు.  పోలీసుల కథనం ప్రకారం..  అటల్ జైస్వాల్,  అతని గ్యాంగ్ అమెరికా, దుబాయ్ లలోని కొన్ని ఏజెన్సీలతో చేతులు కలిపి . అక్కడ ఎక్స్ పైరీ డేట్ ముగిసిన  అంతర్జాతీయ బ్రాండ్ల ఉత్పత్తులను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి, వాటిపై కొత్త ఎక్స్ పైరీ డేట్లు ముద్రించి విక్రయించేవారు. 

ప్రధానంగా ఓరియో బిస్కెట్లు, కేకులు, కోకోకోలా వంటి విదేశీ పానియాలు, అలాగే విదేశీ బ్రండ్ల చాక్లెట్లు, స్నాక్స్ ను కంటైనర్ల ద్వారా ఇండియాకు రప్పించి, వాటి ఎక్స్ పైరీ డేట్ తేదీలను మార్చి మార్కెట్లోకి పంపేవారు. ఈ ముఠ.. తమ రహస్య గోడౌన్లలో  గడువు ముగిసిన తేదీలను కెమికల్స్ ఉపయోగించి పూర్తిగా చెరిపేసేవారు. ఆపై అత్యాధునిక ప్రింటింగ్ మిషన్ల ద్వారా ఆ ప్యాకెట్లపై   త్త ఎక్స్‌పైరీ తేదీలను, మ్యానుఫ్యాక్చరింగ్ తేదీలను ముద్రించేవారు. ఇలా రీ ప్యాకింగ్ చేసిన నకిలీ, ఆరోగ్యానికి హానికరమైన విదేశీ ఆహార పదార్థాలను దేశంలోని ప్రముఖ సూపర్ మార్కెట్లు, ఆన్‌లైన్ గ్రాసరీ స్టోర్లు, విదేశీ వస్తువులు అమ్మే ప్రీమియం షాపులకు విక్రయించి కోట్ల రూపాయలు ఆర్జించారు.

విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు వీరి గోడౌన్ల పై మెరుపు దాడులు నిర్వహించారు.  ఈ దాడుల్లో లక్షలాది రూపాయల విలువైన గడువు ముగిసిన ఓరియో బిస్కెట్లు, విదేశీ కోకాకోలా బాటిళ్లు, చాక్లెట్లతో పాటు డేట్లు మార్చేందుకు ఉపయోగించే కెమికల్స్, ప్రింటింగ్ డైలు, ప్యాకేజింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. 

  Imported food scam, Expired food racket, Atal Jaiswal arrest, Fake expiry date scam, Re-packaging fraud

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన కలకలం రేపింది.
ఢిల్లీ వేదికగా సాగుతున్న ప్రజా పోరాటంలో మరో కీలక అంకం మొదలైంది.
హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో శనివారం హైడ్రా భారీ స్థాయిలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌
ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్–2026 ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో విజేతలుగా నిలిచిన సినీ ప్రముఖులకు
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా ప్రపంచ కప్ తుది పోరు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా ప్రేమికులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. విషసర్పంతో భర్త ప్రాణాలు తీసిన భార్య..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ వేదికగా దేశ రాజకీయాల్లో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో ఓ ప్రయాణికుడు చేసిన నిర్లక్ష్య వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది.
ప్రకృతి ప్రకోపం.. క్లౌడ్ బరస్ట్‌తో విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలు..!
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఒకే రోజు చోటుచేసుకున్న రెండు విషాద మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.