Publish Date:Jun 18, 2024
మదనపల్లిలో హరిత అనే అందమైన, తెలివైన అచ్చ తెలుగు అమ్మాయి వుంది. బీఎస్సీ, బీఈడీ చదివింది. హరితని చూడగానే ముసలోళ్ళకి ‘ఇలాంటి కూతురు నాక్కూడా వుంటే ఎంత బాగుండేదో’ అనిపిస్తుంది. కుర్రోళ్ళకి ‘ఇలాంటి భార్య నాకు వుంటే ఎంత బాగుంటుందో’ అనిపిస్తుంది. అలాంటి ముచ్చటైన హరితని అలా తీర్చిదిద్దింది ఎవరో కాదు.. ఆమె తల్లిదండ్రులు. వాళ్ళకి హరిత ఒక్కటే కూతురు. తల్లి ఈమధ్యే మరణించారు. తండ్రి దొరస్వామి గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. వీళ్ళకి చక్కటి సొంత ఇల్లు కూడా వుంది. ఈ మేటరంతా చదివినవాళ్ళకి ఏం అనిపిస్తుంది? ఈ బంగారు బొమ్మ హరితకి ఆమె తండ్రి దొరస్వామి మంచి సంబంధం చూసి పెళ్ళి చేయాలని, ఆమె పిల్లాపాపలతో కలకాలం హాయిగా జీవించాలని అనిపిస్తుంది కదూ. ఈ ఆకాంక్షకి అనుగుణంగానే హరితకి మంచి సంబంధం చూడాలని దొరస్వామి ప్రయత్నాలు ప్రారంభించారు. కూతురు పెళ్ళికోసం దాచిన డబ్బుని, ఆమె అకౌంట్లోనే వేశారు. తల్లి బంగారాన్ని కూడా హరితకే అప్పగించారు. హరితకు సరిపోయే సంబంధం కోసం ఆయన ఉద్యోగానికి లీవులు పెట్టుకుని, కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు.
ఆ తండ్రి సంగతి అలా వుంటే, మన బంగారు తల్లి హరిత వ్యవహారం మరోలా వుంది. పాపం హరిత మనసు చాలా పెద్దది కావడంతో, ఆ మనసులో చాలా చోటు వుండటంతో రమేష్, సాయికృష్ణ, హరీష్రెడ్డి అనే ముగ్గురు కుర్రాళ్ళకి తన మనసులో చోటు ఇచ్చింది. ఒకరికి తెలియకుండా ఒకరితో ఆ ముగ్గురు కుర్రాళ్ళతో సన్నిహితంగా వుంటోంది. వాళ్ళకి తన మనసులో చోటు ఇవ్వడంతోపాటు, తన తండ్రి ఇచ్చిన డబ్బులో ఎనిమిది లక్షల రూపాయలని తన ఒక ప్రియుడు సాయికృష్ణకి ఇచ్చింది. తల్లి నగలని రమేష్కి ఇచ్చింది. రమేష్ ఆ నగలని ఎంచక్కా తాకట్టు పెట్టుకుని పదకొండున్న లక్షలు అప్పుగా తీసుకుని ఎంజాయ్ చేస్తున్నాడు.
తన ముద్దుల కూతురు హరిత ముసుగులో వ్యవహారాలన్నీ తెలుసుకున్న తండ్రి దొరస్వామి ఆమెకి ఇక పెళ్ళి చేసేస్తే మంచిదని నిర్ణయించుకున్నాడు. దానికి హరిత నో చెప్పింది. ఇప్పటికే తన మనసులో ముగ్గురు వున్నారని, తన మనసులో పెళ్ళి పేరుతో మరొకరికి చోటు ఇవ్వలేనని కరాఖండీగా చెప్పేసింది. ఈ అంశం మీద తండ్రీ కూతుళ్ళ మధ్య నెల రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఇక తండ్రితో ఇలా గొడవలు పడుతూ ఆయన్ని బాధపెట్టడం ఇష్టంలేని హరిత ఈనెల 13న ఒక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో తన చేతికి దొరికిన పచ్చడి బండ, చపాతీ కర్ర, తాళం కప్ప... ఇలాంటి హోమ్లీ వస్తువులతో తండ్రి నెత్తిమీద కొట్టి చంపేసింది. తన తండ్రి కాలుజారి పడిపోయి చనిపోయాడని చుట్టుపక్కలవాళ్ళకి చెప్పింది. పోలీసులకూ అదే చెప్పింది. అన్నీ కరెక్టుగా వుంటేనే పోలీసులు అనుమానంగా చూస్తారు. ఇలాంటి తేడా కేసుని అనుమానించరా? పోలీసులు అనుమానంతో చేసిన దర్యాప్తులో అసలు విషయాలన్నీ బయటపడ్డాయి. ప్రస్తుతం అందాల హరిత రిమాండ్ ఖైదీగా జైల్లో వుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/daughter-kills-father-25-178884.html
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.